AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maharashtra: ఆహారం రుచిగా వండలేదనీ.. తల్లిని హత్య చేసిన కొడుకు!

వంట రుచిగా లేదని తల్లిని హత్య చేశాడు ఓ కొడుకు. ఈ దారుణ ఘటన మహారాష్ట్రలోని థానే జిల్లా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని థానే జిల్లా ముర్బాద్ తాలూకాలోని వేలు గ్రామానికి చెందిన ఓ యువకుడు తల్లతో నిత్యం గొడవపడేవాడు. ఇంట్లోని పలు సమస్యలపై తల్లీ కుమారుల మధ్య గొడవలు జరిగేవి. ఈక్రమంలో ఆదివారం సాయంత్రం ఇంటికి వచ్చిన కుమారుడికి తల్లి ఆహారం వడ్డించింది. అది తిన్న కుమారుడు వంటలు రుచిగా లేవని తల్లితో గొడవ..

Maharashtra: ఆహారం రుచిగా వండలేదనీ.. తల్లిని హత్య చేసిన కొడుకు!
Man Kills His Mother
Srilakshmi C
|

Updated on: Nov 28, 2023 | 10:48 AM

Share

థానే, నవంబర్‌ 28: వంట రుచిగా లేదని తల్లిని హత్య చేశాడు ఓ కొడుకు. ఈ దారుణ ఘటన మహారాష్ట్రలోని థానే జిల్లా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని థానే జిల్లా ముర్బాద్ తాలూకాలోని వేలు గ్రామానికి చెందిన ఓ యువకుడు తల్లతో నిత్యం గొడవపడేవాడు. ఇంట్లోని పలు సమస్యలపై తల్లీ కుమారుల మధ్య గొడవలు జరిగేవి. ఈక్రమంలో ఆదివారం సాయంత్రం ఇంటికి వచ్చిన కుమారుడికి తల్లి ఆహారం వడ్డించింది. అది తిన్న కుమారుడు వంటలు రుచిగా లేవని తల్లితో గొడవ పడ్డాడు. కోపంతో రగిలిపోయిన కుమారుడు తల్లి మెడపై కొడవిలతో దాడి చేశాడు.

తీవ్ర రక్తస్రావంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఇరుకుపొరుగు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటన జరిగిన తర్వాత నిందితుడు నిద్రమాత్రలు అధిక మోతాదులో తీసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో అతని సమీప బంధువులు ఆసుపత్రిలో చేర్చారు. దీంతో నిందితుడిని ఇంకా అరెస్టు చేయలేదని అధికారి తెలిపారు. నిందితుడిపై భారత శిక్షాస్మృతి సెక్షన్ 302 (హత్య) కింద సోమవారం కేసు నమోదు చేసినట్లు థానే రూరల్ పోలీస్ కంట్రోల్ రూమ్ అధికారి మంగళవారం (నవంబర్‌ 28) మీడియాకు తెలిపారు.

ఆటో డ్రైవర్‌పై దాడి, ఇద్దరు AIMIM మద్దతుదారులు అరెస్ట్

హైదరాబాద్‌లోని ఆటో డ్రైవర్‌పై దాడి చేసిన ఘటనలో ఇద్దరు ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) మద్దతుదారులను పోలీసులు నవంబర్ 27(సోమవారం) అరెస్టు చేశారు. పోలీసు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితుడు మహ్మద్ సలీమ్ (33) సింగరేణి కాలనీలో ఉన్న తమ ఇంటికి తిరిగి వస్తుండగా, నలుగురు వ్యక్తులు అతనిపై దాడి చేశారు. తన ఆటోపై మజ్లిస్ బచావో తెహ్రీక్ (ఎంబిటి) పార్టీ జెండా ఉంచినందుకు తనను కొట్టారని సలీమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతను తప్పించుకోవడానికి ప్రయత్నించగా హనాఫియా మసీదు వద్ద పట్టుబడ్డాడని, దాడి చేసినవారు అతనిని తీవ్రంగా కొట్టినట్లు తెలిపారు. ఈ ఘటనలో మొహమ్మద్ రిజ్వాన్ (34), మొహమ్మద్ ఖదీరుద్దీన్ (23) అనే ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. మిగిలిన ఇద్దరు పరారీలో ఉన్నట్లు పోలీసు తెలిపారు. ఖదీరుద్దీన్ నుంచి పోలీసులు మోటారు బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఓ అధికారి తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
భారీ భూకంపం.. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో ప్రకంపనలు
భారీ భూకంపం.. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో ప్రకంపనలు
రాత్రి పడుకునే ముందు ఈ ఒక్క పని చేయండి.. మీరు ఊహించని విధంగా..
రాత్రి పడుకునే ముందు ఈ ఒక్క పని చేయండి.. మీరు ఊహించని విధంగా..
అగ్రరాజ్యం టెక్ సామ్రాజ్యంపై ఇరాన్ పంజా! కంపెనీలకు డెత్ వారెంట్..
అగ్రరాజ్యం టెక్ సామ్రాజ్యంపై ఇరాన్ పంజా! కంపెనీలకు డెత్ వారెంట్..
మెట్రోలో సిగరేట్ తాగితే ఎలాంటి శిక్ష వేస్తారో తెలుసా..?
మెట్రోలో సిగరేట్ తాగితే ఎలాంటి శిక్ష వేస్తారో తెలుసా..?
తొలుత మాత్రే.. చివర్లో దుబే, సర్ఫరాజ్.. పంజాబ్ టార్గెట్ ఎంతంటే?
తొలుత మాత్రే.. చివర్లో దుబే, సర్ఫరాజ్.. పంజాబ్ టార్గెట్ ఎంతంటే?
రాకాస రివ్యూ.. నిహారిక ఖాతాలో మరో హిట్ ప‌డిందా
రాకాస రివ్యూ.. నిహారిక ఖాతాలో మరో హిట్ ప‌డిందా
రేసింగ్ + ఎమోషన్‌.. శర్వా ఈసారి కూడా గట్టెక్కేశాడు
రేసింగ్ + ఎమోషన్‌.. శర్వా ఈసారి కూడా గట్టెక్కేశాడు
సెకండ్ హ్యాండ్ ఎలక్ట్రిక్ కారు కొంటున్నారా.. ఇవి చెక్ చేయకపోతే..
సెకండ్ హ్యాండ్ ఎలక్ట్రిక్ కారు కొంటున్నారా.. ఇవి చెక్ చేయకపోతే..
టోల్ గేట్ల వద్ద క్యాష్ పేమెంట్స్ బంద్.. ఎప్పటినుంచంటే..?
టోల్ గేట్ల వద్ద క్యాష్ పేమెంట్స్ బంద్.. ఎప్పటినుంచంటే..?
చనిపోయినప్పుడు సౌందర్య బాడీకి తల లేదు.. అలా చూసి తట్టుకోలేకపోయాను
చనిపోయినప్పుడు సౌందర్య బాడీకి తల లేదు.. అలా చూసి తట్టుకోలేకపోయాను