గాయపడ్డ వ్యక్తిని ఆసుపత్రికి తరలించిన కుటుంబసభ్యులు.. చివరికి చేయినే తీసేశారు..!
మెయిన్పురిలోని సుల్తాన్గంజ్ బ్లాక్లోని చాచా గ్రామానికి చెందిన అశోక్ కుమార్ అనే వ్యక్తి సోదరుడు మేఘనాథ్ నవంర్ 18న జరిగిన ప్రమాదంలో గాయపడ్డాడు. ఈ సంఘటన గురించి తెలుసుకున్న అశోక్ కుమార్ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మేఘనాథ్ను ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స కోసం అతనికి 30,000 రూపాయలు వసూలు చేశారు.

మధ్యప్రదేశ్లో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఒక యువకుడి చేయి నరికివేయాల్సి వచ్చింది. మెయిన్పురి ప్రాంతానికి చెందిన యువకుడు కొన్ని రోజుల క్రితం ఒక ప్రమాదంలో చిక్కుకున్నాడు. ఆ తర్వాత అతని సోదరుడు అతన్ని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. ప్రైవేట్ ఆసుపత్రిలో ఇద్దరు వైద్యులు తన సోదరుడికి చికిత్స చేశారని, కానీ తరువాత వైద్యులు బాధితుడి చేతిలోని నరాలను తప్పుగా అనుసంధానించారని, అతని చేయి పని చేయకుండాపోయిందని సోదరులు ఆరోపించారు.
మెయిన్పురిలోని సుల్తాన్గంజ్ బ్లాక్లోని చాచా గ్రామానికి చెందిన అశోక్ కుమార్ అనే వ్యక్తి సోదరుడు మేఘనాథ్ నవంర్ 18న జరిగిన ప్రమాదంలో గాయపడ్డాడు. ఈ సంఘటన గురించి తెలుసుకున్న అశోక్ కుమార్ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మేఘనాథ్ను ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స కోసం అతనికి 30,000 రూపాయలు వసూలు చేశారు.
అశోక్ కుమార్ జిల్లా మేజిస్ట్రేట్ అంజని కుమార్ సింగ్ కు ఫిర్యాదు చేస్తూ, “నేను గాయపడిన నా సోదరుడిని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించాను. అక్కడ, వైద్యులుగా నటిస్తూ ఇద్దరు వ్యక్తులు తన సోదరుడి చికిత్స కోసం 30,000 రూపాయలు వసూలు చేశారు. నా సోదరుడి చేతికి శస్త్రచికిత్స జరిగింది. ఐదు రోజుల ఆసుపత్రి చికిత్స తర్వాత, అతను డిశ్చార్జ్ అయ్యాడు” అని అన్నారు.
మేఘనాథ్ ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన తర్వాత, వారు అతన్ని ఇంటికి తీసుకెళ్లారని, కానీ అక్కడికి చేరుకున్న తర్వాత, అతనికి మరిన్ని సమస్యలు మొదలయ్యాయని అశోక్ కుమార్ వివరించారు. ఆందోళన చెందుతూ, అతన్ని మరొక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యులు అతన్ని పరీక్షించి, అతని చేతిలోని నరాలు తప్పుగా అనుసంధానించారని నిర్ధారించారు. మేఘనాథ్ ప్రాణాలను కాపాడాలంటే, అతని చేతిని కత్తిరించాల్సి ఉంటుందని వైద్యలు సలహా ఇచ్చారు. చేయి కత్తిరించకపోతే, ఇన్ఫెక్షన్ పెరిగి, అతని ప్రాణాలకు ముప్పు కలిగించే అవకాశం ఉందన్నారు. అందువల్ల, ఆ యువకుడి ప్రాణాలను కాపాడటానికి, అతని చేతిని కత్తిరించారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా, మేఘనాథ్ తన చేతిని కోల్పోయాడు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




