Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shirdi Sai Temple: బాబా భక్తులకు ముఖ్యగమనిక..! మే 1 నుండి షిర్డీ సాయి దేవాలయం మూసివేత..!! ఎందుకంటే..

ఈ ఆలయానికి వస్తున్న విరాళం తరచుగా చర్చనీయాంశంగా మారుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో మే 1వ తేదీ నుంచి షిర్డీ సాయి మందిరాన్ని మూసివేస్తున్నట్లు యాజమాన్య బోర్డు ప్రకటించడం భక్తులను ఆశ్చర్యానికి గురి చేసింది. సాయిబాబా ఆలయ భద్రతకు..

Shirdi Sai Temple: బాబా భక్తులకు ముఖ్యగమనిక..! మే 1 నుండి షిర్డీ సాయి దేవాలయం మూసివేత..!! ఎందుకంటే..
Shirdi Sai Temple
Follow us
Jyothi Gadda

|

Updated on: Apr 27, 2023 | 5:50 PM

షిర్డీ సాయిబాబా మందిరం అత్యంత ప్రసిద్ధ దేవాలయం. షిర్డీ సాయి బాబాకు భారతదేశం, విదేశాలలో కూడా లక్షలాది మంది భక్తులు ఉన్నారు. కోట్లాది మంది భక్తులు ఉండడం వల్ల షిర్డీ సాయి ఆలయానికి విరివిగా విరాళాలు అందుతున్నాయి. ఈ ఆలయానికి వస్తున్న విరాళం తరచుగా చర్చనీయాంశంగా మారుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో మే 1వ తేదీ నుంచి షిర్డీ సాయి మందిరాన్ని మూసివేస్తున్నట్లు యాజమాన్య బోర్డు ప్రకటించడం భక్తులను ఆశ్చర్యానికి గురి చేసింది. సాయిబాబా ఆలయ భద్రతకు సీఐఎస్‌ఎఫ్‌ను నియమించాలన్న ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నిరవధిక బంద్‌కు పిలుపునిచ్చారు. ప్రధానంగా పారిశ్రామిక స్థాపనలు, మెట్రో స్టేషన్లు, విమానాశ్రయాలను రక్షించే CISFని మోహరించే నిర్ణయానికి వ్యతిరేకంగా ఆలయ నిర్వాహకులు నిరసన వ్యక్తం చేస్తున్నారు.

అహ్మద్‌నగర్‌లోని షిర్డీలో నిర్మించిన ఈ సాయిబాబా ఆలయం భారతదేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా ప్రసిద్ధి చెందింది. సాయిబాబా దర్శనం కోసం దేశం నలుమూలల నుంచి భక్తులు ఇక్కడికి వస్తుంటారు. ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు షిర్డీ బాబా దర్శనం కోసం వస్తుంటారు. షిర్డీలోని సాయి మందిరం అహ్మద్‌నగర్-మన్మాడ్ రహదారిపై ఉంది.

భద్రతకు బాధ్యత వహిస్తున్న CISF అన్ని పారిశ్రామిక సంస్థలు, మెట్రో స్టేషన్లు, విమానాశ్రయాల భద్రతకు బాధ్యత వహిస్తుంది. అయితే షిర్డీ ఆలయంలో సీఐఎస్‌ఎఫ్‌ని మాత్రమే మోహరించడం ఇక్కడి భక్తులను కలవరపెడుతోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..