Population: లేచింది మహిళా లోకం.. తొలిసారిగా దేశంలో పురుషులను దాటిన మహిళల సంఖ్య.. వివరాలివే..

దేశానికి ఒక పెద్ద శుభవార్త వచ్చింది. భారతదేశంలోని మొత్తం జనాభాలో తొలిసారిగా 1000 మంది పురుషులకు స్త్రీల సంఖ్య 1020కి పెరిగింది.

Population: లేచింది మహిళా లోకం.. తొలిసారిగా దేశంలో పురుషులను దాటిన మహిళల సంఖ్య.. వివరాలివే..
Female Population In India
Follow us

|

Updated on: Nov 25, 2021 | 1:18 PM

Population: దేశానికి ఒక పెద్ద శుభవార్త వచ్చింది. భారతదేశంలోని మొత్తం జనాభాలో తొలిసారిగా 1000 మంది పురుషులకు స్త్రీల సంఖ్య 1020కి పెరిగింది. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-5 గణాంకాలు ఇదే చెబుతున్నాయి. వీటిని బుధవారం (నవంబర్ 24) విడుదల చేశారు. అంతకుముందు 2015-16లో నిర్వహించిన NFHS-4లో, ఈ సంఖ్య 1000 మంది పురుషులకు 991 మంది స్త్రీలుగా ఉంది.

ఇది మాత్రమే కాదు, పుట్టినప్పుడు లింగ నిష్పత్తి కూడా మెరుగుపడింది. 2015-16లో 1000 మంది పిల్లలకు 919 మంది బాలికలు ఉన్నారు. తాజా సర్వేలో ఈ సంఖ్య 1000 మంది పిల్లలకు 929 మంది బాలికలకు చేరుకుంది. విశేషమేమిటంటే, మొత్తం జనాభాలో లింగ నిష్పత్తి నగరాల కంటే గ్రామాల్లో మెరుగ్గా ఉంది. గ్రామాల్లో ప్రతి 1000 మంది పురుషులకు 1037 మంది మహిళలు ఉండగా, నగరాల్లో 985 మంది మహిళలు మాత్రమే ఉన్నారు.

దేశంలోనే తొలిసారిగా తగ్గిన సంతానోత్పత్తి రేటు

దేశంలో తొలిసారిగా సంతానోత్పత్తి రేటు 2కి తగ్గింది. 2015-16లో ఇది 2.2. ప్రత్యేక విషయం ఏమిటంటే, సంతానోత్పత్తి రేటు 2.1 భర్తీ గుర్తుగా పరిగణిస్తారు. అంటే, ఒక జంట ఇద్దరు పిల్లలకు జన్మనిస్తుంటే, ఆ ఇద్దరు పిల్లలు వారి స్థానంలో ఉంటారు. 2 కంటే తక్కువ పిల్లలను కలిగి ఉండటం అంటే జనాభా తగ్గిపోతుందని భావిస్తున్నారు. జనాభా పెరుగుదల 2.1 సంతానోత్పత్తి రేటు వద్ద స్థిరంగా ఉంటుంది.

అయినా కానీ..

జనాభాలో మహిళల నిష్పత్తి పెరిగినప్పటికీ, 41% మంది మహిళలు మాత్రమే 10 సంవత్సరాల కంటే ఎక్కువ విద్యను పొందారు. ఇప్పటివరకు వారి పరిస్థితి పెద్దగా మెరుగుపడలేదు. నేటికీ, దేశంలోని 41% మంది మహిళలు 10 సంవత్సరాల కంటే ఎక్కువ పాఠశాల విద్యను పొందిన వారు, అంటే వారు 10 వ తరగతి దాటి చదవగలుగుతున్నారు. 59% మంది మహిళలు 10వ తరగతికి మించి చదవలేరు. గ్రామీణ ప్రాంతాల్లో 33.7% మంది మహిళలు మాత్రమే 10వ తరగతి దాటి చదవగలరు. 5G యుగంలో కూడా, దేశంలో కేవలం 33.3% మంది మహిళలకు మాత్రమే ఇంటర్నెట్ అందుబాటులో ఉంది.

సొంత బ్యాంకు ఖాతా ఉన్న మహిళల సంఖ్య 25% పెరిగింది 78.6% మహిళలు తమ సొంత బ్యాంకు ఖాతాను నిర్వహిస్తున్నారు. 2015-16లో ఈ సంఖ్య 53% మాత్రమే. అదే సమయంలో, 43.3% మంది మహిళలు తమ పేరు మీద కొంత ఆస్తిని కలిగి ఉన్నారు. అయితే, 2015-16లో ఈ సంఖ్య 38.4% మాత్రమే. రుతుస్రావం సమయంలో సురక్షితమైన పారిశుద్ధ్య చర్యలను అనుసరించే మహిళలు 57.6% నుంచి 77.3%కి పెరిగారు. అయినప్పటికీ, పిల్లలు.. స్త్రీలలో రక్తహీనత ప్రధాన ఆందోళన కలిగించేదిగా మారింది. 67.1% మంది పిల్లలు.. 57% మంది స్త్రీలు 15 నుంచి 49 సంవత్సరాల మధ్య రక్తహీనతతో బాధపడుతున్నారు.

జనాభాలో 30% మందికి స్వంత ఆధునిక మరుగుదొడ్లు లేవు

2015-16లో, 48.5% వారి స్వంత ఆధునిక మరుగుదొడ్లను కలిగి ఉన్నారు. 2019-21లో ఈ సంఖ్య 70.2 శాతానికి పెరిగింది. కానీ 30% మంది ఇప్పటికీ వాటిని పొందలేకపోయారు. దేశంలోని 96.8% కుటుంబాలకు విద్యుత్తు చేరింది.

ఇవి కూడా చదవండి: Weight Loss: బరువు తగ్గాలని కడుపు మాడ్చుకుంటే ప్రయోజనం లేదు.. ఆహారాన్ని ఇలా తీసుకోవడం ద్వారా కూడా సన్నపడవచ్చు..

Air Purifiers for home: ఇంటిలో గాలిని స్వచ్చంగా మార్చే ప్యూరిఫైయర్స్.. పనితీరులో అత్యధిక రేటింగ్ ఉన్నవి ఏమిటో తెలుసుకోండి!

Mysterious Stone: బంగారం కోసం వెతికితే పెద్ద రాయి దొరికింది.. అదేమిటో తెలుసుకుని అవాక్కయ్యాడు!