AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Diwali bonus: రేషన్‌ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ దీపావళి బోనస్‌.. కీలక ప్రకటన చేసిన ప్రభుత్వం.. ఎక్కడంటే..

మరికొద్ది రోజుల్లో కంపెనీలు కూడా తమ ఉద్యోగులకు పండుగ బోనస్‌లు, బహుమతులు ఇవ్వడం ప్రారంభించనున్నాయి. వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు తమ పౌరులకు బహుమతులు కూడా ప్రకటిస్తాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు

Diwali bonus:  రేషన్‌ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ దీపావళి బోనస్‌.. కీలక ప్రకటన చేసిన ప్రభుత్వం.. ఎక్కడంటే..
Ration
Jyothi Gadda
|

Updated on: Oct 11, 2022 | 2:20 PM

Share

దీపావళి 2022 బోనస్: దీపావళి పండుగ ప్రారంభానికి కొన్ని రోజులే మిగిలి ఉన్నాయి. ఈ పవిత్ర పండుగ సందర్భంగా కుటుంబ పెద్దలు, బంధువులు కానుకలు అందజేస్తారు. మరికొద్ది రోజుల్లో కంపెనీలు కూడా తమ ఉద్యోగులకు పండుగ బోనస్‌లు, బహుమతులు ఇవ్వడం ప్రారంభించనున్నాయి. వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు తమ పౌరులకు బహుమతులు కూడా ప్రకటిస్తాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వం తన పౌరుల కోసం కీలక ప్రకటన చేసింది. అంతేకాదు, మీరు కూడా మహారాష్ట్రలో నివసిస్తున్నారా..? రేషన్ కార్డు కలిగి ఉన్నట్లయితే ఈ శుభవార్త మీకోసమే.

ఇవన్నీ కేవలం రూ.100కే లభిస్తాయని మహారాష్ట్ర మంత్రివర్గం ప్రకటించింది. రాష్ట్రంలోని రేషన్ కార్డుదారులకు వచ్చే దీపావళి పండుగ రోజున కేవలం రూ.100కే కిరాణా సరుకులు పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అవును, రాష్ట్ర ప్రజలకు ఈ ప్యాకెట్ కేవలం రూ.100కే లభిస్తుంది.ఈ ప్యాకెట్‌లో 1 కిలో సెమ్యా, వేరు శనగలు, వంటనూనె, పసుపు తదితరాలు ఉంటాయి.

రాష్ట్రంలో కోట్లాది మంది రేషన్‌కార్డులు ఉన్న ఆహార పౌరసరఫరాల శాఖ వినియోగదారుల రక్షణ శాఖ ఈ ప్రతిపాదనను తీసుకొచ్చిందని సంబంధిత అధికారులు పేర్కొన్నారు.. ఈ నేపథ్యంలో కేబినెట్ ప్రకటనలో రాష్ట్రంలో 1.70 కోట్ల కుటుంబాలు అంటే ఏడు కోట్ల మందికి రేషన్ కార్డులు ఉన్నాయి. ప్రభుత్వ రేషన్ షాపుల నుంచి ఆహార ధాన్యాలు కొనుగోలు చేసేందుకు అర్హులు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..