AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భార్యను చంపేందుకు తలుపులకు విద్యుత్ కనెక్షన్.. కట్ చేస్తే దిమ్మతిరిగే ట్విస్ట్..

అందుకోసం ఓ మాస్టార్‌ ప్లాన్‌ వేశాడు..ఇంటి తలుపుకు కరెంటు వైరు తగిలించాడు. కానీ, అతడి పన్నాగం ఫలించలేదు. విధి వెంటాడింది.. తానొకటి తలిస్తే.. అక్కడ మరోకటి జరిగింది.

భార్యను చంపేందుకు తలుపులకు విద్యుత్ కనెక్షన్.. కట్ చేస్తే దిమ్మతిరిగే ట్విస్ట్..
Crime News
Jyothi Gadda
|

Updated on: Oct 11, 2022 | 1:51 PM

Share

ఓ తాగుబోతు వేసిన ప్లాన్ బెడిసి కొట్టింది.. కట్టుకున్న భార్యను మూడో కంటికి తెలియకుండా ఖతం చేద్దామనుకున్నాడు. అందుకోసం ఓ మాస్టార్‌ ప్లాన్‌ వేశాడు..ఇంటి తలుపుకు కరెంటు వైరు తగిలించాడు. కానీ, అతడి పన్నాగం ఫలించలేదు. విధి వెంటాడింది.. తానొకటి తలిస్తే.. అక్కడ మరోకటి జరిగింది. మధ్యప్రదేశ్‌లోని బేతుల్ జిల్లాలో ఒక వ్యక్తి తన భార్యను చంపడానికి ఇనుప తలుపుపై విద్యుత్ వైర్‌ను వేశాడు. భార్య తలుపును తాకటంతోనే కరెంట్‌ షాక్ తగిలి చనిపోతుందని భావించాడు..కానీ, 55 ఏళ్ల అత్తగారు తలుపును తగిలి విద్యుదాఘాతంతో మరణించింది. దీంతో పోలీసులు అతన్ని కటకటాల వెనక్కి నెట్టారు.ఈ ఘటన కొత్వాలి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని సైఖేడా గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. ఈ మేరకు పోలీసులు తెలిపిన వివరాల మేరకు..

ఆ వ్యక్తి తాగుడుకు అలవాటు పడ్డాడని, దీంతో అతని భార్యతో తరచూ గొడవలు జరిగేవని కొత్వాలి పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ అపలా సింగ్ తెలిపారు. ఆదివారం రాత్రి భార్యాభర్తల మధ్య మళ్లీ గొడవ జరిగిందని చెప్పారు. ఈ క్రమంలోనే భార్య తన తల్లి ఇంటికి వెళ్లిందని అధికారి తెలిపారు. తన భార్య ఇంటి నుంచి వెళ్లిపోవడంతో కోపంతో ఆ వ్యక్తి తన అత్తమామల ఇంటికి వెళ్లాడని ప్రాథమిక దర్యాప్తులో తేలిందని సింగ్ చెప్పాడు.

అక్కడే భార్యను మట్టుబెట్టాలని భావించి విద్యుత్‌ వైర్‌ కట్‌ చేసి తలుపుపై వేశాడు..కానీ, అతని అత్తగారు తలుపుకు తగిలి అక్కడికక్కడే మరణించారని అధికారి తెలిపారు. ఘటన అనంతరం ఆ వ్యక్తి అక్కడి నుంచి పారిపోయాడని, అతడిని పట్టుకునేందుకు గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న నిందితుడిపై సంబంధిత నిబంధనల ప్రకారం కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..