AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అయ్యా బాబోయ్‌.. 8 నాటికల్ మైళ్లు సముద్రాన్ని ఈదుకుంటూ భారత్‌కు చేరిన శ్రీలంక పౌరుడు.. ఏం జరిగిందంటే..

ఒక వ్యక్తి సముద్రంలో దూకేశాడు. అలా దూకి సుమారు 8 నాటికల్ మైళ్ల దూరం ఈదుకుంటూ భారత భూభాగంలోకి ప్రవేశించాడు. అయితే,..

అయ్యా బాబోయ్‌.. 8 నాటికల్ మైళ్లు సముద్రాన్ని ఈదుకుంటూ భారత్‌కు చేరిన శ్రీలంక పౌరుడు.. ఏం జరిగిందంటే..
India Coast Marine
Jyothi Gadda
|

Updated on: Oct 11, 2022 | 11:21 AM

Share

ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న శ్రీలంక నుండి పెద్ద సంఖ్యలో ప్రజలు భారతదేశానికి పారిపోవడానికి ప్రయత్నిస్తున్నారు. అలా ప్రయత్నించిన చాలా మంది సురక్షితంగా గమ్యాన్ని చేరుకోగలిగారు కూడా. ఇలాంటి వలస కార్యక్రమం ఇప్పటికీ కొనసాగుతోంది. శ్రీలంక నుండి భారతదేశానికి పారిపోవాలనుకుని, శ్రీలంక అధికారుల నుండి తప్పించుకునే ప్రయత్నంలో ఒక వ్యక్తి సముద్రంలో దూకేశాడు. అలా దూకి సుమారు 8 నాటికల్ మైళ్ల దూరం ఈదుకుంటూ భారత భూభాగంలోకి ప్రవేశించాడు. అయితే భారత తీరానికి చేరుకున్న తర్వాత అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. భారతదేశ పొరుగు దేశం శ్రీలంక నుండి పారిపోయి భారత భూభాగంలోకి ప్రవేశించిన శ్రీలంక జాతీయుడిని ఆదివారం రామనాథపురం జిల్లాలోని మండపం క్యాంపు వద్ద అదుపులోకి తీసుకున్నట్లు స్థానిక మీడియా పేర్కొంది. 24 ఏళ్ల యువకుడిని శ్రీలంకలోని మన్నార్ నివాసి కస్కాన్ రవిచంద్రన్‌గా గుర్తించారు.

అతనిని పట్టుకున్న తర్వాత విచారించగా, శ్రీలంక నావికాదళం అడ్డగించిన తరువాత అక్రమంగా వస్తున్న పడవ నుండి దూకి, పాక్ గల్ఫ్‌లోకి 6 నుండి 8 నాటికల్ మైళ్ల దూరంలో భారతదేశం చివరి బీచ్ అయిన ధనుష్కోడికి ఈదుకుంటూ వచ్చినట్టుగా అతడు చెప్పిన మాటలకు అధికారులే నివ్వేరపోయారు. అతను మరో ఐదుగురితో కలిసి పడవ ఎక్కాడని, శ్రీలంక నేవీ అతడిని అడ్డుకోవడంతో ప్రాణాలను కాపాడుకునే ప్రయత్నంలో సముద్రంలోకి దూకేసినట్టుగా వివరించాడు. 24 ఏళ్ల ఈ యువకుడు మరో ఐదుగురితో కలిసి అక్రమంగా భారత్‌కు వస్తున్నాడని ఓ మెరైన్ పోలీసు అధికారి తెలిపారు. ఈ వ్యక్తులు అక్టోబర్ 8 రాత్రి శ్రీలంకలోని తలైమన్నార్ తీరం నుండి అధికారుల కళ్లుగప్పి భారత్‌లో ప్రవేశించేందుకు పడవలో బయల్దేరారు. పడవ తమిళనాడు తీరానికి చేరుకుంటున్న సమయంలో కస్కాన్ రవిచంద్రన్ అనే వ్యక్తి అకస్మాత్తుగా ఇసుక దిబ్బ నుంచి సముద్రంలోకి దూకినట్లు పోలీసు అధికారి తెలిపారు. అతను కొంత ఒడ్డుకు వచ్చే వరకు ఈదాడు. నిరంతరం ఈదుకుంటూ తమిళనాడులోని అరిచల్మునై-ధనుష్కోడి ప్రాంతాలను దాటి మండపం సమీపంలోని ఒడ్డు వరకు ఈదుకుంటూ వచ్చి బయటపడ్డాడు.

కస్కన్ మండపంలో ఆదివారం స్థానిక అధికారులకు సమాచారం అందించారు. ప్రస్తుతం అతడిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. స్థూలంగా చెప్పాలంటే, అతడు దాదాపు 6 నుండి 8 నాట్ల పరిధిని కవర్ చేశాడు. ప్రాథమిక విచారణలో అతని వద్ద శ్రీలంక పాస్‌పోర్ట్ 2020లో ముగిసిందని తేలిందని అధికారి తెలిపారు. అతని తల్లిదండ్రులు ఇప్పటికే శ్రీలంక వదిలి భారతదేశంలో నివసిస్తున్నారు. తల్లిదండ్రులు పుదుచ్చేరిలో నివసిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ విషయంపై విచారణ కొనసాగుతోంది. ఒక వ్యక్తి, అతని భార్య వారి ముగ్గురు పిల్లలతో సహా మిగిలిన ఐదుగురు వ్యక్తులు ఉన్నారు. ఇప్పుడు వీరిని తమిళనాడు ప్రభుత్వం నిర్వహిస్తున్న మండపం పునరావాస శిబిరంలో ఉంచారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి