AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ‘ఆ స్టార్ నటుడు చివరి రోజుల్లో తాగి డబ్బు కోసం ఇంటికొచ్చి ఎలా అడిగేవారంటే..’

ప్రముఖ నృత్యకారుడు మాధవపెద్ది మూర్తి తండ్రి సలహా మేరకు ప్రభుత్వ ఉద్యోగం వదిలి కూచిపూడి కళను నేర్చుకున్నారు. ఒకనాడు స్టార్ నటుడు హరినాథ్ ఆర్థిక ఇబ్బందుల్లో మూర్తి కుటుంబాన్ని ఆశ్రయించారు. వాణిశ్రీ లాంటి నటీమణులు సైతం మూర్తి తండ్రి అంటే గౌరవం.

Tollywood: 'ఆ స్టార్ నటుడు చివరి రోజుల్లో తాగి డబ్బు కోసం ఇంటికొచ్చి ఎలా అడిగేవారంటే..'
Haranath
Ravi Kiran
|

Updated on: Mar 21, 2026 | 1:42 PM

Share

ప్రముఖ నృత్యకారుడు మాధవపెద్ది మూర్తి తన జీవితంలో ఎదురైన అనేక సంఘటనలను, సినీ ప్రముఖులతో తన కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని ఓ ఇంటర్వ్యూలో వివరించారు. ఒకానొక సందర్భంలో మూర్తికి మధురైకి బదిలీ అవ్వడంతో, తన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాన్ని కొనసాగించాలా వద్దా అనే సందిగ్ధంలో పడ్డారు. అప్పుడే ఆయన హేమమాలినితో నూపుర్ సీరియల్‌కి నృత్యం చేసి మంచి గుర్తింపు పొందారు, మీనాక్షి శేషాద్రి వంటివారు ఆయన వద్ద నృత్యం నేర్చుకోవడం ప్రారంభించారు. ఈ పరిస్థితిలో ఆయన తండ్రి, మాధవపెద్ది సత్యం, “నీ ఉద్యోగం రిజైన్ చెయ్ నాయనా. భగవంతుడి దయవల్ల నీకు కూచిపూడి వంటి గొప్ప కళ అబ్బింది. దాన్ని సద్వినియోగం చేసుకో. మనకున్న దానితో మనం సంతోషంగా ఉందాం. కళాకారులు ఉన్నవాళ్లు తమ కళను పదిమందికి పంచిపెడతారు. తెల్లవారుజామున మూడింటికి లేచి విమానాశ్రయానికి వెళ్లడం, రాత్రి 12 ఇంటికి తిరిగి రావడం లాంటివి వద్దు” అని సలహా ఇచ్చారు. ఆ సలహాతో మూర్తి తన ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలేసి పూర్తిస్థాయిలో నృత్యానికి అంకితమయ్యారు. ఈ నిర్ణయం వెనుక తన తండ్రి తనపై ఉంచిన అపారమైన నమ్మకం ఉందని మూర్తి గుర్తుచేసుకున్నారు.

సత్యనారాయణ, ప్రభాకర్ రెడ్డి, రాజబాబు, పాలగుమ్మి పద్మరాజు లాంటి ప్రముఖులు మూర్తి తండ్రితో పేకాడటానికి వారి ఇంటికి వచ్చేవారు. చంద్రకళ, శ్రీప్రియ, సీతా పార్థిబన్, ఇంద్రజ, జయలలిత, ఈశ్వరీరావు వంటి ఎంతోమంది నటీమణులు మూర్తి వద్ద నృత్యం నేర్చుకునేవారు. చంద్రకళ ఉదయాన్నే వచ్చి ఆకలిగా ఉందని చెబితే, మూర్తి తల్లి ఆవకాయతో అన్నం కలిపి పెట్టేవారని, ఆమె అమృతం అన్నట్లు తినేవారని మూర్తి వివరించారు. మీనాక్షి శేషాద్రి సైతం స్టార్ హోటల్‌లో ఉంటున్నా, డాన్స్ ప్రాక్టీస్ తర్వాత మూర్తి తల్లి చేసిన దోసెలను ఇద్దరూ కలిసి తినేవారట. శత్రువు వచ్చినా సాయం చేయాలనే తమ తల్లిదండ్రుల సూత్రాన్ని మూర్తి గుర్తు చేసుకున్నారు. కష్టాల్లో ఉన్నవారికి బియ్యం, చీరలు, లుంగీలు కూడా ఇచ్చిన సందర్భాలున్నాయి.

అలాగే, ఒకప్పుడు స్టార్ హీరోగా వెలుగొందిన హరినాథ్ తాగి ఇంటికొచ్చి, “అన్నయ్యా నాకేమైనా కొంచెం డబ్బులు ఇవ్వా” అని అడిగేవారని మూర్తి గుర్తు చేసుకున్నారు. అప్పట్లో హరినాథ్ ఎంతటి హీరోనో, తర్వాత ఆయన ఆర్థికంగా ఎంత కష్టపడ్డారో ఈ సంఘటన స్పష్టం చేస్తుంది. మూర్తి నివసించిన ఇల్లు పింగళి నాగేంద్రరావుది అని, ఆయన తర్వాత ఘంటసాలకి అమ్మారని, చివరికి అది మూర్తి కుటుంబానికి చేరిందని వివరించారు. సువర్ణ, మారో చరిత్ర ఫేమ్ సుచిత్ర(చిరంజీవితో నటించిన, జయం రవి అత్తగారు) వంటివారు ఆ ఇంట్లో అద్దెకు ఉండేవారు.

Follow Us