జోరు తగ్గించిన కుమారి.. హిట్ కోసం ఎదురుచూస్తున్న హెబ్బా పటేల్ 

28 July  2026

Pic credit - Instagram

Rajeev 

తెలుగు, తమిళ, కన్నడ చిత్రాలలో నటించి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది అందాల భామ  హెబ్బా పటేల్. 

హెబ్బా పటేల్ 2014లో వచ్చిన తిరుమనం ఎనుం నిఖా చిత్రంద్వారా తమిళ సినీరంగంలోకి అడుగుపెట్టింది. కానీ, కన్నడంలో వచ్చిన అధ్యక్ష చిత్రం మొదటగా విడుదలైంది.

 ఆతర్వాత  2014లో వచ్చిన అలా ఎలా? అనే చిత్రంద్వారా తెలుగు తెరకు పరిచయమైనా తన నటనతో ఆకట్టుకుంది. ఈ సినిమా తర్వాత చేసిన సినిమా భారీ హిట్ అందుకుంది. 

 అదే  2015లో వచ్చిన కుమారి 21ఎఫ్. ఈ సినిమా హెబ్బా పటేల్ కు గుర్తింపునిచ్చింది. అలాగే ఈ సినిమాలో తన అందంతో కట్టిపడేసింది హెబ్బా. 

ఆతర్వాత ఆడోరకం ఈడోరకం , ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమాలతో వరుస హిట్స్ అందుకొని బిజీగా మారిపోయింది. 

అయితే ఈ అమ్మడికి హిట్స్ కంటే ఫ్లాపులే ఎక్కువగా ఎదురయ్యాయి. దాంతో మెల్లగా ఆఫర్స్ తగ్గుతూ వచ్చాయి. దాంతో సెకండ్ హీరోయిన్ గా చేసింది. 

అయినా కూడా పెద్దగా సక్సెస్ కాలేదు. స్పెషల్ సాంగ్ కూడా చేసింది కానీ అనుకున్నంత గుర్తింపు రాలేదు. ప్రస్తుతం హిట్ కోసం ఎదురుచూస్తుంది.