AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bhagwant Mann: పంజాబ్ సీఏంకు ఝలక్ ఇచ్చిన కార్ల కంపెనీ BMW.. ఆప్ ప్రభుత్వంపై ప్రతిపక్షాల ఫైర్..

తమ రాష్ట్రంలోకి పెట్టుబడులను ఆకర్షించేందుకు పంజాబ్ ముఖ్యమంత్రి భగవత్ మాన్ జర్మనీలో పర్యటిస్తున్నారు. ఈసందర్భంగా పంజాబ్ లో జర్మనీకి చెందిన ప్రముఖ లగ్జరీ కార్ల..

Bhagwant Mann: పంజాబ్ సీఏంకు ఝలక్ ఇచ్చిన కార్ల కంపెనీ BMW.. ఆప్ ప్రభుత్వంపై ప్రతిపక్షాల ఫైర్..
Punjab Cm Meeting With Offi
Amarnadh Daneti
|

Updated on: Sep 15, 2022 | 1:30 PM

Share

Bhagwant Mann: తమ రాష్ట్రంలోకి పెట్టుబడులను ఆకర్షించేందుకు పంజాబ్ ముఖ్యమంత్రి భగవత్ మాన్ జర్మనీలో పర్యటిస్తున్నారు. ఈసందర్భంగా పంజాబ్ లో జర్మనీకి చెందిన ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ మ్యానిఫ్యాక్చర్ యూనిట్ ని ప్రారంభించనుందని, పంజాబ్‌లో తమ ఆటో విడిభాగాల తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయడానికి అంగీకరించినట్లు పంజాబ్ ప్రభుత్వం ప్రకటించింది. పంజాబ్ ముఖ్యమంత్రి భగవత్ మాన్ సెప్టెంబర్ 13వ తేదీ మంగళవారం జర్మనీలోని BMW ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారని . అక్కడ సంస్థ యాజమాన్యంతో చర్చలు జరిపిన సీఏం, పంజాబ్ లో మ్యానిఫ్యాక్చరింగ్ యూనిట్ ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన అన్ని సౌకర్యాలతో పాటు అనుమతులను త్వరితగతిన మంజూరు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని బీఎండబ్ల్యూ సంస్థ ప్రతినిధులకు హామీ ఇచ్చినట్లు ఆమ్ ఆద్మీ ప్రభుత్వం ప్రకటించింది. అలాగే పంజాబ్ ముఖ్యమంత్రి భగవత్ మాన్ కూడా ఈఅంశంపై మాట్లాడుతూ.. ఈనిర్ణయం రాష్ట్ర పారిశ్రామిక వృద్ధికి పెద్ద పీట వేస్తుందని, యువతకు కొత్త ఉపాధి మార్గాలను అందిస్తుందని తెలిపారు.

సీఏం ప్రకటన చేసిన ఒక్కరోజులోనే BMW కంపెనీ సీఏం భగవత్ మాన్ కు ఝలక్ ఇచ్చింది. భారత్ లోని పంజాబ్ లో బిఎమ్‌డబ్ల్యూ గ్రూప్ అదనపు తయారీ యూనిట్ ను ఏర్పాటు చేసే ఆలోచన లేదని కంపెనీ స్వయంగా ప్రకటించింది. BMW తన యూనిట్ ను ఏర్పాటుచేయడనుందని సీఏం ప్రకటించిన ఒక్కరోజులోనే సంబంధిత కంపెనీ అలాంటి ఆలోచన లేదని.. అటువంటి చర్చలు జరగలేదని చెప్పడం ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశమవుతోంది.

ఈవిషయంలో పంజాబ్ లోని ప్రతిపక్షాలు ఆమ్ ఆద్మీ పార్టీని టార్గెట్ చేశాయి. కాంగ్రెస్, బీజేపీ, శిరోమణి అకాలీదల్ తో సహా అన్ని పార్టీలు సీఏం భగవత్ మాన్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్ర ప్రజలను ఆమ్ ఆద్మీ ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తోందని విపక్షాలు విమర్శిస్తున్నాయి. ప్రజలకు తప్పుడు సమాచారం ఇచ్చి.. వారిని తప్పుదోవ పట్టించడం ఆమ్ ఆద్మీ పార్టీకి అలవాటేనంటూ విమర్శలు గుప్పిస్తున్నాయి. లేని దానిని ఉన్నట్లుగా క్లెయిమ్ చేసుకోవడం పంజాబ్ లోని ఆమ్ ఆద్మీ ప్రభుత్వానికి అలవాటుగా మారిందని బీజేపీ నేత తరుణ్ చుగ్ విమర్శించారు.పంజాబ్ లో పెట్టుబడులు ఆకర్షించడానికి కాకుండా సీఏం భగవత్ మాన్ ప్రయివేటు పర్యటనకు జర్మనీ వెళ్లారని ఆయన ఆరోపించారు. మరోవైపు పంజాబ్ శాసనసభలో కాంగ్రెస్ పక్ష నేత పర్తాప్ సింగ్ బజ్వా కూడా సీఏం భగవత్ మాన్ వైఖరిని తప్పుబట్టారు. రాష్ట్రం మొత్తానికి సీఏం అవాస్తవాలు చెబుతున్నారని విమర్శించారు. ఈవిషయం ఇప్పుడు పంజాబ్ రాజకీయాల్లో కాకరేపుతోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..

సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..