AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Karnataka CM: మళ్లీ మొదటికి వచ్చిన కర్నాటక కసరత్తు.. సీఎం ఎంపిక కత్తిమీద సామే.. ఎందుకంటే..

కర్ణాటకలో భారీ విజయం తర్వాత ముఖ్యమంత్రి పేరుపై కాంగ్రెస్‌లో గుబులు మొదలైంది. ముఖ్యమంత్రి అభ్యర్థి పేరుపై చర్చించేందుకు ఆదివారం (మే 14) సాయంత్రం లెజిస్లేచర్ పార్టీ సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారు. అయితే పోటీలో ఎవరూ తగ్గడం లేదు.

Karnataka CM: మళ్లీ మొదటికి వచ్చిన కర్నాటక కసరత్తు.. సీఎం ఎంపిక కత్తిమీద సామే.. ఎందుకంటే..
Dk
Sanjay Kasula
|

Updated on: May 15, 2023 | 2:08 PM

Share

కర్ణాటకకు సీఎం కావాలని డీకే. శివకుమార్, సిద్దరామయ్య పోటీ పడుతున్నారు. తనకే సీఎం సీటు ఇవ్వాలని.. లేదు తననే సీఎం చెయ్యాలని సిద్దరామయ్య, డీకే శివకుమార్ హైకమాండ్‌పై ఒత్తిడి చేస్తున్నారు. ఇద్దరితో రాజీ చర్చలు జరపడానికి ఢిల్లీకి రావాలాని కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ సిద్దరామయ్య, డీకే. శివకుమార్ కు సూచించింది. అయితే ఈ ఉదయం వరకు ఢిల్లీకి వెళ్లేందుకు నో చెప్పిన డీకే చివరికి ప్రత్యేక విమానంలో హస్తినాకు బయలు దేరారు. సోమవారం ఢిల్లీకి రావాలని ఆదివారం రాత్రే కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ సిద్దరామయ్య, డీకే. శివకుమార్ కు చెప్పినట్లుగా ప్రచారం సాగింది. అయితే ఢిల్లీ వర్గాలు మాత్రం అలాంటి ఏం లేదని అంటున్నాయి. హైకమాండ్ పిలవకున్న తమ వాయిస్ వినిపించేందుకు ఢిల్లీకి చేరుుకున్నారు ఈ ఇద్దరు నేతలు అయితే తాను ఢిల్లీ వెళ్లనని, బెంగళూరులోనే ఉండి తాడోపేడో తేల్చుకుంటానని డీకే శివకుమార్ ఆయన సన్నిహితులతో చెప్పారని తెలిసింది.

తాను కష్టపడి రాష్ట్రం మొత్తం తిరిగి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రయత్నించానని డీకే శివకుమార్ అంటున్నారు. రెండు వైపుల నుండి తీవ్రమైన లాబీయింగ్ మధ్య సిద్ధరామయ్య, శివకుమార్ ఇద్దరూ కూడా కాంగ్రెస్ హైకమాండ్‌ను కలవడానికి ఢిల్లీకి చేరుకున్నారు.

అంతకుముందు, ఆలిండియా కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) కర్ణాటక ఇన్‌చార్జి రణ్‌దీప్ సింగ్ సూర్జేవాలా మాట్లాడుతూ, పార్టీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే ఎక్కువ సమయం పట్టదని, కర్ణాటక తదుపరి ముఖ్యమంత్రి పేరును అతి త్వరలో ప్రకటిస్తారని అన్నారు.

కర్ణాటకలోని బెంగళూరులో ఆదివారం అర్థరాత్రి కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్ ఎమ్మెల్యేల సమావేశం అనంతరం సుర్జేవాలా విలేకరులతో మాట్లాడుతూ, “పార్టీ నాయకత్వం నిర్ణయం తీసుకుంటుంది. ఖర్గే సాహబ్ తీర్పుతో నా తీర్పును వెల్లడించలేదు. అతను మా సీనియర్, మీ అందరికి ఆయన గురించి తెలుసు, అతను కర్ణాటక బిడ్డ, అతనికి ఎక్కువ కాలం పట్టదని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను.

కాంగ్రెస్‌కు చెందిన ముగ్గురు పరిశీలకులు మధ్యాహ్నం 2 గంటలకు ఢిల్లీకి చేరుకుంటారు. ఖర్గేకు ఎమ్మెల్యేల అభిప్రాయాన్ని తెలిపిన తర్వాత, ఖర్గే సోనియా, రాహుల్‌లను కలుస్తారు లేదా ఫోన్‌లో చర్చిస్తారు.

పోస్టర్ వార్..

సిద్ధరామయ్య, శివకుమార్‌ల నివాసం వద్ద వారి మద్దతుదారులు కాంగ్రెస్‌ విజయానికి అభినందనలు తెలుపుతూ, వారిద్దరినీ తదుపరి ముఖ్యమంత్రులుగా పేర్కొంటూ బ్యానర్‌లు ఏర్పాటు చేశారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల అభిప్రాయాన్ని తీసుకుంటామని, దాని ఆధారంగా అవసరమైతే తమ నాయకుడికి ఓటు వేయాలని కూడా కోరవచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కర్ణాటక సీఎల్పీ సమావేశానికి కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శులు సుశీల్ కుమార్ షిండే, దీపక్ బబారియా, జితేంద్ర సింగ్ అల్వార్‌లను పరిశీలకులుగా నియమించారు.

కాంగ్రెస్ భారీ విజయం

224 మంది సభ్యులున్న కర్ణాటక అసెంబ్లీ ఫలితాలు మే 13న వెలువడ్డాయి. ఇందులో కాంగ్రెస్ 135 స్థానాల్లో బంపర్ విజయం సాధించింది. బీజేపీ కేవలం 66 సీట్లు గెలుచుకోగా, మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ నేతృత్వంలోని జనతాదళ్ (సెక్యులర్) 19 సీట్లు గెలుచుకుంది. ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన శివకుమార్, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ముఖ్యమంత్రి కావాలనే ఆకాంక్షను బహిరంగంగానే వ్యక్తం చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం