AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘న్యాయపరంగా పోరాటం చేస్తాం’.. నోటీసులపై స్పందించిన సీఎం రేవంత్..

ఢిల్లీ పోలీసుల నోటీసులపై పీసీసీ లీగల్‌ సెల్‌ నేతలు సమాధానం ఇచ్చారు. సీఎంకు ఇచ్చిన నోటుసులపై కాంగ్రెస్ లీగల్ సెల్‌ సభ్యులు నాలుగువారాల గడువును కోరారు. కాంగ్రెస్ సోషల్ మీడియా ఇంచార్జి మన్నే సతీష్‌తోపాటు నవీన్, శివకుమార్, అస్మా తస్లీమ్‌లకు కూడా రెండు వారాల గడువు కోరారు. సాంకేతికపరమైన అంశాలను పూర్తిస్థాయిలో పరిశీలన చేసుకునేందుకు ఈ రెండు వారాలు గడువు కోరినట్లు తెలుస్తోంది. అలాగే ప్రస్తుతం దేశ వ్యాప్తంగా లోక సభ ఎన్నికలు జరుగుతున్నాయి.

'న్యాయపరంగా పోరాటం చేస్తాం'.. నోటీసులపై స్పందించిన సీఎం రేవంత్..
Cm Revanth Reddy
Srikar T
|

Updated on: May 01, 2024 | 3:23 PM

Share

ఢిల్లీ పోలీసుల నోటీసులపై పీసీసీ లీగల్‌ సెల్‌ నేతలు సమాధానం ఇచ్చారు. సీఎంకు ఇచ్చిన నోటుసులపై కాంగ్రెస్ లీగల్ సెల్‌ సభ్యులు నాలుగువారాల గడువును కోరారు. కాంగ్రెస్ సోషల్ మీడియా ఇంచార్జి మన్నే సతీష్‌తోపాటు నవీన్, శివకుమార్, అస్మా తస్లీమ్‌లకు కూడా రెండు వారాల గడువు కోరారు. సాంకేతికపరమైన అంశాలను పూర్తిస్థాయిలో పరిశీలన చేసుకునేందుకు ఈ రెండు వారాలు గడువు కోరినట్లు తెలుస్తోంది. అలాగే ప్రస్తుతం దేశ వ్యాప్తంగా లోక సభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ తరుణంలో పీసీసీ అధ్యక్షుడు, సీఎంగా ఉన్న రేవంత్‌ రెడ్డి ఎన్నికల్లో స్టార్‌ క్యాంపెయినర్‌గా కొనసాగుతున్నారు. ఎన్నికల ప్రచారంలో చాలా బిజీగా ఉండడంతో ఇవాళ విచారణకు రాలేమని వివరణ ఇచ్చింది పీసీసీ లీగల్‌ సెల్‌. సీఎంకు ఇచ్చిన నోటుసులపై హాజరయ్యేందుకు నాలుగువారాల గడువును కోరినట్లు తెలిపారు సీఎం రేవంత్ తరఫు న్యాయవాది సౌమ్య గుప్తా.

దీనిపై సీఎం రేవంత్ స్పందిస్తూ ప్రస్తుతం ఐఎఫ్ఎస్ఓ ఢిల్లీ పొలీసుల ముందు హాజర్యయ్యేందుకు సిద్దంగా లేనట్లు తెలుస్తోంది. దీనికి కారణం అన్ని రాష్ట్రాల్లో సీఎం రేవంత్ స్టార్ క్యాంపెయినర్‌గా ప్రచారం చేస్తున్నారు. అయితే ఈ సోషల్ మీడియా పోస్టు కేసులో న్యాయపరంగా ముందుకు వెళ్తాలని నిర్ణయించుకున్నారు. అందుకే తగిన గడువు కోరినట్లు తెలుస్తోంది. ఇక రేవంత్‎కు నోటీసులు ఇవ్వడానికి ప్రధాన కారణం అమిత్ షా చేసిన ఎన్నికల ప్రచారంలోని వీడియోగా చెబుతున్నారు పోలీసులు. బీజేపీ మూడోసారి అధికారంలోకి వస్తే రిజర్వేషన్లన్నీ తొలగిస్తామంటూ కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా అన్నట్లుగా ఒక వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్‌ అవ్వడం కలకలం రేపింది. తెలంగాణలోని సిద్దిపేటలో నిర్వహించిన బీజేపీ ఎన్నికల ప్రచారసభలో అమిత్‌ షా చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై కేంద్ర హోం మంత్రిత్వశాఖ రంగంలోకి దిగింది. ఈ ఫేక్‌ వీడియోపై ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై స్పందించిన పోలీసులు సీఎం రేవంత్‎తో పాటు కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులను విచారించాలని నిర్ణయించింది.

లీగల్ సెల్ అడ్వొకేట్..

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
శని త్రయోదశి-మాసశివరాత్రి అరుదైన యోగం.. ఈ ఒక్క పూజ చేస్తే శని దోష
శని త్రయోదశి-మాసశివరాత్రి అరుదైన యోగం.. ఈ ఒక్క పూజ చేస్తే శని దోష
జూన్ 12 రాశిఫలాలు: ఆ రాశుల వారికి ఆర్థిక లాభాలు.. 12 రాశుల వారికి
జూన్ 12 రాశిఫలాలు: ఆ రాశుల వారికి ఆర్థిక లాభాలు.. 12 రాశుల వారికి
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్
ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!
ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!
రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..
రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..
పట్టీలు,గొలుసులు నల్లగా మారాయా? ఇలా క్షణాల్లో కత్తగా మార్చండి
పట్టీలు,గొలుసులు నల్లగా మారాయా? ఇలా క్షణాల్లో కత్తగా మార్చండి