AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bihar: లోక్‌సభ ఎన్నికల వేళ బీహార్ సీఎం నితీష్ కుమార్‌కు షాక్.. జేడీయూ కీలక నేత రాజీనామా

బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. జేడీయూ ప్రధాన కార్యదర్శి అజిత్ కుమార్ పార్టీకి రాజీనామా చేశారు. అతను ఆర్జేడీ సీనియర్ నాయకుడు జగదానంద్ సింగ్ కుమారుడు. ఈమేరకు బీహార్ జేడీయూ రాష్ట్ర అధ్యక్షుడు ఉమేష్ కుష్వాహాకు లేఖ రాశారు. అలాగే పార్టీ పని తీరు, ఇటీవల తీసుకున్న నిర్ణయాలపై అజిత్ కుమార్ ప్రశ్నలు సంధించారు.

Bihar: లోక్‌సభ ఎన్నికల వేళ బీహార్ సీఎం నితీష్ కుమార్‌కు షాక్.. జేడీయూ కీలక నేత రాజీనామా
Ajit Kumar Left Jdu
Balaraju Goud
|

Updated on: May 01, 2024 | 12:34 PM

Share

బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. జేడీయూ ప్రధాన కార్యదర్శి అజిత్ కుమార్ పార్టీకి రాజీనామా చేశారు. అతను ఆర్జేడీ సీనియర్ నాయకుడు జగదానంద్ సింగ్ కుమారుడు. ఈమేరకు బీహార్ జేడీయూ రాష్ట్ర అధ్యక్షుడు ఉమేష్ కుష్వాహాకు లేఖ రాశారు. అలాగే పార్టీ పని తీరు, ఇటీవల తీసుకున్న నిర్ణయాలపై అజిత్ కుమార్ ప్రశ్నలు సంధించారు.

పార్టీ రాష్ట్ర అధ్యక్షుడికి రాసిన లేఖలో అజిత్ కుమార్, “ఇటీవలి రాజకీయ పరిణామాల బాధించాయన్నారు. పార్టీలోని అట్టడుగు, బలమైన వర్గాలను పట్టించుకోవడం లేదని, పార్టీ చాలా తక్కువ వ్యవధిలో పొత్తుకు సంబంధించి రెండు ప్రధాన నిర్ణయాలు తీసుకుంది. దీని కారణంగా క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తల్లో గందరగోళం నెలకొంది. కార్యకర్తలు పార్టీ తరపున ఏదైనా స్టాండ్ తీసుకోవడం ప్రారంభించిన వెంటనే, పార్టీ అగ్ర నాయకత్వం ఖచ్చితమైన వ్యతిరేక నిర్ణయం తీసుకుంటుంది, అయినప్పటికీ, ముఖ్యమంత్రి పనిచేస్తున్నారని మేమంతా భావిస్తున్నామన్నారు. పార్టీ, రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, కొన్ని తగిన నిర్ణయాలు తీసుకోవచ్చు, కానీ రెండు దశల ఎన్నికల తర్వాత కూడా, బీహార్ ప్రయోజనాలకు సంబంధించి ఎన్‌డీఏ కూటమి ఇంతరకు పెద్ద ప్రకటన చేయలేదు. బీహార్‌కు సంబంధించి ప్రత్యేక రాష్ట్ర హోదాతో సహా డజన్ల కొద్దీ పెద్ద అంశాలపై చర్చ జరగలేదని పేర్కొన్నారు.

రాజ్యాంగాన్ని మార్చడం గురించి బీజేపీ నాయకులు నిరంతరం మాట్లాడుతున్నారని, దాని కారణంగా బీజేపీ ఎజెండాపై నియంత్రణ లేకపోవడం వల్ల దేశ ప్రజాస్వామ్యానికి ప్రమాదకర రూపం దాల్చిందని అజిత్ కుమార్ తన లేఖలో పేర్కొన్నారు. ఈ అంశంపై పౌర సమాజంలో తీవ్ర ఆందోళన నెలకొంది. అటువంటి పరిస్థితిలో, పార్టీ పోస్ట్ హోల్డర్‌గా, ప్రజల మధ్యకు వెళ్లి NDA కూటమికి ఓట్లు అడగడం నైతికంగా సరైనదని అనిపించదు, కాబట్టి, పార్టీ పదవి, సంస్థాగత బాధ్యతతో పాటు ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని అజిత్ కుమార్ వెల్లడించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

Follow Us