Delhi: వ్యక్తిని ఢీకొట్టి అర కి.మీ ఈడ్చుకెళ్లిన 16 ఏళ్ల బాలుడు అరెస్ట్.. తల్లిదండ్రులు కూడా బాధ్యులే అంటున్న పోలీసులు
ఢిల్లీలోని సమయ్పూర్ బద్లీలో కారుతో వ్యక్తిని ఈడ్చుకెళ్లి చంపినందుకు 16 ఏళ్ల బాలుడిని అరెస్టు చేశారు. గాయపడిన వ్యక్తి వాహనం కింద ఇరుక్కుపోయాడని తెలిసినప్పటికీ.. దురుసుగా చాలా దూరం లాక్కెళ్లిన దారుణ ఘటన జరిగింది. ఈ హృదయ విదారక ఘటన కెమెరాలో రికార్డయింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు డ్రైవర్ను 11వ తరగతి విద్యార్థిగా గుర్తించారు. ఆ బాలుడిని అరెస్టు చేసి సంబంధిత జెజెబి ముందు హాజరుపరిచారు. కేసు తదుపరి దర్యాప్తు జరుగుతోంది

ఢిల్లీలోని సమయ్పూర్ బద్లి ప్రాంతంలో ఒక వ్యక్తిని కారుతో ఢీకొట్టి దాదాపు 600 మీటర్ల దూరం ఈడ్చుకెళ్లి బాధితుడి మరణానికి దారితీసిన 16 ఏళ్ల బాలుడిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శనివారం సమయ్పూర్ బద్లి పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదంలో బాధితుడు తీవ్రంగా గాయపడ్డాడని సమాచారం అందింది. సంఘటనా స్థలానికి చేరుకున్న తర్వాత.. బాధితుడు శరీరం అంతటా వివిధ గాయాలు, చిరిగిన బట్టలుతో కనిపించాడు. పోలీసు అధికారులు అపస్మారక స్థితిలో పడి ఉన్న బాధితుడిని బురారి ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స తీసుకుంటూ మరణించినట్లు ప్రకటించారు.
మృతుడిని బద్లి పారిశ్రామిక ప్రాంతంలోని రాజా విహార్ నివాసి సుజీత్ మండల్ (32) గా గుర్తించారు. మృతుడు బద్లి పారిశ్రామిక ప్రాంతంలోని పివిసి పైపుల కర్మాగారంలో పనిచేస్తున్నాడని అతని బావమరిది జితేష్ తెలిపారు. రాత్రి 7 గంటల ప్రాంతంలో మండల్ను అంతర్గత రహదారిపై ఒక ఎరుపు రంగు కారు ఢీకొట్టింది. బోనెట్ కింద చిక్కుకున్న సుజీట్ ని సుమారు 600 మీటర్లు ఈడ్చుకెళ్లి.. బద్లి పారిశ్రామిక ప్రాంతంలోని గేట్ నంబర్ 5, ఎన్డిపిఎల్ కార్యాలయం సమీపంలో పడవేసినట్లు స్థానిక విచారణలో వెల్లడైందని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఔటర్ నార్త్) హరేశ్వర్ తెలిపారు.
సంఘటన స్థలంలో, సమీపంలో ఏర్పాటు చేసిన సీసీటీవీని పోలీసులు విశ్లేషించారు. బాధితుడు వాహనంలో ఎలా చిక్కుకున్నాడో.. గాయపడిన వ్యక్తి వాహనం కింద ఇరుక్కుపోయాడని తెలిసినప్పటికీ.. నేరస్థుడైన డ్రైవర్ కొంచెం సేపు ఆగి, ఆపై పారిపోయాడు. దీంతో ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న సమయ్పూర్ బద్లి పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు.
VIDEO | Delhi: A man died after a car driven by a minor hit and dragged him for some distance in northwest Delhi’s Samaypur Badli area. CCTV visuals of the incident, which took place on Saturday (August 23).#DelhiNews
(Visuals discretion advised)
(Source: Third Party) pic.twitter.com/dyWHH4A5p6
— Press Trust of India (@PTI_News) August 27, 2025
పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ల ఆధారంగా ఢిల్లీలోని మండోలిలోని ఒక ఇంట్లో నిందితుడి వాహనాన్ని గుర్తించారు. ఆ కారును నడిపింది రోహిణి నివాసి అయిన 11వ తరగతి విద్యార్థి అని తేలింది. ఈ కేసులో అతడిని అరెస్టు చేసి, నిందితుడి వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ తెలిపారు. బాలుడిని అరెస్టు చేసి సంబంధిత జెజెబి ముందు హాజరుపరిచామని, కేసు దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. మోటారు వాహనాల చట్టంలోని నిబంధనల ప్రకారం అతని తల్లిదండ్రులు కూడా ఈ ఘటనకు బాధ్యులు అవుతారు” అని అధికారి తెలిపారు.
మరిన్ని క్రైమ్ న్యూస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








