AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Momos: పందెం వేసి 150 మోమోస్ తిన్న యువకుడు మృతి .. అతిగా తినడం వల్లనే అంటున్న వైద్యులు..

ఎవరైనా తమ సామర్థ్యం కంటే ఎక్కువ తింటే.. కడుపుపై ​​అధిక ఒత్తిడి మొదలవుతుందని నిపుణులు చెబుతున్నారు. అతిగా తింటే ఊపిరితిత్తుల మీద కడుపు ఉబ్బరం, ఒత్తిడి ఎక్కువ కావడం సర్వసాధారణం. ఈ సందర్భంలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతుంది. కొన్ని సందర్భాల్లో గుండెకు ఆక్సిజన్ సరఫరాలో సమస్య ఏర్పడి ఆకస్మిక మరణాలు సంభవించినట్లు సమాచారం.

Momos: పందెం వేసి 150 మోమోస్ తిన్న యువకుడు మృతి .. అతిగా తినడం వల్లనే అంటున్న వైద్యులు..
Momo Eating
Follow us
Surya Kala

|

Updated on: Jul 17, 2023 | 8:42 PM

ఓ యువకుడు ఆహారం తినే విషయంలో పందెం వేసి ప్రాణాలు పోగొట్టుకున్న ఘటన బీహార్ లో చోటు చేసుకుంది. ఆ యువకుడు మోమోలు ఎక్కువగా తిని మరణించాడు. ఈ యువకుడు తన స్నేహితులతో కలిసి పందెం వేసి 150 మోమోలు తిన్నాడు. కెపాసిటీ కంటే ఎక్కువ మోమోలు తిన్న తర్వాత అకస్మాత్తుగా ఆ యువకుడు ఆరోగ్యం క్షీణించి ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చేరాడు. వైద్యులు ఆ యువకుడిని  కాపాడేందుకు ప్రయత్నించారు. చికిత్స పొందుతూ యువకుడు మృతి చెందాడు. మోమోస్‌ను అతిగా తినడంతో ఓ యువకుడు మృతి చెందడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

ఎవరైనా తమ సామర్థ్యం కంటే ఎక్కువ తింటే.. కడుపుపై ​​అధిక ఒత్తిడి మొదలవుతుందని నిపుణులు చెబుతున్నారు. అతిగా తింటే ఊపిరితిత్తుల మీద కడుపు ఉబ్బరం, ఒత్తిడి ఎక్కువ కావడం సర్వసాధారణం. ఈ సందర్భంలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతుంది. కొన్ని సందర్భాల్లో గుండెకు ఆక్సిజన్ సరఫరాలో సమస్య ఏర్పడి ఆకస్మిక మరణాలు సంభవించినట్లు సమాచారం. ఒక వ్యక్తి తన శరీర సామర్థ్యానికి 4 రెట్లు ఒకే సమయంలో తింటే.. అతను చనిపోవచ్చు.

మరణానికి మోమోస్ కారణమా?

ఇవి కూడా చదవండి

సఫ్దర్‌జంగ్ హాస్పిటల్‌లోని మెడిసిన్ విభాగంలో ప్రొఫెసర్ డాక్టర్ జుగల్ కిషోర్ అతిగా తినడం మరణానికి దారి తీస్తుందని చెప్పారు. అది మోమోస్ లేదా మరేదైనా ఆహారం కావచ్చు. ఎవరైనా సరే శరీర సామర్థ్యానికి మించి తింటే.. అప్పుడు ప్రాణాపాయంగా మారుతుంది. ఈ యువకుడు 150 మోమోలను తిన్నాడు. ఇది శరీర సామర్థ్యం కంటే చాలా రెట్లు ఎక్కువ. అనేక మోమోలు ఒకేసారి తినడంతో.. ఆ యువకుడి శరీరంలో సమస్యలు ఏర్పడటం ప్రారంభించి.. మరణానికి దారితీసింది.

ఎలాంటి ఆహారం అయినా పరిమితికి లోబడి తింటే ఓకే అంటున్నారు డాక్టర్ కిషోర్. శరీర సామర్థ్యానికి మించి తింటే శ్వాస తీసుకోవడంలో సమస్య ఏర్పడవచ్చు. శరీరంలో ఆక్సిజన్ సరఫరా కూడా పూర్తిగా ఆగిపోతుంది. దీని కారణంగా మరణం కూడా సంభవించవచ్చు. డయాఫ్రాగమ్ పనితీరుపై ప్రభావం కారణంగా ఇలా మరణాలు సంభవించవచ్చు. నిజానికి, డయాఫ్రాగమ్ మానవ శరీరంలో ఒక ముఖ్యమైన భాగం. ఇది ఊపిరితిత్తుల క్రింద ఉన్న శ్వాస కండరం ఇది శ్వాస ప్రక్రియకు సహాయపడుతుంది.

డయాఫ్రాగమ్ పనిచేయకపోవడం వల్ల మరణం సంభవిస్తుంది.

మనిషి ఊపిరి పీల్చుకున్నప్పుడు డయాఫ్రమ్ సంకోచించి ఊపిరితిత్తుల్లో గాలిని నింపేందుకు ఖాళీని సృష్టిస్తుందని డాక్టర్ కిషోర్ చెప్పారు. ఈ ప్రక్రియలో డయాఫ్రాగమ్ పై ఒత్తిడి కలిగినప్పుడు, వ్యక్తి ఊపిరి పీల్చుకుంటాడు. డయాఫ్రాగమ్ శరీరంలో 24 గంటల పాటు ఈ ప్రక్రియను చేస్తూనే ఉంటుంది. అయితే ఎవరైనా ఎక్కువ ఆహారం తీసుకుంటే.. అప్పుడు కడుపుపై ​​ఒత్తిడి కలుగుతుంది. కడుపు ఉబ్బుతుంది. ఇది  డయాఫ్రాగమ్ పనితీరును ప్రభావితం చేస్తుంది. దీని కారణంగా డయాఫ్రాగమ్ తన పనిని సరిగ్గా చేయలేకపోతుంది. దీని కారణంగా ఊపిరితిత్తులలో గాలి సరఫరా ఉండదు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటుంది. సకాలంలో చికిత్స అందకపోతే ఈ పరిస్థితి మరణానికి దారితీస్తుంది.

శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కారణంగానే ఎక్కువ మంది మరణిస్తున్నారు.

అతిగా తినడం వల్ల మరణాలు ఎక్కువగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కారణంగానే మరణిస్తున్నారని  ఢిల్లీలోని సీనియర్ వైద్యుడు డాక్టర్ అజయ్ కుమార్ చెబుతున్నారు. మోమోస్‌ని నిరంతరం తినడంతో  గుండె, పొట్ట, ఊపిరితిత్తులపై ఒకే సమయంలో ఒత్తిడి ఏర్పడి .. బహుళ అవయవ వైఫల్యం కూడా సంభవిస్తుంది. ఇది మరణానికి కారణమవుతుంది. ఈ పరిస్థితిలో, అత్యవసర సంరక్షణ తక్షణమే అవసరం. రోగి 15 నుండి 20 నిమిషాలలోపు సంరక్షణను పొందకపోతే అప్పుడు మరణం సంభవించవచ్చు.

పరిమితిగా తినండి.. 

డాక్టర్ జుగల్ కిషోర్ మాట్లాడుతూ.. మన శరీర సామర్థ్యానికి తగినంత ఆహారం తీసుకోవాలి. అతిగా తినడం వల్ల అజీర్ణం, కడుపులో మంట వస్తుంది. కొంతమందికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఆస్తమా ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలి. అటువంటి పరిస్థితిలో ఆహారం తీసుకునేటప్పుడు అజాగ్రత్తగా ఉండకూడదు. కనుక ఎవరి ఆజ్ఞ మేరకు.. లేదా పోటీల పేరుతో మీ శరీర సామర్థ్యానికి మించి అధికంగా తినకుండా ఉండటం మంచిదని హెచ్చరించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..