Karnataka: 15 ఏళ్ల క్రితం నిర్మించిన వంతెన దగ్గర తవ్వకం.. శివాజీ కాలం నాటి నాణేలు లభ్యం
అలనాటి రాజుల కాలం నాటి పాలనకు గుర్తుగా నేటికీ అనేక వస్తువులు అప్పుడప్పుడు తవ్వకాల్లో బయల్పడుతూ ఉంటాయి. నాణేలు, వస్తువులు, నగలు ఇలా అనేక రకాల వస్తువులు కనిపించి అలనాటి వైభవాన్ని నేటి తరానికి తెలియజేస్తూ ఉంటాయి. తాజాగా కర్ణాకటలో కొన్ని పురాతన నాణేలు లభ్యమయ్యాయి.
Updated on: Jul 17, 2023 | 5:05 PM

కొంతమంది వ్యక్తులు వంతెన కింద మట్టిని తవ్వుతుండగా నాణేలు లభ్యమయ్యాయి. వీటిని గొర్రెల కాపరులు అతి పురాతనమైనవిగా చెబుతున్నారు.

ఈ పురాతన నాణేలపై ఒక వైపు ఛత్రపతి శివాజీ ఆబ్వర్స్ పోర్ట్రెయిట్ను కలిగి ఉంది. వెనుక భాగంలో కత్తి-షీల్డ్ చిత్రం. అంతేకాదు నాణేలపై తేదీ 1674 అని వ్రాయబడింది.

చిత్రదుర్గ జిల్లా మొలకల్మూరు తాలూకాలోని భైరాపూర్ గ్రామ సమీపంలో పురాతన నాణేలు లభించాయి. చాలా నాణేలపై ఛత్రపతి శివాజీ చిత్రపటం ఉంది.

వంతెన నిర్మాణం కోసం తవ్వుతుండగా యాభైకి పైగా రాగి రకం నాణేలు దొరికాయి. ఈ నాణేల వెనుకవైపు కత్తి-షీల్డ్ చిత్రంతో పాటు.. 1674 సంవత్సరం అని చెక్కబడి ఉంది.

పదిహేనేళ్ల క్రితం నిర్మించిన వంతెన కింద మట్టిని తవ్వగా నాణేలు బయటపడ్డాయి. వంతెన కింద మట్టిని తవ్వగా గొర్రెల కాపరులకు నాణేలు లభించాయని.. దీనిపై సంబంధిత శాఖ అధికారులు, పరిశోధకులు విచారణ చేపట్టాలని గ్రామానికి చెందిన చిట్టయ్య కోరారు.





























