AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి.. ముందు లక్ష్యాలపై దృష్టిపెట్టండి.. ప్రమాణం చేయబోయే మంత్రులకు మోదీ దిశానిర్దేశం..

నరేంద్ర మోదీ ఈ రోజు సాయంత్రం 7.15కు మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ.. తన నివాసంంలో కొత్తగా మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయబోయే నేతలతో భేటీ అయ్యారు. ప్రధాని మోదీ నివాసంలో జరిగిన ఈ సమావేశంలో పలు విషయాలపై సూచనలు చేశారు.

PM Modi: నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి.. ముందు లక్ష్యాలపై దృష్టిపెట్టండి.. ప్రమాణం చేయబోయే మంత్రులకు మోదీ దిశానిర్దేశం..
Pm Modi
Shaik Madar Saheb
|

Updated on: Jun 09, 2024 | 2:53 PM

Share

నరేంద్ర మోదీ ఈ రోజు సాయంత్రం 7.15కు మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ.. తన నివాసంంలో కొత్తగా మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయబోయే నేతలతో భేటీ అయ్యారు. ప్రధాని మోదీ నివాసంలో జరిగిన ఈ సమావేశంలో పలు విషయాలపై సూచనలు చేశారు. ఎన్డీఏ కొత్త ప్రభుత్వ అజెండా ఏమిటో ప్రధాని మోదీ చాటిచెప్పారు. ముఖ్యంగా 100 రోజుల అభివృద్ధి ప్రణాళికను.. అమలు చేయడంపై కర్తవ్యబోధ చేసిన మోదీ.. మాటను నిలబెట్టుకోవాలంటూ సూచించారు. ఐదేళ్ల రోడ్‌మ్యాప్‌ కూడా సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. పెండింగ్‌ పనులు పూర్తిచేయడంపై కేంద్ర మంత్రులందరూ ఫోకస్‌ చేయాలని సూచించారు. ఎవరికైతే శాఖలను కేటాయిస్తారో.. ఆయా శాఖల్లో లక్ష్యాలపై దృష్టిపెట్టాలంటూ మోదీ సూచించారు. ఓ రోడ్ మ్యాప్ ప్రకారం వెళ్తే.. 2047కల్లా వికసత్‌ భారత్‌ సాధన లక్ష్యం నెరవేరుతుందన్నారు. ప్రజలకు ఎన్డీయే మీద నమ్మకం ఉంది, దాన్ని నిలబెట్టుకోవాలంటూ మోదీ సూచించారు.

వచ్చే 100 రోజుల పరిపాలన కోసం ప్రధాని మోదీ టార్గెట్‌ ఫిక్స్‌ చేశారు. ఆ వివరాలను, ఆ లక్ష్యాలను ప్రధాని మోదీ కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోయే నేతలకు మోదీ దిశానిర్దేశం చేశారు. మొత్తంమ్మీద తన ప్రభుత్వంలో ఎలా పనిచేయాలో ఈ మంత్రులందరికీ మోదీ ఒక టీచర్‌లా పాఠంచెప్పారు.

మోదీ వీడియో చూడండి..

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..