Punjab Train Accident: నిద్రపోయిన లోకో పైలట్లు.. ఆ రైలు ప్రమాదానికి కారణమిదే.!
పంజాబ్లో ఇటీవల గూడ్స్ రైలు ప్రమాదానికి గురైన ఘటనలో కీలక విషయాలు తెలిసాయి. దర్యాప్తు చేసిన అధికారులు.. ప్రమాదానికి డ్రైవర్ల తప్పిదమే కారణమని తేల్చారు. లోకో పైలట్తో సహా అసిస్టెంట్ కూడా కునుకుతీశారని, ఈ క్రమంలో రెడ్ సిగ్నల్ పడినా బ్రేకులు వేయకపోయినట్లు నిర్థారించారు. అందువల్లే ఈ ఘటన జరిగిందని.. ఈ విషయాన్ని రైలు డ్రైవర్లు కూడా అంగీకరించినట్లు అధికారులు చెప్పారు.
పంజాబ్లో ఇటీవల గూడ్స్ రైలు ప్రమాదానికి గురైన ఘటనలో కీలక విషయాలు తెలిసాయి. దర్యాప్తు చేసిన అధికారులు.. ప్రమాదానికి డ్రైవర్ల తప్పిదమే కారణమని తేల్చారు. లోకో పైలట్తో సహా అసిస్టెంట్ కూడా కునుకుతీశారని, ఈ క్రమంలో రెడ్ సిగ్నల్ పడినా బ్రేకులు వేయకపోయినట్లు నిర్థారించారు. అందువల్లే ఈ ఘటన జరిగిందని.. ఈ విషయాన్ని రైలు డ్రైవర్లు కూడా అంగీకరించినట్లు అధికారులు చెప్పారు. పంజాబ్లోని సర్హింద్ జంక్షన్, సాధూగఢ్ రైల్వేస్టేషన్ల మధ్య జూన్ 2 తెల్లవారుజామున 3.15 గంటలకు గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. పక్కన ఉన్న మెయిన్ ప్యాసింజర్ లైన్పై గూడ్స్ ఇంజిన్ పడిపోయింది. అదే సమయంలో మరో లైనులో జమ్మూ తావీ స్పెషల్ రైలు అటుగా వచ్చింది. ఆ ట్రాక్ దగ్గర్లో పడివున్న గూడ్స్ ఇంజిన్ను ఢీకొట్టడంతో జమ్మూ రైలు ఇంజిన్ కూడా పట్టాలు తప్పింది. ఆ సమయంలో జమ్మూ తావీ రైలు నెమ్మదిగా గంటకు 46 కి.మీ వెళ్లినట్లు అధికారులు గుర్తించారు.
అందువల్లే భారీ ప్రమాదం తప్పిందని, వందలాది ప్రయాణికులు సురక్షితంగా బయటపడినట్లు తాజా నివేదిక బయటపెట్టింది. ప్రమాదంలో గూడ్సు రైలు లోకో పైలట్, అసిస్టెంట్లు ఇంజిన్లో ఇరుక్కుపోయారు. తీవ్రంగా గాయపడిన వారిద్దరిని అతికష్టం మీద బయటకు తీసిన రెస్క్యూ సిబ్బంది ఆసుపత్రిలో చేర్పించారు. అయితే, ప్రమాద సమయంలో తాము నిద్రపోయినట్లు ఇద్దరు డ్రైవర్లు అంగీకరించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో ప్రయాణికులకు ఎటువంటి గాయాలు కాలేదని రైల్వేశాఖ వెల్లడించింది. అయితే, డ్రైవర్ల కొరత కారణంగా తాము అదనపు సమయంలో పనిచేయాల్సి వస్తోందని రైల్వే ఉద్యోగ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.