అమ్మ చనిపోయిందని.. తిరిగిరాదని తెలియని తనం..  మృతదేహంతో రోజులు గడిపిన వైనం.. చూస్తే కన్నీళ్లు ఆగవు

తల్లి మృతదేహంతోనే గడిపిన బాలుడు ఇరుగుపొరుగు ఇంటికి వెళ్లి తన తల్లి ఇంట్లో వంట చేయలేదని, ఇంకా పడుకునే ఉందని చెప్పి వారితో కలిసి భోజనం చేస్తూ గడిపాడు.

అమ్మ చనిపోయిందని.. తిరిగిరాదని తెలియని తనం..  మృతదేహంతో రోజులు గడిపిన వైనం.. చూస్తే కన్నీళ్లు ఆగవు
Mother Dead Body
Follow us

|

Updated on: Mar 02, 2023 | 11:37 AM

తన తల్లి చనిపోయిందని తెలియని 11 ఏళ్ల బాలుడు మృతదేహంతో రెండు రోజులు గడిపిన హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. 40 ఏళ్ల మహిళ నిద్రలోనే కన్నుమూసింది. తన తల్లి చనిపోయిందనే విషయం తెలియని ఆమె కొడుకు రెండు రోజులుగా పెరట్లో ఆడుకుంటూ.. తల్లి నిద్రిస్తోందని భావించి తల్లి మృతదేహం పక్కనే పడుకున్నాడు. ఈ ఘటన బెంగళూరులో చోటు చేసుకుంది.

అన్నమ్మ తన కుటుంబంతో కలిసి గంగానగర్‌లో నివసించేది. ఆమె భర్త గతేడాది కిడ్నీ ఫెయిల్యూర్‌తో చనిపోయాడు. అన్నమ్మ బతుకుదెరువు కోసం కూలి పనులు చేసుకుంటూ ఉండేది. అయితే లోబీపీ, షుగర్ కూడా ఉండడంతో అన్నమ్మ ఫిబ్రవరి 25న ఇంట్లోనే చనిపోయింది. తన తల్లి ఈ లోకాన్ని విడిచిపెట్టిందని ఆ అబ్బాయికి తెలియదు. మృతదేహంతో రెండు రోజులు గడిపిన బాలుడు ఇరుగుపొరుగు ఇంటికి వెళ్లి తన తల్లి ఇంట్లో వంట చేయలేదని, ఇంకా పడుకునే ఉందని చెప్పి వారితో కలిసి భోజనం చేస్తూ గడిపాడు.

ఎట్టకేలకు విషయం తెలుసుకున్న స్థానికులు ఇంటికి వెళ్లి చూడగా ఆమె చనిపోయి కనిపించింది. దీంతో స్థానికులు వెంటనే పోలీసులు, బంధువులకు తెలియజేశారు. విచారణలో అన్నమ్మ మృతి చెందినట్లు వెలుగులోకి వచ్చింది. ఆర్టీనగర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. ఫిబ్రవరి 28న అన్నమ్మ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..