AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fire Accident: జీడిమెట్ల ఫార్మా కంపెనీలో రియాక్టర్ బ్లాస్ట్.. ఇద్దరు మృతి, రంగంలోకి అగ్నిమాపక శాఖ

ఈ ఘటనలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను రవీందర్ రెడ్డి, కుమార్‌లుగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక శాఖ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు.

Fire Accident: జీడిమెట్ల ఫార్మా కంపెనీలో రియాక్టర్ బ్లాస్ట్.. ఇద్దరు మృతి, రంగంలోకి అగ్నిమాపక శాఖ
Factory Blast
Jyothi Gadda
|

Updated on: Mar 01, 2023 | 9:37 PM

Share

హైదరాబాద్ నగరంలోని జీడిమెట్లలోని ఓ ఫార్మాస్యూటికల్ కంపెనీలో బుధవారం జరిగిన అగ్ని ప్రమాదంలో ఇద్దరు కార్మికులు మృతి చెందారు. అందిన సమాచారం మేరకు..కార్మికులు మండే ద్రావణాలను కలుపుతున్నప్పుడు కెమికల్ రియాక్టర్‌లో మంటలు చెలరేగాయి. పదార్థం ప్రతిచర్య స్వభావం కారణంగా అది ఒక్కసారిగా పేలిపోయింది. రియాక్టర్ పేలి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను రవీందర్ రెడ్డి, కుమార్‌లుగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక శాఖ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు. . దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.

కార్మికుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. తయారీ ప్రక్రియలో తగిన భద్రతా చర్యలు తీసుకోలేదని, అత్యంత మండే ద్రావణాలను ఉపయోగిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి.

జీడిమెట్లలోని IDA 4వ ఫేజ్‌లో ఉన్న ఆరోర్ ఫార్మాస్యూటికల్ ప్రైవేట్ లిమిటెడ్‌లో అగ్నిప్రమాదం సంభవించడం ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ మరో అగ్నిప్రమాదం జరిగినట్లు తెలిసింది. ఈరోజు అగ్నిప్రమాదం జరిగినట్లు వార్తలు రావడంతో మీడియాను ఈరోజు ప్రాంగణంలోకి అనుమతించలేదు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..