AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

72 గంటల మ్యాజిక్.. ఫోన్ పక్కన పెడితే మీ మెదడులో జరిగే అద్భుతం ఏంటో తెలుసా..?

స్మార్ట్‌ఫోన్ అతిగా వాడుతున్నారా..? అయితే మీ మెదడు ప్రమాదంలో ఉన్నట్లే.. అవును ఫోన్ వ్యసనం మెదడు పనితీరును, ఏకాగ్రతను దెబ్బతీస్తోంది. నిద్రలేమికి దారితీస్తోంది. అయితే కేవలం 72 గంటలపాటు ఫోన్ వాడకం తగ్గించడం ద్వారా మెదడు తిరిగి ఉత్తేజితమై ఆరోగ్యం మెరుగుపడుతుందని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..

72 గంటల మ్యాజిక్.. ఫోన్ పక్కన పెడితే మీ మెదడులో జరిగే అద్భుతం ఏంటో తెలుసా..?
Smartphone Addiction Health Risks
Yellender Reddy Ramasagram
| Edited By: |

Updated on: Jan 05, 2026 | 10:44 PM

Share

నేటి కాలంలో స్మార్ట్‌ఫోన్ మనిషి శరీరంలో ఒక భాగంగా మారిపోయింది. ప్రపంచ జనాభాలో 70 శాతం మంది ఫోన్లకు బానిసలయ్యారు. ముఖ్యంగా 30 సెకన్ల రీల్స్ సంస్కృతి మన కళ్ళనే కాదు, మెదడు పనితీరును కూడా దెబ్బతీస్తోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇవన్నీ చాలామందికి తెలిసినప్పటికీ ఫోన్ వినియోగం మాత్రం తగ్గించలేని పరిస్థితి. అయితే కేవలం 72 గంటలు ఫోన్ వాడకం తగ్గిస్తే మెదడు తిరిగి ఉత్తేజితం అవుతుందని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి.

రాత్రి వేళల్లో ఫోన్ చూడటం వల్ల దాని నుంచి వచ్చే బ్లూ లైట్ నిద్రకు కారణమయ్యే హార్మోన్ల విడుదలను అడ్డుకుంటుంది. ఇది గాఢ నిద్రను దూరం చేసి, రోగనిరోధక శక్తిని తగ్గిస్తుంది. సరైన నిద్ర లేకపోవడం వల్ల దీర్ఘకాలంలో గుండె సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. నిరంతరం ఫోన్ స్క్రీన్‌ను చూడటం వల్ల మెదడు అలసటకు గురై జ్ఞాపకశక్తి తగ్గుతుంది. మానసిక ఆందోళన, గందరగోళం పెరుగుతాయి. అందుకోసమే ప్రతి అరగంటకు ఒకసారైనా కనీసం ఒక బ్రేక్ తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఎవరు బ్రేక్ తీసుకోవడం పెద్దగా ఇష్టపడరు.

కేవలం ముఖ్యమైన పనులకు మాత్రమే ఫోన్ వాడితే ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. ఫోన్ తక్కువ వినియోగించడం వల్ల అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు అని కంప్యూటర్స్ కంప్యూటర్స్ ఇన్ హ్యూమన్ బిహేవియర్ జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనం వెల్లడించింది. ఫోన్ వాడకం తగ్గించడం వల్ల మెదడులోని రివార్డ్ ప్రాసెసింగ్, ఇంపల్స్ కంట్రోల్ ప్రాంతాల్లో సానుకూల మార్పులు వస్తాయి. ఇది మనిషి యొక్క చెడు అలవాట్లను, వ్యసనాలను అదుపులో ఉంచుతుంది. యువతలో మెదడు స్పందించే తీరు మెరుగుపడుతుందని, ఏకాగ్రత పెరుగుతుందని పరిశోధకులు గుర్తించారు.

ఇవి కూడా చదవండి

ప్రముఖ వైద్యులు డాక్టర్ రాజీవ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఫోన్ వాడకాన్ని పూర్తిగా మానేయలేకపోయినా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. ఫోన్ వాడుతున్నప్పుడు ప్రతి 30 నిమిషాలకు ఒకసారి కనీసం 5 నిమిషాల పాటు కళ్ళకు, మెదడుకు విశ్రాంతి ఇవ్వాలి. నెలకు కనీసం మూడు రోజుల పాటు స్మార్ట్‌ఫోన్ వినియోగాన్ని కనిష్ట స్థాయికి తగ్గించాలి. ఇది బ్రెయిన్ రీసెట్‌లా పనిచేసి ఆందోళనను, అలసటను దూరం చేస్తుంది.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

2026లో రూ.20 వేలలోపు బడ్జెట్‌ ఫ్రెండ్లీ ల్యాప్‌టాప్‌!
2026లో రూ.20 వేలలోపు బడ్జెట్‌ ఫ్రెండ్లీ ల్యాప్‌టాప్‌!
తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్‌ అలర్ట్.. ఆ టికెట్ల జారీలో మార్పులు
తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్‌ అలర్ట్.. ఆ టికెట్ల జారీలో మార్పులు
సగం నిమ్మకాయ మంత్రంతో మీ వంటింట్లో దగదగలే..! నిమిషాల్లో
సగం నిమ్మకాయ మంత్రంతో మీ వంటింట్లో దగదగలే..! నిమిషాల్లో
ఎవడు మమ్మీ వీడు.! సచిన్, ధోనిలకే సాధ్యం కానిది చేసి చూపించాడుగా..
ఎవడు మమ్మీ వీడు.! సచిన్, ధోనిలకే సాధ్యం కానిది చేసి చూపించాడుగా..
నా భార్య వంట చేయడం లేదు.. విడాకులు ఇవ్వండి..
నా భార్య వంట చేయడం లేదు.. విడాకులు ఇవ్వండి..
ఆ స్టార్ ప్లేయర్ కెరీర్‌కు ఎండ్ కార్డ్? వరల్డ్ కప్ తర్వాత..
ఆ స్టార్ ప్లేయర్ కెరీర్‌కు ఎండ్ కార్డ్? వరల్డ్ కప్ తర్వాత..
పడుకునే ముందు యూట్యూబ్‌ చూసే అలవాటు ఉందా?
పడుకునే ముందు యూట్యూబ్‌ చూసే అలవాటు ఉందా?
ఏపీ ప్రజలకు భారీ శుభవార్త.. ప్రభుత్వం నుంచి సంక్రాంతి గిఫ్ట్
ఏపీ ప్రజలకు భారీ శుభవార్త.. ప్రభుత్వం నుంచి సంక్రాంతి గిఫ్ట్
గిరిజన హక్కుల కోసం FRA డిజిటల్ ప్లాట్‌ఫామ్.. ఢిల్లీలో వర్క్‌షాప్!
గిరిజన హక్కుల కోసం FRA డిజిటల్ ప్లాట్‌ఫామ్.. ఢిల్లీలో వర్క్‌షాప్!
మహిళలు ఇది మీకే.. లక్ష్మీదేవి కటాక్షం ఉండాలంటే ఈ పనులు చేయకండి
మహిళలు ఇది మీకే.. లక్ష్మీదేవి కటాక్షం ఉండాలంటే ఈ పనులు చేయకండి