ఎలెందర్ రెడ్డి టీవీ9 తెలుగు స్పెషల్ కరస్పాండెంట్.14 ఏళ్లుగా తెలుగు ఎలక్ట్రానిక్ మీడియాలో రిపోర్టర్ గా పనిచేస్తున్నారు.2021 ఏప్రిల్ నుండి టీవీ9 లో విధుల నిర్వహణ. 5ఏళ్లుగా టీవీ9 తెలుగు హైద్రాబాద్ బ్యూరో లో
హెల్త్ అండ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ లలో ఎన్నో కొత్త మరియు ప్రజలకు ఉపయోగపడే ఎన్నో విషయాలు ప్రజల ముందుకు తీసుకోచ్చారు.టీవీ9 కు ముందు డిల్లీ లోనూ పనిచేసిన అనుభవం.స్పెషల్ గ్రౌండ్ రిపోర్ట్ లతో ఎన్నో అంశాలను టీవీ9 వీక్షకులకు అందించారు.
Telangana: విద్యార్థులతో కలిసి క్రికెట్ బ్యాట్ పట్టిన మాజీ టీమిండియా కెప్టెన్
ఆరుట్ల తెలంగాణ పబ్లిక్ స్కూల్కు రాష్ట్ర మైనార్టీ సంక్షేమ, పబ్లిక్ ఎంటర్ ప్రైజెస్ శాఖ మంత్రి, భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ సందర్శించారు. విద్యార్థులతో మమేకమయిన ఆయన, వారిలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించేలా పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి ఆయన క్రికెట్ ఆడారు.
- Yellender Reddy Ramasagram
- Updated on: Jul 18, 2026
- 2:17 pm
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. మరింత సులభంగా జర్నీ..!
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు ఒక శుభవార్త. మహానగరంలో రోజురోజుకూ పెరుగుతున్న ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా, ప్రయాణాన్ని మరింత సులభతరం మరియు సౌకర్యవంతం చేసేందుకు హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (HMRL) సరికొత్త ప్రణాళికలతో ముందుకు సాగుతోంది. మెట్రో సేవలను మెరుగుపరచడం, రద్దీని సమర్థవంతంగా నియంత్రించడమే లక్ష్యంగా అధికారులు కసరత్తు ముమ్మరం చేశారు.
- Yellender Reddy Ramasagram
- Updated on: Jul 15, 2026
- 10:11 pm
వాహనదారులకు అలర్ట్.. డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ కార్డులపై రవాణా శాఖ కీలక ఆదేశాలు
తెలంగాణలో వాహనదారులకు డ్రైవింగ్ లైసెన్స్లు (DL), ఆర్సీ (RC) స్మార్ట్ కార్డులను సకాలంలో అందించేందుకు రాష్ట్ర రవాణా శాఖ కీలక అడుగులు వేస్తోంది. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న కార్డుల ప్రింటింగ్ మరియు డిస్పాచ్ ప్రక్రియను వేగవంతం చేయడంపై రవాణా శాఖ కమిషనర్ బుధవారం ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాల వారీగా పెండింగ్ స్థితిగతులను పరిశీలించిన ఆయన.. నిర్దేశిత గడువులోగా పెండింగ్లో ఉన్న కార్డులన్నింటినీ క్లియర్ చేయాలని జిల్లా రవాణా అధికారులు (DTOs), మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లను (MVIs) ఆదేశించారు.
- Yellender Reddy Ramasagram
- Updated on: Jul 15, 2026
- 8:49 pm
తెలంగాణలో 500 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ విడుదల.. వెరిఫికేషన్ షెడ్యూల్ ఇదే
Telangana MHSRB, MHSRB Merit List 2026: తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు (MHSRB) డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ కేర్ పరిధిలోని 500 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ విడుదల చేసింది. ఎంపికైన అభ్యర్థులకు జూలై 17 నుంచి 20 వరకు హైదరాబాద్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించనుండగా, జూలై 21ను రిజర్వ్ డేగా ప్రకటించింది.
- Yellender Reddy Ramasagram
- Updated on: Jul 15, 2026
- 8:42 pm
ఇది మీకు తెలుసా? అలవాట్లే కొంపముంచుతున్నాయి.. ఏ ఆహార పదార్థం ఏ అవయవాన్ని దెబ్బతీస్తుందో తెలిస్తే..
మనం తినే ఆహారమే మన ఆరోగ్యానికి మూలాధారం. కానీ నేటి ఆధునిక జీవనశైలిలో రుచికి అలవాటుపడి మనం తీసుకునే కొన్ని రకాల ఆహార పదార్థాలు మన శరీరంలోని ముఖ్యమైన అవయవాలను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. ఏ ఆహారాలు మన శరీరంలోని ఏయే భాగాలపై ప్రభావం చూపుతాయో అవగాహన కలిగి ఉండటం చాలా ముఖ్యం. పోషకాహార నిపుణులు, వైద్యులు ఏం చెబుతున్నారో ఇప్పుడు చూద్దాం..
- Yellender Reddy Ramasagram
- Updated on: Jul 15, 2026
- 4:56 pm
తెలంగాణ ANM అభ్యర్థులకు కీలక అప్డేట్.. మెరిట్ లిస్ట్ వచ్చేసింది!
తెలంగాణలో మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ (ఫిమేల్) పోస్టుల భర్తీ ప్రక్రియలో కీలక ముందడుగు పడింది. మొత్తం 1,931 పోస్టుల నియామకాలకు సంబంధించి మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు (MHSRB) తొలి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ను విడుదల చేసింది. అభ్యర్థులు రాత పరీక్షలో సాధించిన మార్కులు, కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ సేవలకు సంబంధించిన వెయిటేజ్ మార్కులను పరిగణనలోకి తీసుకుని ఈ జాబితాను రూపొందించారు..
- Yellender Reddy Ramasagram
- Updated on: Jul 10, 2026
- 9:36 pm
Pushpak AC Bus: ఆ రూట్లో వెళ్లే ప్రయాణికులకు సూపర్ గుడ్న్యూస్.. ఏసీ బస్సులో ఉచిత ప్రయాణం!
హైదరాబాద్ - బెంగళూరు మధ్య ప్రయాణించే ఐటీ ఉద్యోగులు, వ్యాపారులు,సాధారణ ప్రయాణీకులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. ప్రయాణీకులను ఆకట్టుకునేందుకు ఆర్టీసీ ప్రవేశపెట్టిన ఒక వినూత్న ఆఫర్కు పబ్లిక్ నుంచి విశేష స్పందన లభిస్తోంది. బెంగళూరు రూట్లో సర్వీసులను పెంచడంతో పాటు, ప్రయాణీకులకు నగరంలో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
- Yellender Reddy Ramasagram
- Updated on: Jul 10, 2026
- 6:24 pm
పిల్లల చేతికి తాళాలు ఇస్తున్నారా..? అయితే, మీరు జైలుకెళ్లడం ఖాయం.. ఇంకా బండి ఊసే ఉండదు..
తెలంగాణలో మైనర్లకు వాహనాలు ఇచ్చే తల్లిదండ్రులపై రవాణా శాఖ కఠిన చర్యలు చేపడుతోంది. మోటారు వాహనాల చట్టం ప్రకారం 18 ఏళ్ల లోపు పిల్లలు వాహనం నడుపుతూ పట్టుబడితే తల్లిదండ్రులు లేదా వాహన యజమానులపై కేసులు నమోదు కావడంతో పాటు జైలు శిక్ష, భారీ జరిమానాలు విధించే అవకాశం ఉంది. అంతేకాదు, వాహనం రిజిస్ట్రేషన్ రద్దు చేయడంతో పాటు మైనర్కు 25 ఏళ్ల వయస్సు వచ్చే వరకు డ్రైవింగ్ లైసెన్స్ జారీ చేయరు.
- Yellender Reddy Ramasagram
- Updated on: Jul 8, 2026
- 7:08 pm
హైదరాబాద్ వైద్యుల మరో సాహసం.. 5వ అంతస్తు నుంచి పడిన బాలుడికి పునర్జన్మ
భవనం 5వ అంతస్తు నుంచి ప్రమాదవశాత్తు జారిపడి ప్రాణాపాయ స్థితికి చేరుకున్న 13 ఏళ్ల బాలుడికి హైదరాబాద్లోని రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ వైద్యులు అద్భుత వైద్యం అందించి పునర్జన్మ ప్రసాదించారు. తీవ్ర బృహద్ధమని గాయం, మెదడు గాయం, బహుళ అవయవాల వైఫల్యంతో పోరాడిన బాలుడిని వైద్యులు సమిష్టి కృషితో కాపాడగలిగారు. వారాల పాటు వెంటిలేటర్, డయాలసిస్, ప్రత్యేక ఐసీయూ చికిత్సల అనంతరం బాలుడు కోమా నుంచి కోలుకుని పూర్తిగా ఆరోగ్యవంతుడయ్యాడు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత తన ప్రాణాలు కాపాడిన వైద్య బృందానికి స్వయంగా గీసిన కళాఖండాన్ని బహుకరించి కృతజ్ఞతలు తెలియజేయడం అందరినీ భావోద్వేగానికి గురిచేసింది..
- Yellender Reddy Ramasagram
- Updated on: Jul 8, 2026
- 7:16 pm
Smartphone: మీ స్మార్ట్ఫోన్ మీ బాడీ షేప్ను మార్చేస్తోందా? ఫోన్ బాడీ అంటే ఏంటో తెలుసా?
Smartphone: గంటల తరబడి స్మార్ట్ఫోన్లు, టాబ్లెట్లు వాడటం వల్ల మన శరీరంలో వచ్చే భౌతిక మార్పులను సూచించడానికి నిపుణులు వాడుతున్న పదం ఇది. నిరంతరం స్క్రీన్ వైపు వంగి చూడటం వల్ల మన శరీరం ఒక నిర్దిష్టమైన, అనారోగ్యకరమైన భంగిమకు అలవాటు పడిపోతుంది..
- Yellender Reddy Ramasagram
- Updated on: Jul 7, 2026
- 12:21 pm
Smartphone: స్మార్ట్ఫోన్ యుగంలో పిల్లల భవిష్యత్తు ప్రమాదంలో ఉందా? WHO సంచలన హెచ్చరిక?
Smartphone: ఈ ముప్పును గుర్తించిన కొన్ని దేశాలు ఇప్పటికే సోషల్ మీడియాపై కఠినమైన ఆంక్షలు విధిస్తున్నాయి. ఆస్ట్రేలియా 16 ఏళ్ల లోపు పిల్లలు సోషల్ మీడియా అకౌంట్లు తెరవకుండా ప్రపంచంలోనే మొదటిసారిగా నిషేధం విధించింది. ఫ్రాన్స్15 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియాను దూరం..
- Yellender Reddy Ramasagram
- Updated on: Jul 6, 2026
- 8:35 am
రోజూ ఉదయాన్నే గోరువెచ్చని నీరు తాగుతున్నారా? బాడీలో జరిగే మ్యాజిక్ ఇదే!
ఈ రోజుల్లో మారుతున్న జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్ల వల్ల చాలామంది రకరకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అయితే, రూపాయి ఖర్చు లేకుండా మన ఆరోగ్యాన్ని మన చేతుల్లో ఉంచుకునే ఒక అద్భుతమైన మార్గం ఉంది. అదే రోజూ గోరువెచ్చని నీరు తాగడం. ప్రతిరోజూ ఉదయాన్నే వేడి నీటిని తాగడం వల్ల శరీరానికి ఎలాంటి మేలు జరుగుతుందో ఇప్పుడు వివరంగా చూద్దాం.
- Yellender Reddy Ramasagram
- Updated on: Jul 6, 2026
- 6:56 am