ఎలెందర్ రెడ్డి టీవీ9 తెలుగు స్పెషల్ కరస్పాండెంట్.14 ఏళ్లుగా తెలుగు ఎలక్ట్రానిక్ మీడియాలో రిపోర్టర్ గా పనిచేస్తున్నారు.2021 ఏప్రిల్ నుండి టీవీ9 లో విధుల నిర్వహణ. 5ఏళ్లుగా టీవీ9 తెలుగు హైద్రాబాద్ బ్యూరో లో
హెల్త్ అండ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ లలో ఎన్నో కొత్త మరియు ప్రజలకు ఉపయోగపడే ఎన్నో విషయాలు ప్రజల ముందుకు తీసుకోచ్చారు.టీవీ9 కు ముందు డిల్లీ లోనూ పనిచేసిన అనుభవం.స్పెషల్ గ్రౌండ్ రిపోర్ట్ లతో ఎన్నో అంశాలను టీవీ9 వీక్షకులకు అందించారు.
TGSRTC: భక్తులకు గుడ్న్యూస్.. శివరాత్రి సందర్భంగా ఈ ప్రాంతాలకు ప్రత్యేక బస్సులు!
మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులకు రవాణా పరమైన అసౌకర్యం కలగకుండా టీజీఎస్ఆర్టీసీ అన్ని ఏర్పాట్లు చేసింది. భక్తుల సౌకర్యార్థం రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి 43 శైవక్షేత్రాలకు 2,243 ప్రత్యేక బస్సులను నడపాలని యాజమాన్యం నిర్ణయించింది. ఈ నెల 15న మహా శివరాత్రి కాగా, ఈనెల 14 నుంచి 16వ తేది వరకు ఈ ప్రత్యేక బస్సులను సంస్థ నడపనుంది.
- Yellender Reddy Ramasagram
- Updated on: Feb 11, 2026
- 3:15 pm
Telangana: మున్సిపల్ పోరు ఎఫెక్ట్.. భారీగా పట్టుబడిన నగదు.. వారంలో ఎన్ని కోట్లు సీజ్ చేశారంటే?
తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో రాష్ట్రవ్యాప్తంగా విసృతంగా తనిఖీలు చేపట్టారు పోలీసులు. ఎక్కడికక్కడ ప్రత్యేక చెక్ పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీ నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీల్లో గతంలో ఎప్పుడూ లేనంత భారీ సొమ్మును సీజ్ చేస్తున్నారు. గడిచిన వారం రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఏకంగా రూ.2కోట్లు సీజ్ చేశారు పోలీసులు.
- Yellender Reddy Ramasagram
- Updated on: Feb 8, 2026
- 3:04 pm
మీరు ఫుల్బాల్ ఆడతారా.. మీకోసమే హైదరాబాద్లో టీవీ9 టాలెంట్ హంట్ ప్రోగ్రాం.. పూర్తి వివరాలు ఇవిగో
Indian Tigers and Tigresse: ఈ సీజన్ 2 లో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన 30 మంది ఆటగాళ్లను ఎంపిక చేయనున్నారు. ఈ హంటింగ్ కార్యక్రమం ద్వారా పిల్లల్లోని ఫుట్బాల్ ఆటం నైపుణ్యం వెతికి తీయడమే కాకుండా వారికి మంచి అవకాశం కల్పించి ప్రపంచ స్థాయి ట్రైనింగ్ తో పాటు గుర్తింపు కూడా ఇస్తున్నందుకు టీవీ9 నెట్వర్క్ కు పేరెంట్స్ థాంక్యూ చెబుతున్నారు.
- Yellender Reddy Ramasagram
- Updated on: Feb 8, 2026
- 2:46 pm
వైద్య చరిత్రలో కొత్త అధ్యాయం.. పిండం గుండెకు చికిత్స…హైదరాబాద్పై ప్రపంచం దృష్టి
రెయిన్బో చిల్డ్రన్స్ హార్ట్ ఇన్స్టిట్యూట్ ప్రపంచంలోనే మొట్టమొదటి సారిగా గర్భస్థ పిండం గుండెకు ఇమ్యునోథెరపీ చికిత్సను విజయవంతంగా అందించింది. తల్లిలోని యాంటీబాడీల వల్ల గుండె బలహీనపడిన ఐదుగురు శిశువులకు ఈ అత్యాధునిక చికిత్సతో సకాలంలో చికిత్స అందించి, సుఖ ప్రసవం కలిగించి, ప్రాణాలను కాపాడారు. ఇది అరుదైన ప్రినేటల్ గుండె సమస్యలతో బాధపడుతున్న కుటుంబాలకు గొప్ప ఆశను అందిస్తోంది.
- Yellender Reddy Ramasagram
- Updated on: Feb 5, 2026
- 12:37 pm
ఆరోగ్యానికి అడుగులు… ఐక్యతకు బాటగా హెరిటేజ్ రన్.. మీరు పాల్గొనండి..! ఎప్పుడంటే..
తెలంగాణ ప్రభుత్వం, రాపిడో సంయుక్తంగా ఫిబ్రవరి 22, 2026న హైదరాబాద్ హెరిటేజ్ రన్ను నిర్వహిస్తున్నాయి. నగర వారసత్వాన్ని చాటిచెప్పడం, ఆరోగ్యం, ఐక్యతను ప్రోత్సహించడం దీని ప్రధాన లక్ష్యం. చారిత్రక ప్రాంతాల గుండా సాగే ఈ పరుగు నగర సంస్కృతిని అనుభవించే అద్భుత అవకాశం కల్పిస్తుంది. 5000 మందికి పైగా పాల్గొంటారని అంచనా. రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి.
- Yellender Reddy Ramasagram
- Updated on: Feb 5, 2026
- 12:23 pm
Telangana: వాహనదారులకు గుడ్ న్యూస్.. దేశంలోనే తొలిసారిగా.. దీన్ని గురించి తెలిస్తే అవాక్కవడం పక్కా.. వీడియో వైరల్..
హైదరాబాద్ సిటీలో పార్కింగ్ కష్టాలకు ఇక కాలం చెల్లనుంది. నగరవాసులకు ప్రపంచ స్థాయి అనుభూతిని అందించేందుకు నాంపల్లి మెట్రో స్టేషన్ సమీపంలో దేశంలోనే తొలి ఆటోమేటెడ్ మల్టీ లెవల్ కార్ పార్కింగ్ కాంప్లెక్స్ ముస్తాబైంది. జర్మన్ టెక్నాలజీతో రూ. 100 కోట్ల భారీ వ్యయంతో 15 అంతస్తుల్లో నిర్మించిన ఈ అద్భుత కట్టడం అతిత్వరలోనే ప్రారంభం కానుంది.
- Yellender Reddy Ramasagram
- Updated on: Jan 26, 2026
- 6:38 pm
పద్మశ్రీ రావడం సంతోషం మాత్రమే కాదు.. మరింత బాధ్యతనూ పెంచింది
AIG హాస్పిటల్స్ డైరెక్టర్, ప్రముఖ సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డా. గూడూరు వెంకట్రావు (డా. జీవీ రావు)కు 2026 పద్మశ్రీ పురస్కారం లభించింది. ఇది తెలంగాణ వైద్య రంగానికి గర్వకారణం. 12,000 శస్త్రచికిత్సలు, 16,000 ఎండోస్కోపీలతో పాటు, ట్రాన్సోరల్ ఎండోస్కోపిక్ అపెండెక్టమీ వంటి అధునాతన పద్ధతులను దేశంలోనే ప్రవేశపెట్టారు. ఈ పురస్కారం తనకు మరింత బాధ్యతను పెంచిందని డా. జీవీ రావు పేర్కొన్నారు.
- Yellender Reddy Ramasagram
- Updated on: Jan 26, 2026
- 5:59 pm
బైక్, కారు రిజిస్ట్రేషన్ కోసం RTO ఆఫీసుకు వెళ్తున్నారా..? ఇకపై ఆ అవసరం లేదు..!
ప్రజలకు మెరుగైన, సులభమైన సేవలు అందించాలనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. నేటి నుండి కొత్తగా కొనుగోలు చేసే నాన్-ట్రాన్స్పోర్ట్ మోటార్ సైకిళ్లు, మోటార్ కార్లకు, మొదటి రిజిస్ట్రేషన్ సమయంలో వాహనాన్ని RTO కార్యాలయానికి తీసుకువెళ్లాల్సిన అవసరం ఉండదు. రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ (RC) నేరుగా స్పీడ్ పోస్ట్ ద్వారా వాహన యజమానికి పంపడం జరుగుతుంది.
- Yellender Reddy Ramasagram
- Updated on: Jan 24, 2026
- 8:44 pm
Hyderabad: కిడ్నీ క్యాన్సర్ మహిళకు అరుదైన సర్జరీ.. పునర్జన్మ ఇచ్చిన గాంధీ ఆసుపత్రి డాక్టర్లు
గాంధీ ఆసుపత్రి వైద్యుల అరుదైన ఘనత సాధించారు. ప్రాణాంతక స్థితిలో ఉన్న మహిళకు క్లిష్టమైన సర్జరీతో పునర్జన్మ ను ప్రసాదించారు. సికింద్రాబాద్లోని ప్రముఖ ప్రభుత్వ వైద్యశాల గాంధీ ఆసుపత్రి మరో అరుదైన వైద్య అద్భుతానికి వేదికైంది. అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్న ఒక 41 ఏళ్ల జాహెదా బేగం అనే మహిళకు యూరాలజీ, ఇతర విభాగాల వైద్యులు సమన్వయంతో అత్యంత సంక్లిష్టమైన శస్త్రచికిత్స చేసి ప్రాణాపాయం నుండి కాపాడారు..
- Yellender Reddy Ramasagram
- Updated on: Jan 24, 2026
- 7:17 pm
బ్యాలెట్ పేపర్ తోనే తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు.. ఎన్నికలు ఎప్పుడంటే..?
తెలంగాణ రాష్ట్రం మున్సిపల్ ఎన్నికల సంగ్రామానికి రెడీ అయింది. ఫిబ్రవరి 15వ తేదీ లోపు మున్సిపల్ ఎన్నికలు పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే రిజర్వేషన్లు ఖరారు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘాకి ప్రభుత్వం లేఖ రాసింది. ఇక ఎన్నికల సంఘం అధికారులు షెడ్యూల్ ఫిక్స్ చేయనున్నారు. ఏ క్షణమైనా మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది.
- Yellender Reddy Ramasagram
- Updated on: Jan 21, 2026
- 7:00 pm
Lifestyle: ప్రయాణాల్లో వాంతులు ఎందుకు అవుతాయ్.? ఈ లిస్టులో వీళ్లే ఎక్కువ.. కారణం ఇదే
ప్రయాణం సమయంలో తల తిరగడం, వాంతులు అవ్వడం లాంటి సమస్యలు రావడాన్ని మోషన్ సిక్ నెస్ అంటారు. కొంతమందిలో ఎక్కువగా ఘాట్ రోడ్లలో ప్రయాణం చేసేటప్పుడు, మలుపుల వద్ద ఇలాంటి సమస్యలు ఎక్కువగా ఫేస్ చేస్తారు. మనం ప్రయాణం చేసేటప్పుడు కళ్ళు, చెవుల నుంచి మెదడుకు వేరు వేరు సంకేతాలు చేరతాయి.
- Yellender Reddy Ramasagram
- Updated on: Jan 19, 2026
- 1:08 pm
Telangana: తెలంగాణ ప్రజలకు సూపర్ న్యూస్.. ఇకపై షోరూమ్లోనే రిజిస్ట్రేషన్.. ఖర్చులు ఆదా
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కొత్త వాహనాలు రిజిస్ట్రేషన్ చేయాలనుకునేవారికి గుడ్ న్యూస్ అందించింది రేవంత్ సర్కార్. ఇకపై షోరూంలలోనే రిజిస్ట్రేషన్ పూర్తీ చేసుకోవచ్చు. ఈ విధానం 15 రోజుల్లో అమలులోకి రానుంది. మరి ఆ వివరాలు ఎలా ఉన్నాయంటే. ఓ సారి ఈ స్టోరీలో తెలుసుకుందామా..
- Yellender Reddy Ramasagram
- Updated on: Jan 9, 2026
- 8:58 am