ఎలెందర్ రెడ్డి టీవీ9 తెలుగు స్పెషల్ కరస్పాండెంట్.14 ఏళ్లుగా తెలుగు ఎలక్ట్రానిక్ మీడియాలో రిపోర్టర్ గా పనిచేస్తున్నారు.2021 ఏప్రిల్ నుండి టీవీ9 లో విధుల నిర్వహణ. 5ఏళ్లుగా టీవీ9 తెలుగు హైద్రాబాద్ బ్యూరో లో
హెల్త్ అండ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ లలో ఎన్నో కొత్త మరియు ప్రజలకు ఉపయోగపడే ఎన్నో విషయాలు ప్రజల ముందుకు తీసుకోచ్చారు.టీవీ9 కు ముందు డిల్లీ లోనూ పనిచేసిన అనుభవం.స్పెషల్ గ్రౌండ్ రిపోర్ట్ లతో ఎన్నో అంశాలను టీవీ9 వీక్షకులకు అందించారు.
ఆగస్టు 13 నుంచి NIMSలో పిల్లలకు ఉచితంగా హార్ట్ సర్జరీలు.. ఒక్క రూపాయి అవసరం లేదు
హైదరాబాద్లోని నిమ్స్లో చిన్నారులకు పూర్తిగా ఉచితంగా గుండె శస్త్రచికిత్సలు నిర్వహించనున్నారు. ఆగస్టు 13 నుంచి ప్రారంభమయ్యే ఈ ప్రత్యేక కార్యక్రమంలో లండన్ వైద్యులు, పీడియాట్రిక్ కార్డియాక్ సర్జన్ల సహకారంతో అవసరమైన చిన్నారులకు శస్త్రచికిత్సలు చేయనున్నారు. అర్హత ఉన్న పిల్లలను వాక్-ఇన్ విధానంలో పరిశీలించి, వైద్య పరీక్షల అనంతరం అవసరమైన వారికి ఉచితంగా ఆపరేషన్లు నిర్వహిస్తారు..
- Yellender Reddy Ramasagram
- Updated on: Aug 10, 2026
- 10:26 am
Health Tips: ఈ చిన్న అలవాట్లు మార్చుకుంటే చాలు.. ఇక హాస్పిటల్ చుట్టూ తిరగాల్సిన పనే ఉండదు!
మారుతున్న లైఫ్స్టైల్, ఆహారపు అలవాట్ల కారణంగా ప్రస్తుతం జనాలు అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. వాటిలో ఫ్యాటీ లివర్ కూడా ఒకటి. ఈ సమస్యను తగ్గించుకొని లివర్ను ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. కాబట్టి లివర్ ఆరోగ్యంగా ఉండాలంటే.. ఏలాంటి ఆహారాలు తినాలి.. ఎలాంటి వాటికి దూరంగా ఉండాలో చూద్దాం.
- Yellender Reddy Ramasagram
- Updated on: Aug 8, 2026
- 5:10 pm
Telangana: తెలంగాణలో అతిపెద్ద ప్రభుత్వ కేన్సర్ హాస్పిటల్.. అక్కడ ఏర్పాటుకు రంగం సిద్దం.. ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్..
తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్. రాష్ట్రంలో అతిపెద్ద ప్రభుత్వ కేన్సర్ సెంటర్ ఏర్పాటు కానుంది. ఈ మేరకు ప్రభుత్వం సిద్దమైంది. వరంగల్లో దీనిని ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ప్రకటించారు. ఈ ఏడాది చివరికల్లా అందుబాటులోకి రానుంది.
- Yellender Reddy Ramasagram
- Updated on: Aug 4, 2026
- 5:58 pm
తెలంగాణలోని ఆ నగరంలో రెండో అతిపెద్ద ప్రభుత్వ కేన్సర్ ఆస్పత్రి.. ఎక్కడంటే?
ప్రజలకు అత్యాధునిక కేన్సర్ వైద్య సేవలను అందించే విధంగా వరంగల్ రీజనల్ కేన్సర్ హాస్పిటల్ను అభివృద్ధి చేస్తామని మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను ఈ ఏడాది చివరికల్లా అందుబాటులోకి తీసుకొస్తామని ఆయన వెల్లడించారు. ఈ మేరకు వరంగల్, హన్మకొండ, జనగాం జిల్లాల్లో ప్రజలకు అత్యున్నత వైద్య సేవలు రానున్నాయి..
- Yellender Reddy Ramasagram
- Updated on: Aug 4, 2026
- 5:45 pm
తెలంగాణ MBBS, BDS ప్రవేశాలకు NEET కౌన్సెలింగ్ 2026 నోటిఫికేషన్ విడుదల.. ఆగస్టు 5 నుంచి రిజిస్ట్రేషన్లు
రాష్ట్ర ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్, డెంటల్ కళాశాలల్లో 2026–-27 విద్యా సంవత్సరానికి ఎంబీబీఎస్ (MBBS), బీడీఎస్ (BDS) కోర్సుల్లో కాంపిటెంట్ అథారిటీ కోటా (కన్వీనర్ కోటా) సీట్లలో ప్రవేశాల కోసం కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ నోటిఫికేషన్ విడుదల చేసింది. NEET UG-–2026లో క్వాలిఫై అయిన..
- Yellender Reddy Ramasagram
- Updated on: Aug 4, 2026
- 2:59 pm
రోజుకు 7 గంటల కంటే తక్కువ నిద్రపోతున్నారా? తెలంగాణ అధ్యయనంలో వెలుగులోకి వచ్చిన భయంకర విషయాలు!
నేటి ఆధునిక జీవనశైలిలో పని ఒత్తిడి, మారిన అలవాట్లు మనుషులను శారీరకంగానే కాకుండా మానసికంగానూ దెబ్బతీస్తున్నాయి. ముఖ్యంగా మానవ శరీరానికి అత్యంత కీలకమైన నిద్ర ను తీవ్రంగా నిర్లక్ష్యం చేస్తున్నారు. సరైన నిద్ర లేకపోవడం వల్ల నేరుగా ఐసీయూ దాకా వెళ్లే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
- Yellender Reddy Ramasagram
- Updated on: Aug 4, 2026
- 12:53 pm
14 కి.మీ, 13 స్టేషన్లు.. 25 నిమిషాల్లో ఆవయవాలను హాస్పిటల్కు చేర్చిన మెట్రో!
మెట్రో రైలు కేవలం ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చడమే కాదు.. అత్యవసర సమయంలో ప్రాణదాతగానూ మారుతోంది. నగరంలో విపరీతమైన ట్రాఫిక్ దాటుకుని ప్రాణాలు కాపాడేందుకు హైదరాబాద్ మెట్రో రైల్ మరోసారి అద్భుతమైన గ్రీన్ ఛానెల్ సేవలను అందించింది. బ్రెయిన్ డెడ్ అయిన దాత నుంచి సేకరించిన గుండె, ఊపిరితిత్తులను అత్యంత వేగంగా ఆసుపత్రికి చేర్చి మరో ప్రాణాన్ని నిలబెట్టేందుకు దోహదపడింది.
- Yellender Reddy Ramasagram
- Updated on: Aug 1, 2026
- 6:30 pm
పోషకాల వపర్హౌస్.. చేపలు సంవత్సరానికి 18 కిలోలు తినాలంట.. మీ లెక్క ఏంటి మరి..
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO), FAO సంయుక్తంగా వెల్లడించాయి. చేపలు ప్రోటీన్, ఒమెగా-3 కొవ్వు ఆమ్లాలు, అయోడిన్, విటమిన్ D వంటి ముఖ్యమైన పోషకాలను అందిస్తాయని, వారానికి ఒకటి లేదా రెండు సార్లు చేపలను ఆహారంలో భాగం చేసుకోవడం అనేక మందికి ప్రయోజనకరమని నిపుణులు సూచిస్తున్నారు.
- Yellender Reddy Ramasagram
- Updated on: Aug 1, 2026
- 4:57 pm
సనత్నగర్ టిమ్స్కు ఆ మాజీ CM పేరు.. ఇన్చార్జి డైరెక్టర్ ఎవరంటే..?
తెలంగాణలో వైద్య విద్య, సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను మరింత బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. సనత్నగర్లో నిర్మిస్తున్న తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (TIMS)కు మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ మర్రి చెన్నారెడ్డి పేరు పెట్టింది. ఇకపై ఈ ఆసుపత్రిని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్గా పిలవనున్నారు..
- Yellender Reddy Ramasagram
- Updated on: Jul 31, 2026
- 4:22 pm
మిషన్ మోడ్లో ఇండియన్ రైల్వేలో కొలువుల పండగ.. 5.56 లక్షల ఉద్యోగాలు భర్తీ
దేశంలోని నిరుద్యోగ యువతకు ఇండియన్ రైల్వేస్ శుభవార్త చెప్పింది. 2014 నుంచి 2026 జూన్ వరకు దేశవ్యాప్తంగా రైల్వే శాఖలో 5.56 లక్షల మందికి పైగా వివిధ పోస్టుల్లో నియామకాలు చేపట్టినట్లు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ పార్లమెంట్లో వెల్లడించారు. 2024-25 రిక్రూట్మెంట్ సైకిల్లో 4.5 కోట్ల మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరుకాగా, 15 భాషల్లో 150కిపైగా నగరాల్లో కంప్యూటర్ ఆధారిత పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు..
- Yellender Reddy Ramasagram
- Updated on: Jul 29, 2026
- 8:44 pm
వైద్య చరిత్రలోనే సరికొత్త రికార్డ్..! నిమ్స్ వైద్యులు సృష్టించిన అరుదైన ఘనత..
హైదరాబాద్లోని నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (NIMS) వైద్యరంగంలో మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. మూవ్మెంట్ డిజార్డర్స్ (పార్కిన్సన్స్, డిస్టోనియా, ఎసెన్షియల్ ట్రెమర్) బాధితులకు వరప్రసాదంగా మారిన డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ (DBS) శస్త్రచికిత్సా విధానంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. న్యూరోసర్జరీ విభాగాధిపతి ప్రొఫెసర్ డా. వై. వంశీ కృష్ణ నాయకత్వంలో, వైద్య బృందం గతంలో 5 నుండి 6 గంటల పాటు సాగే DBS శస్త్రచికిత్సల వ్యవధిని కేవలం 1 నుండి 2 గంటలకు కుదించింది.
- Yellender Reddy Ramasagram
- Updated on: Jul 25, 2026
- 6:35 pm
మతి మరుపు కాదు.. అది డిమెన్షియా..! మైండ్ను కాపాడుకునేందుకు 9 బంగారు సూత్రాలు ఇవే..
ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న డిమెన్షియా కేసులపై ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక సూచనలు చేసింది. రోజువారీ జీవనశైలిలో చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా డిమెన్షియా ముప్పును 45 శాతం వరకు తగ్గించవచ్చని తెలిపింది. వ్యాయామం, పౌష్టికాహారం, ధూమపానం మానేయడం, మెదడుకు వ్యాయామం, ఆరోగ్య పరీక్షలు వంటి 9 ముఖ్యమైన అలవాట్లు మెదడును ఆరోగ్యంగా ఉంచి జ్ఞాపకశక్తిని కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తాయని నిపుణులు సూచిస్తున్నారు.
- Yellender Reddy Ramasagram
- Updated on: Jul 25, 2026
- 11:28 am