AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Kisan: నేడే అకౌంట్లోకి పీఎం కిసాన్ డబ్బులు.. విడుదల వేళ రైతులకు కేంద్రం అలర్ట్.. మొబైల్స్‌కు మెస్సేజ్‌లు..

ప్రధాని నరేంద్ర మోదీ నేడు పీఎం కిసాన్ నిధులను విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా రైతులకు కేంద్రం కీలక అలర్ట్ జారీ చేసింది. ఈ మేరకు సూచనలు జారీ చేస్తూ లబ్దిదారుల మొబైల్స్‌కు మెస్సేజ్‌లు పంపుతోంది. ఈ మెస్సేజ్‌లో ఏముందో ఒకసారి చూద్దాం.

PM Kisan: నేడే అకౌంట్లోకి పీఎం కిసాన్ డబ్బులు.. విడుదల వేళ రైతులకు కేంద్రం అలర్ట్.. మొబైల్స్‌కు మెస్సేజ్‌లు..
Farmers
Venkatrao Lella
|

Updated on: Mar 13, 2026 | 6:30 AM

Share

రైతులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పీఎం కిసాన్ సాయం మార్చి 13వ తేదీన అందనుంది. శుక్రవారం అసోంలోని గువహతిలో జరిగే కార్యక్రమంలో ఈ డబ్బులను ప్రధాని నరేంద్ర మోదీ తన చేతుల మీదుగా విడుదల చేయనున్నారు. డబ్బులు విడుదల చేసిన అనంతరం రైతులతో ముచ్చటించడంతో పాటు సభలో మోదీ ప్రసంగించనున్నారు. ఇవాళ సాయంత్రం 5 గంటలకు మోదీ డబ్బులను విడుదల చేయనున్నారు. దీంతో సాయంత్రానికి రైతుల అకౌంట్లలో రూ.2 వేలు జమ కానున్నాయి. అయితే మోదీ నిధులు విడుదల చేస్తున్న క్రమంలో కేంద్ర ప్రభుత్వం లబ్దిదారుల మొబైల్‌కు ఓ మెస్సేజ్ పంపుతోంది. కేంద్ర వ్యవసాయశాఖ నుంచి ఈ మెస్సేజ్‌లు వస్తున్నాయి.

ఈ లింక్ ఓపెన్ చేయండి

“ప్రధాని నరేంద్ర మోదీ మార్చి 13న సాయంత్రం 5 గంటలకు పీఎం కిసాన్ 22వ విడత సొమ్మును అస్సాంలోని గౌహతి వేదికగా విడుదల చేయాలని నిర్ణయించారు. https://pmindiawebcast.nic.in/ లింకు ఓపెన్ చేసి వెబ్‌కాస్ట్ ద్వారా మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనండి. అందరూ పాల్గొనాలని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. మీ శివరాజ్ సింగ్ చౌహన్, కేంద్ర కేబినెట్ మంత్రి వ్యవసాయం, రైతు సంక్షేమ మంత్రిత్వశాఖ” అంటూ లబ్దిదారుల మొబైల్స్‌కు ఎస్‌ఎంఎస్‌లు వస్తున్నాయి. అయితే ఈ లింక్ ద్వారా లబ్దిదారులతో ప్రధాని మోదీ వర్చువల్‌గా మాట్లాడనున్నారు. కొంతమంది రైతులతో మోదీ నేరుగా మాట్లాడి తమ సమస్యలను తెలుసుకోనున్నారు. మోదీతో తమ సమస్యలతో చెప్పుకునే అవకాశం కేంద్రం ఈ విధానంలో కల్పిస్తోంది. అందుకే లబ్దిదారులకు సమాచారం ఇస్తూ ఈ మెస్సేజ్‌లు పంపుతోంది.

2.15 కోట్ల మంది మహిళా రైతులు

దేశవ్యాప్తంగా పీఎం కిసాన్ ద్వారా 2.15 కోట్ల మంది మహిళా రైతులు లబ్ది పొందుతున్నారు. గత ఏడాది నవంబర్‌లో కేంద్రం 21వ విడత నిధులను తమిళనాడు వేదికగా విడుదల చేసింది. ప్రతీ ఏడాది రూ.9.32 కోట్ల మంది రైతులకు అందిస్తుండగా.. ఇందుకు రూ.18,640 కోట్లు ఖర్చు పెడుతున్నారు. ప్రతీ ఏడాది రూ.6 వేల చొప్పున మూడు విడతలుగా అందిస్తోంది. ఈ ఏడాదికి సంబంధించి తొలి విడత నిధులను ఇవాళ విడుదల చేస్తోంది. ప్రతీ ఏడాది తొలి విడత సొమ్మును ఫిబ్రవరిలో జమ చేసేవారు. కానీ ఈ సారి పలు కారణాల వల్ల జాప్యం జరిగింది. పీఎం కిసాన్ లబ్దిదారుల రీవెరిఫికేషన్ ప్రక్రియ కేంద్రం చేపట్టింది. ఇందులో భాగంగా ఈ సారి 1.30 లక్షల మంది అనర్హులను గుర్తించి వారిని లబ్దిదారుల జాబితా నుంచి తొలగించింది. ఈ ప్రక్రియ వల్లనే నిధుల విడుదలలో జాప్యం జరిగింది.

Follow Us
రైల్‌ కోచ్‌ ఫ్యాక్టరీలో 734 ఉద్యోగాలు.. రాతపరీక్ష, ఇంటర్వ్యూ లేదు
రైల్‌ కోచ్‌ ఫ్యాక్టరీలో 734 ఉద్యోగాలు.. రాతపరీక్ష, ఇంటర్వ్యూ లేదు
త్వరలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు.. కేంద్రం క్లారిటీ!
త్వరలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు.. కేంద్రం క్లారిటీ!
క్రీడాకారులకు ఆర్థరైటిస్ షాక్.. సైనా నెహ్వాల్ చెప్పిన నిజాలు ఇవే
క్రీడాకారులకు ఆర్థరైటిస్ షాక్.. సైనా నెహ్వాల్ చెప్పిన నిజాలు ఇవే
ఆషాఢ అమావాస్య రోజున ఇంట్లో చేయాల్సిన పనులు.. వీటిని తప్పక..
ఆషాఢ అమావాస్య రోజున ఇంట్లో చేయాల్సిన పనులు.. వీటిని తప్పక..
ఏపీలో వారికి కూడా రూ.25 వేలు.. ప్రభుత్వం నుంచి అప్డేట్
ఏపీలో వారికి కూడా రూ.25 వేలు.. ప్రభుత్వం నుంచి అప్డేట్
కియారాకు ఎన్ని కోట్ల పారితోషికమంటే.. టాక్సిక్ బడ్జెట్ ఎంతంటే..
కియారాకు ఎన్ని కోట్ల పారితోషికమంటే.. టాక్సిక్ బడ్జెట్ ఎంతంటే..
అతి తక్కువ ఖర్చులో డబుల్ బెడ్రూం ఇల్లు.. బెస్ట్ ప్లాన్
అతి తక్కువ ఖర్చులో డబుల్ బెడ్రూం ఇల్లు.. బెస్ట్ ప్లాన్
మీ పీఎఫ్ అకౌంట్లో ఈ తప్పు పొరపాటున కూడా చేయకండి..
మీ పీఎఫ్ అకౌంట్లో ఈ తప్పు పొరపాటున కూడా చేయకండి..
టీమిండియా ఎఫెక్ట్.. డబ్ల్యూటీసీ ఫైనల్ రేస్ నుంచి ఆ టీం ఔట్..?
టీమిండియా ఎఫెక్ట్.. డబ్ల్యూటీసీ ఫైనల్ రేస్ నుంచి ఆ టీం ఔట్..?
బ్రిటీషర్ల అహంకారాన్ని దెబ్బకొట్టిన పార్లే జి..ఈ బిస్కెట్ హిస్టరీ
బ్రిటీషర్ల అహంకారాన్ని దెబ్బకొట్టిన పార్లే జి..ఈ బిస్కెట్ హిస్టరీ