August 08, 2026
Subhash
గూగుల్ పే, ఫోన్పే, పేటీఎం వాడేవారు తెలుసుకోవాల్సిన నిజాలు. UPI యాప్లతో డిజిటల్ పేమెంట్ చేస్తున్న వ్యక్తి ఫోన్ డిస్ప్లే.
UPI లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) లేదా ఛార్జీలు విధిస్తున్నారనే వార్తలు సోషల్ మీడియాలో తరచూ కనిపిస్తుంటాయి. దీనిపై వినియోగదారుల్లో ఆందోళన నెలకొంది.
మీరు షాప్లలో స్కాన్ చేసి డబ్బులు పంపినా లేదా వ్యక్తులకు (P2P - Person to Person) డబ్బులు పంపినా ఎలాంటి అదనపు రుసుము పడదు. జీరో ఛార్జెస్.
పేటీఎం/ఫోన్పే వాలెట్లు (PPI) ద్వారా రూ.2,000 కంటే ఎక్కువ వ్యాపారులకు పేమెంట్ చేసినప్పుడు మాత్రమే మర్చంట్లకు 1.1% వరకు ఛార్జ్ పడుతుంది.
మీ బ్యాంక్ ఖాతా నుండి నేరుగా ఎదుటివారి బ్యాంక్ ఖాతాకు UPI ద్వారా ఎలాంటి లావాదేవీలు చేసినప్పటికీ మీకు ఎలాంటి ఛార్జీలు వర్తించవని గుర్తించుకోండి.
ఒకవేళ మర్చంట్ పై ఛార్జ్ పడినా, దానిని కస్టమర్ ఖాతా నుంచి వసూలు చేసే హక్కు వ్యాపారులకు లేదు. అది కేవలం వ్యాపారికి-యాప్ సంస్థలకు మధ్య ఉండే వ్యవహారం మాత్రమే.
గూగుల్ పే, ఫోన్పే, పేటీఎం వంటి యాప్లు రీఛార్జ్లు, బిల్లుల చెల్లింపులపై వసూలు చేసే రూ.1 నుండి రూ.3 వరకు ఉండే ప్లాట్ఫారమ్ ఫీజు UPI నియమాల్లో భాగం కాదు.
పుకార్లను నమ్మకండి. బ్యాంక్-టు-బ్యాంక్ UPI చెల్లింపులు ఎల్లప్పుడూ ఉచితమే. భద్రమైన డిజిటల్ లావాదేవీలను కొనసాగించండి. మీరు యూపీఐ చేస్తే ఎలాంటి ఛార్జీలు పడవు.