AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Toxic Movie: టాక్సిక్ సినిమా బడ్జెట్.. కియారాకు ఎన్ని కోట్ల పారితోషికమంటే.. ఎవరికి ఎంత రెమ్యునరేషన్స్ అంటే..

ప్రస్తుతం పాన్ ఇండియా లెవల్లో మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో టాక్సిక్ ఒకటి. రాకింగ్ స్టార్ యశ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రానికి గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే రిలీజ్ కావాల్సిన ఈ సినిమా పలుమార్లు వాయిదా పడగా.. ఇప్పుడు ఆగస్ట్ 26న ఈ చిత్రం థియేటర్లలో రిలీజ్ కానుంది.

Toxic Movie: టాక్సిక్ సినిమా బడ్జెట్.. కియారాకు ఎన్ని కోట్ల పారితోషికమంటే.. ఎవరికి ఎంత రెమ్యునరేషన్స్ అంటే..
Toxic Movie
Rajitha Chanti
|

Updated on: Aug 11, 2026 | 8:27 AM

Share

మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో టాక్సిక్ ఒకటి. రాకింగ్ స్టార్ యశ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ మూవీపై ముందు నుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి. పోస్టర్స్, టీజర్, గ్లింప్స్ ద్వారా సినిమాపై హైప్ క్రియేట్ చేసిన మేకర్స్..ఈ సినిమా విషయంలో ప్రేక్షకులలో ఏదోక క్యూరియాసిటీ క్రియేట్ చేస్తున్నారు. నిజానికి ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా పలుమార్లు వాయిదా పడగా.. ఇప్పుడు ఎట్టకేలకు ఆగస్ట్ 26న థియేటర్లలో విడుదల కానుంది. అయితే ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇటీవల ట్రైలర్ రిలీజ్ చేయగా.. ఫుల్ బోల్డ్ అండ్ వయెలెంట్ గా ఉంది. ఇందులో యశ్, నయనతార, కియారా అద్వానీ పాత్రలు మరింత హైలెట్ కానున్నట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. ట్రైలర్ ద్వారానే సినిమాపై మరింత హైప్ క్రియేట్ అయ్యింది. ఇక ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు అడియన్స్. ఈ క్రమంలోనే ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇప్పుడు ఫిల్మ్ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది.

ఎక్కువ మంది చదివినవి : Jason Sanjay: ఇద్దరి మధ్య ఎప్పుడూ గొడవలే.. దూరమయ్యాకే విలువ తెలిసింది.. విజయ్ దళపతి కొడుకు జాసన్ సంజయ్..

ఇందులో యశ్ తోపాటు కియారా అద్వాని, నయనతార, రుక్మిణి వసంత్, తారా సుతారియా కీలకపాత్రలు పోషిస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ మూవీ బడ్జెట్.. అలాగే ఒక్కొక్కరు ఎంత పారితోషికం తీసుకున్నారనే విషయం నెట్టింట చర్చకు దారితీసింది. భారీ తారాగణంతో రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని భారీ దాదాపు రూ.500 నుంచి రూ.600 కోట్లతో నిర్మిస్తున్నట్లు సమాచారం. ఇక ఇందులో నటీనటుల కోసమే దాదాపు రూ.150 కోట్లకు పైగా ఖర్చు చేస్తుందట చిత్రయూనిట్. ఈ సినిమా కోసం యశ్ దాదాపు రూ.50 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నాడట. అలాగే హీరోయిన్ కియారా అద్వానికి రూ.15 కోట్లకు పైగా చెల్లిస్తున్నట్లు టాక్. అలాగే లేడీ సూపర్ స్టార్ నయనతార రూ.12 కోట్లు నుంచి రూ.18 కోట్లు తీసుకుంటున్నారట.

ఎక్కువ మంది చదివినవి : Cinema : ఓటీటీలో దుమ్మురేపుతున్న సస్పెన్స్ థ్రిల్లర్.. 3 ఏళ్లుగా ట్రెండ్ అవుతున్న క్రైమ్ సిరీస్..

ఇక వీరితోపాటు రుక్మిణి వసంత్ రూ.5 కోట్ల వరకు పారితోషికం అందుకుంటుందట. అలాగగే బాలీవుడ్ భామలు తారా సుతారియా రూ.3 కోట్లు తీసుకుంటుందట. ఈ లెక్కన కేవలం తారల పారితోషికం కోసమే రూ.150 కోట్ల వరకు రెమ్యునరేషన్ కోసం ఖర్చు చేస్తున్నారట. ఎట్టకేలకు ఇప్పుడు ఈ మూవీ ఆగస్ట్ 26న ప్రపంచవ్యాప్తంగా అడియన్స్ ముందుకు రానుంది.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : గ్లామర్ సీన్స్ చేస్తానని ఏడ్చేశాను.. నాకెందుకు అలాంటి సీన్స్ రాలేదు.. టాలీవుడ్ హీరోయిన్..

ఎక్కువ మంది చదివినవి :  Cinema : రూ.150 కోట్లు పెట్టి పరమ చెత్త సినిమా తీశారు.. ఇండస్ట్రీలో అతిపెద్ద డిజాస్టర్.. ఇప్పటికీ కోలుకోని నిర్మాత..

Follow Us