MS సుబ్బులక్ష్మి బయోపిక్లో హైలైట్ అదేనా..?
భారతరత్న ఎంఎస్ సుబ్బులక్ష్మి జీవిత కథ MS: ఎ లెగసీ ఆన్ స్క్రీన్ పేరుతో వెండితెరపైకి రానుంది. ఈ బయోపిక్లో రష్మిక మందన టైటిల్ రోల్లో నటిస్తున్నారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి గీతా ఆర్ట్స్, రాక్లైన్ వెంకటేష్, బన్నీ వాస్ నిర్మిస్తున్నారు. రష్మిక ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నారు. అన్ని ప్రధాన భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రం వ్యాపారపరంగా ఇప్పటికే సంచలనం సృష్టిస్తోంది.
భారతీయ సినీ చరిత్రలో మరో ఆసక్తికరమైన బయోపిక్ తెరకెక్కడానికి రంగం సిద్ధమైంది. దిగ్గజ కర్ణాటక సంగీత విద్వాంసురాలు, భారతరత్న ఎంఎస్ సుబ్బులక్ష్మి జీవిత కథ ఆధారంగా MS: ఎ లెగసీ ఆన్ స్క్రీన్ పేరుతో సినిమా రాబోతోంది. ఈ బయోపిక్లో ప్రముఖ నటి రష్మిక మందన టైటిల్ రోల్లో నటిస్తున్నారు.చెన్నైలో ఘనంగా జరిగిన ఈ బయోపిక్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి కమల్ హాసన్ వంటి ప్రముఖులు హాజరయ్యారు. జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్, రాక్లైన్ వెంకటేష్, బన్నీ వాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఎంఎస్ సుబ్బులక్ష్మి పాత్రలో ఒదిగిపోయేందుకు రష్మిక ప్రత్యేక శిక్షణ తీసుకోనున్నారు. సంగీత కళాకారిణులతో కలిసి మేకర్స్ ప్రత్యేక వర్క్షాప్లు కూడా నిర్వహిస్తున్నారు.ఈ చిత్రం బిజినెస్ పరంగా ఇప్పటికే సంచలనం సృష్టిస్తోంది. ఓటీటీ రైట్స్తో పాటు ఆడియో రైట్స్ భారీ ధరకు అమ్ముడయ్యాయి. అనిరుద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. తెలుగుతో పాటు అన్ని ప్రధాన భాషల్లో ఈ బయోపిక్ విడుదల కానుంది.
మరిన్ని వీడియోల కోసం :
బిగ్ బాస్ టాస్కులేమో కానీ ఆ కంటెస్టెంట్ నడుము విరిగినంత పనైంది
నేనే త్రిష స్థానంలో ఉంటే..నటి అంబిక షాకింగ్ కామెంట్స్
లక్ష.. లక్ష్మీకాసులతో 12 అడుగుల గణపయ్య!
రెండేళ్ల కష్టం నేడు వినాయకుడి రూపం.. పవన్కు గిఫ్ట్గా!
మర్రి ఆకుపై 2 సెం.మీ గణపయ్య.. మైక్రో ఆర్టిస్ట్ అద్భుతం!
పసుపు కొమ్ములతో పర్యావరణ గణపతి.. జడ్చర్లలో స్పెషల్ వినాయకుడు!
ఇల్లు పీకి పందిరేస్తున్నాయి పంట పొలాలు నాశనం.. పిల్లల పై దాడులు!
బరువు తగ్గాలనుకుంటున్నారా..? CMR-NIN పరిశోధనలో సంచలన నిజాలు
లీటర్కు రూ.80 కోట్లు.. తేలు విషం రహస్యం ఇదే!

