AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జెఎన్‌యు ఘటనపై ప్రతిపక్ష నేతలు ఫైర్!

ముసుగులు ధరించిన గూండాలు ఢిల్లీలోని జవహర్‌లాల్ విశ్వవిద్యాలయ క్యాంపస్ లో విద్యార్థులపై దాడి చేసి, ఆస్తులను ధ్వంసం చేసిన సంగతి విదితమే. దీంతో పలువురు అగ్రశ్రేణి రాజకీయ నాయకులు ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. ఈ దాడిలో జెఎన్‌యు స్టూడెంట్స్ యూనియన్ అధినేత ఐషే ఘోష్, పలువురు ప్రొఫెసర్లు తీవ్రంగా గాయపడ్డారు. హింసను ఆపడానికి ఢిల్లీ పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోలేదని జెఎన్‌యుఎస్‌యు పేర్కొంది. ఈ దాడిలో బిజెపితో సంబంధం ఉన్న విద్యార్థి సంఘం అఖిల భారతీయ […]

జెఎన్‌యు ఘటనపై ప్రతిపక్ష నేతలు ఫైర్!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jan 06, 2020 | 10:58 AM

Share

ముసుగులు ధరించిన గూండాలు ఢిల్లీలోని జవహర్‌లాల్ విశ్వవిద్యాలయ క్యాంపస్ లో విద్యార్థులపై దాడి చేసి, ఆస్తులను ధ్వంసం చేసిన సంగతి విదితమే. దీంతో పలువురు అగ్రశ్రేణి రాజకీయ నాయకులు ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. ఈ దాడిలో జెఎన్‌యు స్టూడెంట్స్ యూనియన్ అధినేత ఐషే ఘోష్, పలువురు ప్రొఫెసర్లు తీవ్రంగా గాయపడ్డారు. హింసను ఆపడానికి ఢిల్లీ పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోలేదని జెఎన్‌యుఎస్‌యు పేర్కొంది. ఈ దాడిలో బిజెపితో సంబంధం ఉన్న విద్యార్థి సంఘం అఖిల భారతీయ విద్యార్ధి పరిషత్ ప్రమేయం ఉందని వారు ఆరోపించారు.

హింసను ఆపి శాంతిని పునరుద్ధరించాలని ఢిల్లీ పోలీసులను కోరుతూ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. మరో ట్వీట్‌లో, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్‌తో మాట్లాడినట్లు కేజ్రీవాల్ పేర్కొన్నారు. బైజల్ పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నారని తెలిపారు.

[svt-event date=”05/01/2020,11:48PM” class=”svt-cd-green” ]

[/svt-event]

కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఈ దాడిని ఖండిస్తూ, “మన దేశంపై నియంత్రణ ఉన్న ఫాసిస్టులు, మన విద్యార్థుల ధైర్యానికి భయపడుతున్నారు” అని ట్వీట్ చేశారు. కాంగ్రెస్ తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో కూడా ఈ దాడులను ఖండించింది, ఇది “బిజెపి ప్రభుత్వ విభజన రాజకీయాల ప్రత్యక్ష ఫలితం” అని పేర్కొంది.

[svt-event date=”05/01/2020,11:48PM” class=”svt-cd-green” ]

[/svt-event]

కాంగ్రెస్ సీనియర్ నాయకులు శశి థరూర్, చిదంబరం, రణదీప్ సింగ్ సుర్జేవాలా ఈ దాడిపై ట్విట్టర్ వేదికగా స్పందించారు. చిదంబరం, సుర్జేవాలా పోలీసులపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ హింసాకాండ ప్రభుత్వ మద్దతుతో జరుగుతుంది” అని చిదంబరం అన్నారు.

[svt-event date=”05/01/2020,11:49PM” class=”svt-cd-green” ]

[/svt-event]

సిపిఎం సీనియర్ నాయకుడు సీతారాం ఏచూరి “విద్యార్థులు, ఉపాధ్యాయులపై హింసకు పాల్పడడం ఎబివిపి యొక్క పరిపాలన గూండాల కుట్ర” అని ఆరోపించారు. ఎయిమ్స్‌కు తీసుకెళ్లిన జెఎన్‌యుఎస్‌యు అధ్యక్షుడు ఎంఎస్ ఘోష్ వీడియోను కూడా ఏచూరి పంచుకున్నారు.

[svt-event date=”05/01/2020,11:51PM” class=”svt-cd-green” ]

[/svt-event]