AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమృతం ‘ద్వితీయం’.. నిజంగా అద్వితీయం..

Amrutham Sequel: బుల్లితెర చరిత్రలో ‘అమృతం’ సీరియల్‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. 2001లో ప్రసారమైన ఈ సీరియల్ తెలుగు ప్రేక్షకులను ఎంతగానో నవ్వించింది. ఇప్పటికీ ఈ సీరియల్ ఎవర్ గ్రీన్ అని చెప్పవచ్చు. అమృతరావు, అంజి, సర్వం, అప్పాజీ అనే నాలుగు పాత్రలు అభిమానుల గుండెల్లో నిలిచిపోయాయి. ఇదిలా ఉంటే సుమారు 19 సంవత్సరాల తర్వాత మరోసారి ఈ ‘అమృతం’ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. సీక్వెల్‌గా రూపొందుతున్న ‘అమృతం ద్వితీయం’ సిట్యువేషన్ కామెడీ సిరీస్‌గా […]

అమృతం 'ద్వితీయం'.. నిజంగా అద్వితీయం..
Ravi Kiran
|

Updated on: Mar 13, 2020 | 2:30 PM

Share

Amrutham Sequel: బుల్లితెర చరిత్రలో ‘అమృతం’ సీరియల్‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. 2001లో ప్రసారమైన ఈ సీరియల్ తెలుగు ప్రేక్షకులను ఎంతగానో నవ్వించింది. ఇప్పటికీ ఈ సీరియల్ ఎవర్ గ్రీన్ అని చెప్పవచ్చు. అమృతరావు, అంజి, సర్వం, అప్పాజీ అనే నాలుగు పాత్రలు అభిమానుల గుండెల్లో నిలిచిపోయాయి.

ఇదిలా ఉంటే సుమారు 19 సంవత్సరాల తర్వాత మరోసారి ఈ ‘అమృతం’ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. సీక్వెల్‌గా రూపొందుతున్న ‘అమృతం ద్వితీయం’ సిట్యువేషన్ కామెడీ సిరీస్‌గా వస్తోంది. ఇక ఆంజనేయులు పాత్రలో సీనియర్ నటుడు ఎల్బీ శ్రీరామ్ నటిస్తున్నారు. అమృతం సీక్వెల్ ఉగాది కానుకగా మార్చి 25 నుంచి మొదలుకానుంది.

ఈ సిరీస్ జీ5లో ప్రసారమవుతుంది. ఇక దీనికి సంబంధించిన ట్రైలర్‌ను నిన్న ప్రముఖ దర్శకుడు రాజమౌళి సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు. ట్రైలర్ అద్భుతంగా ఉందని.. ‘అమృతం’ ద్వితీయంగా నిజంగా అద్వితీయంగా ఉండబోతోందని తన పోస్ట్‌లో పేర్కొన్నారు. లేట్ ఎందుకు మీరు కూడా ఆ ట్రైలర్‌పై ఓ లుక్కేయండి.

For More News:

కరోనా ఎఫెక్ట్.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..

బాబుకు మరో షాక్.. వైసీపీలోకి టీడీపీ ఎమ్మెల్సీ.?

రేవంత్ అరాచకాలు..కాంగ్రెస్‌లో ప్రకంపనలు..మండిపడుతున్న సీనియర్లు…

ఎయిడ్స్ మందులతో కరోనాకు చికిత్స…

మాచర్ల ఘటనలో గాయపడ్డ న్యాయవాది పరిస్థితి విషయంః బోండా ఉమా

కరోనాపై యుద్ధం.. తెలుగు రాష్ట్రాలు సహా అందుబాటులో 24 గంటల సేవలు..

‘ప్రేమ ఎంత మధురం’.. ఆర్య ఓ రూలర్.. అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చిన జెండే.. షాక్‌లో అను..

ఐపీఎల్ రద్దుతో బీసీసీఐపై భారం.. 10 వేల కోట్లు నష్టం..?

ఏకగ్రీవ పంచాయితీలకు జగన్ సర్కార్ బంపరాఫర్…