ఐపీఎల్ రద్దుతో బీసీసీఐపై భారం.. 10 వేల కోట్లు నష్టం..?
Coronavirus: పొట్టి లీగ్పై కరోనా వైరస్ ప్రభావం గట్టిగానే పడనుంది. ఒకవేళ టోర్నమెంట్ గనక రద్దయితే సుమారు 10 వేల కోట్లు నష్టం చవి చూసే అవకాశం ఉందని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ఐపీఎల్ 13వ సీజన్ ఈ నెల 29 నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. కరోనా వైరస్ భారత్లో వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం జాగ్రత్త చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే ఏప్రిల్ 15 వరకు అన్ని రకాల వీసాలను […]
Coronavirus: పొట్టి లీగ్పై కరోనా వైరస్ ప్రభావం గట్టిగానే పడనుంది. ఒకవేళ టోర్నమెంట్ గనక రద్దయితే సుమారు 10 వేల కోట్లు నష్టం చవి చూసే అవకాశం ఉందని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ఐపీఎల్ 13వ సీజన్ ఈ నెల 29 నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే.
కరోనా వైరస్ భారత్లో వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం జాగ్రత్త చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే ఏప్రిల్ 15 వరకు అన్ని రకాల వీసాలను రద్దు చేసింది. ఈ నేపథ్యంలో అప్పటివరకు టోర్నీకు విదేశీ ప్లేయర్లు అందుబాటులో ఉండరు. ఇక బీసీసీఐ, ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ కూడా ఈ టోర్నమెంట్పై అఫీషియల్గా రేపు ప్రకటించనున్నారు.
ఇదిలా ఉంటే ఇప్పటికే బీసీసీఐ జరగనున్న సఫారీ సిరీస్లోని రెండు వన్డేలను, ఐపీఎల్ను ప్రేక్షకులను లేకుండానే నిర్వహించాలని ఆలోచిస్తున్నారు. ఇవాళ బీసీసీఐ మెంబర్స్తో సౌరవ్ గంగూలీ ఓ మీటింగ్ నిర్వహించి.. ఆ తర్వాత సాయంత్రం ఫ్రాంచైజీలతో సమావేశమయ్యి.. ప్రేక్షకులు లేకుండానే క్లోజ్డ్ డోర్స్లో టోర్నీ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
అటు ఇప్పటికే మహారాష్ట్ర, కర్ణాటక, ఢిల్లీ ప్రభుత్వాలు తాము ఐపీఎల్ మ్యాచ్లను నిర్వహించలేమని చేతులెత్తేశాయి. ఈ పరిస్థితుల్లో టోర్నీ గనక రద్దయితే వేలాది కోట్లు గల్లంతయ్యి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆటగాళ్ల ఫీజులు, గేట్ రిసిప్ట్స్, స్పాన్సర్షిప్, మీడియా రైట్స్, ఫ్రాంచైజీల రాబడి.. ఇలా లెక్కేసుకుంటే ఎన్నో రకాలుగా డబ్బులు నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. ఇక ఇదే బీసీసీఐకి గట్టి దెబ్బ పడుతుంది. ఈ తరుణంలో గంగూలీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడన్న దానిపై అందరిలోనూ ఆతృత నెలకొంది.
For More News:
కరోనా ఎఫెక్ట్.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
బాబుకు మరో షాక్.. వైసీపీలోకి టీడీపీ ఎమ్మెల్సీ.?
అమృతం ‘ద్వితీయం’.. నిజంగా అద్వితీయం..
రేవంత్ అరాచకాలు..కాంగ్రెస్లో ప్రకంపనలు..మండిపడుతున్న సీనియర్లు…
ఎయిడ్స్ మందులతో కరోనాకు చికిత్స…
మాచర్ల ఘటనలో గాయపడ్డ న్యాయవాది పరిస్థితి విషయంః బోండా ఉమా
కరోనాపై యుద్ధం.. తెలుగు రాష్ట్రాలు సహా అందుబాటులో 24 గంటల సేవలు..
‘ప్రేమ ఎంత మధురం’.. ఆర్య ఓ రూలర్.. అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చిన జెండే.. షాక్లో అను..