AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఎంతటి విషాదం.. తండ్రికి తలకొరివి పెట్టి, గుండెపోటుతో తనయుడు మృతి..!

తండ్రి హఠాన్మరణంతో తల్లడిల్లిపోయిన తనయుడి గుండె బరువెక్కింది. తండ్రికి అంతిమ సంస్కారాలు నిర్వహించిన కొద్దిసేపటికే తనయుడు కూడా గుండెపోటుతో తనువు చాలించాడు. ఒకే రోజు తండ్రి కొడుకులు గుండెపోటుతో ప్రాణాలు కోల్పోవడం ప్రతి ఒక్కరినీ కలచివేసింది.

Telangana: ఎంతటి విషాదం.. తండ్రికి తలకొరివి పెట్టి, గుండెపోటుతో తనయుడు మృతి..!
Died
G Peddeesh Kumar
| Edited By: Balaraju Goud|

Updated on: Aug 13, 2024 | 7:32 AM

Share

తండ్రి హఠాన్మరణంతో తల్లడిల్లిపోయిన తనయుడి గుండె బరువెక్కింది. తండ్రికి అంతిమ సంస్కారాలు నిర్వహించిన కొద్దిసేపటికే తనయుడు కూడా గుండెపోటుతో తనువు చాలించాడు. ఒకే రోజు తండ్రి కొడుకులు గుండెపోటుతో ప్రాణాలు కోల్పోవడం ప్రతి ఒక్కరినీ కలచివేసింది. ఈ విషాద సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం పెద్దంపేట గ్రామంలో జరిగింది.

పెద్దంపేట గ్రామానికి చెందిన పెద్ద లక్ష్మయ్య (62) అనే వ్యక్తి సోమవారం(ఆగస్ట్ 12) ఉదయం గుండెపోటుతో మృతి చెందాడు. తండ్రి మృతితో తల్లడిల్లిపోయిన పెద్దకుమారుడు కృష్ణరాజు(30) రోదిస్తూనే తండ్రి అంత్యక్రియలు నిర్వహించాడు. సాయంత్రం తండ్రి అంత్యక్రియలు నిర్వహించారు. అనంతరం ఇంటికి వచ్చిన పెద్ద కుమారుడు కృష్ణరాజు గుండెపోటుతో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. శ్వాస తీసుకోడం ఇబ్బందిగా ఉండడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే కృష్ణరాజు గుండెపోటుతో మృతిచెందినట్లు వైద్యులు చెప్పారు.

దీంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగి కన్నీరుమున్నీరైంది. మృతులు ఇద్దరు వ్యవసాయ కూలీలుగా పని చేస్తు జీవిస్తుంటారు. తండ్రికొడుకుల మృత్యువాతతో పెద్దంపేట గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఒకే రోజు తండ్రి కొడుకులు గుండెపోటు తో ప్రాణాలు కోల్పోవడం ప్రతి ఒక్కరూ తల్లడిల్లిపోయేలా చేసింది.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

మెస్సీ వచ్చిన ఆ రోజు కోల్‌కతా స్టేడియంలో ఏం జరిగింది ?
మెస్సీ వచ్చిన ఆ రోజు కోల్‌కతా స్టేడియంలో ఏం జరిగింది ?
కొత్త ఏడాది ఈ రాశుల వారి కుటుంబాల్లో భారీగా శుభ కార్యాలు..!
కొత్త ఏడాది ఈ రాశుల వారి కుటుంబాల్లో భారీగా శుభ కార్యాలు..!
రైతన్నలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా ఇంటికే యూరియా!
రైతన్నలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా ఇంటికే యూరియా!
టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా
టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా
సమాధులే ఇంటి దేవతలు.. ఏపీలోని ఈ వింత గ్రామం గురించి మీకు తెలుసా
సమాధులే ఇంటి దేవతలు.. ఏపీలోని ఈ వింత గ్రామం గురించి మీకు తెలుసా
కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.20 లక్షల వరకు లోన్.. పొందండిలా..
కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.20 లక్షల వరకు లోన్.. పొందండిలా..
ఈ ఫొటోలో ఒక టాలీవుడ్ హీరోయిన్ కూడా ఉంది.. గుర్తు పట్టండి చూద్దాం
ఈ ఫొటోలో ఒక టాలీవుడ్ హీరోయిన్ కూడా ఉంది.. గుర్తు పట్టండి చూద్దాం
టూర్ ప్లాన్ చేస్తున్నారా? ఆంజనేయుడి జన్మస్థలం చూసొద్దాం రండి..
టూర్ ప్లాన్ చేస్తున్నారా? ఆంజనేయుడి జన్మస్థలం చూసొద్దాం రండి..
అమల్లోకి కొత్త ఐటీ చట్టం.. ఎప్పటినుంచంటే..?
అమల్లోకి కొత్త ఐటీ చట్టం.. ఎప్పటినుంచంటే..?
ప్రజా సమస్య పరిష్కారానికి పొర్లుదండాలతో నిరసన..
ప్రజా సమస్య పరిష్కారానికి పొర్లుదండాలతో నిరసన..