Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kamal Haasan: కమల్ హాసన్‌కు మరో ఎదురు దెబ్బ.. ‘థగ్ లైఫ్’ సినిమాపై ఝలక్ ఇచ్చిన సుప్రీం కోర్టు

లోకనాయకుడు కమల్ హాసన్ నటించిన 'థగ్ లైఫ్' సినిమా కర్ణాటకలో విడుదల కాలేదు. కన్నడపై ఆయన చేసిన వివాదాస్పద ప్రకటన కారణంగా ఈ సినిమాను కన్నడిగులు వ్యతిరేకించారు. ప్రస్తుతం ఈ కేసు హైకోర్టులో పెండింగ్‌లో ఉన్నప్పటికీ కమల్ మళ్లీ సుప్రీంకోర్టులో అప్పీల్ చేశారు.

Kamal Haasan: కమల్ హాసన్‌కు మరో ఎదురు దెబ్బ.. 'థగ్ లైఫ్' సినిమాపై ఝలక్ ఇచ్చిన సుప్రీం కోర్టు
Thug Life Movie
Follow us
Basha Shek

|

Updated on: Jun 09, 2025 | 3:12 PM

‘థగ్ లైఫ్’ సినిమాపై కర్ణాటకలో నిషేధం కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ నిషేధాన్ని ఎత్తివేయాలని కోరుతూ నటుడు కమల్ హాసన్ పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. కోర్టు ద్వారా కేసును పరిష్కరించడానికి ఆయన శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం ఈ పిటిషన్ హైకోర్టులో విచారణలో ఉండగానే కమల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే అక్కడ కూడా లోక నాయకుడికి ఎదురుదెబ్బ తగిలింది. పిటిషన్ పై సోమవారం (జూన్ 09) విచారణ జరిపిన భారత అత్యున్నత న్యాయస్థానం ఇప్పుడీ పిటిషన్ పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేమని, హైకోర్టు తీర్పు చెప్పే వరకు వేచి ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. కాగా ‘కన్నడ తమిళం నుంచి పుట్టింది’ అని కమల్ హాసన్ చేసిన ప్రకటనపై కన్నడిగులు తీవ్రంగా మండిపడుతున్నారు. దీని కారణంగా, ఆయన నటించిన ‘థగ్ లైఫ్’ సినిమాను కర్ణాటకలో విడుదల చేయకూడదని నిర్ణయించారు. అయితే దీనిపై కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు కమల్. ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు సినిమాను విడుదల చేయడం అసాధ్యమని పేర్కొంది. కన్నడ ప్రజలు క్షమాపణ చెబితేనే సమస్య పరిష్కారం అవుతుందని కోర్టు పరోక్షంగా సూచించింది. ప్రస్తుతం ఈ పిటిషన్ జూన్ 10న విచారణకు రానుంది. అయితే అంతకు ముందు కమల్ హాసన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇప్పుడు అక్కడ కూడా కమల్ కు ఎదురుదెబ్బ తగిలింది.

“కర్ణాటకలో థగ్ లైఫ్ కు వ్యతిరేకంగా బెదిరింపులు వస్తున్నాయి. ఈ సినిమాను ప్రదర్శించడానికి అనుమతి లేదు” అని ఆ బృందం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ ను విచారించడానికి జస్టిస్ పికె మిశ్రా నిరాకరించారు. పిటిషనర్లు హైకోర్టును ఆశ్రయించాలని ఆదేశించారు.

ఇవి కూడా చదవండి

‘థగ్ లైఫ్’ చిత్రానికి మణిరత్నం దర్శకత్వం వహించారు. కమల్ హాసన్, శింబు, త్రిష, అభిరామి తదితరులు ఈ చిత్రంలో నటించారు. ఇటీవలే పాన్ ఇండియా స్థాయిలో రిలీజైన ఈ చిత్రం అభిమానుల అంచనాలను అందుకోవడంలో విఫలమైంది. నాలుగు రోజుల్లో ఈ చిత్రం కేవలం రూ. 36 కోట్లు మాత్రమే వసూలు చేయగలిగింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.