Nagarjuna: ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేత.. అభిమానులకు నాగార్జున స్పెషల్ రిక్వెస్ట్.. ఏంటంటే?

హీరో అక్కినేని నాగార్జున‌కు చెందిన ఎన్ క‌న్వెన్ష‌న్‌ సెంటర్ ను హైడ్రా (హైదరాబాద్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ అసెట్‌ ప్రొటెక్షన్‌ ఏజెన్సీ) బృందం కూల్చివేసింది. మాదాపూర్ లోని ఈ కన్వెన్షన్ సెంటర్ ను తుమ్మిడి చెరువును క‌బ్జా చేసి నిర్మిచారని ఆరోపణు ఉన్నాయి. దీంతో అధికారులు శనివారం ఉదయం ఈ కన్వెన్షన్ సెంటర్ ను పూర్తిగా కూల్చివేశారు. దీనిపై నాగార్జున కోర్టు ను ఆశ్రయిచారు.

Nagarjuna: ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేత.. అభిమానులకు నాగార్జున స్పెషల్ రిక్వెస్ట్.. ఏంటంటే?
Nagarjuna Akkineni
Follow us

|

Updated on: Aug 25, 2024 | 8:50 PM

హీరో అక్కినేని నాగార్జున‌కు చెందిన ఎన్ క‌న్వెన్ష‌న్‌ సెంటర్ ను హైడ్రా (హైదరాబాద్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ అసెట్‌ ప్రొటెక్షన్‌ ఏజెన్సీ) బృందం కూల్చివేసింది. మాదాపూర్ లోని ఈ కన్వెన్షన్ సెంటర్ ను తుమ్మిడి చెరువును క‌బ్జా చేసి నిర్మిచారని ఆరోపణు ఉన్నాయి. దీంతో అధికారులు శనివారం ఉదయం ఈ కన్వెన్షన్ సెంటర్ ను పూర్తిగా కూల్చివేశారు. దీనిపై నాగార్జున  కోర్టు ను ఆశ్రయిచారు. చట్టాన్ని ఉల్లంఘించేలా ఎటువంటి చర్యలు చేపట్టలేదని ఇది వరకే సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. తాజాగా ఇదే విషయంపై మరోసారి స్పందించారు కింగ్. చట్టాన్ని ఉల్లంఘించేలా ఎటువంటి చర్యలు చేపట్టలేదన్నారు. ఈ సందర్భంగా అభిమానులు, శ్రేయోభిలాషలకు ప్రత్యేక విజ్జప్తి చేశారు నాగ్. ‘ప్రియమైన అభిమానులు, శ్రేయోభిలాషులందరికీ.. N -కన్వెన్షన్‎ సెంటర కు సంబంధించి వస్తున్న వార్తల్లో వాస్తవాల కంటే, ఊహాగానాలు ఎక్కువ వినిపిస్తున్నాయి. కన్వెన్షన్ నిర్మించబడిన భూమి పట్టా డాక్యుమెంటెడ్ భూమి. ఒక్క సెంట్ భూమి కూడా ఆక్రమించింది కాదు. తుమ్మిడికుంట చెరువు ఆక్రమణకు గురి కాలేదని స్పెషల్ కోర్టు, ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ (ప్రొహిబిషన్) యాక్ట్, 24-02-2014న ఒక ఆర్డర్ Sr 3943/2011 ద్వారా జడ్జిమెంట్ ఇవ్వటం జరిగింది. ప్రస్తుతం, నిర్మాణం చట్టబద్ధతపై నిర్ణయాధికారం కోసం హైకోర్టుని ఆశ్రయించటం జరిగింది. న్యాయస్థానం తీర్పుకి నేను కట్టుబడి ఉంటాను. అప్పటి వరకు, ఊహాగానాలు, ఎలాంటి పుకార్లు, అవాస్తవాలు నమ్మవద్దని నేను మిమ్మల్ని సవినయంగా అభ్యర్ధిస్తున్నాను’ అని ట్వీట్ చేశారు నాగార్జున.

అంతకు ముందు మరో ట్వీట్ లో ఇలా రాసుకొచ్చారు నాగార్జున. ‘స్టే ఆర్డర్‌లు, కోర్టు కేసులకు విరుద్ధంగా ఎన్ కన్వెన్షన్‌కు సంబంధించి కూల్చివేతలు చేపట్టడం బాధాకరం. మా ప్రతిష్టను కాపాడటం కోసం, కొన్ని వాస్తవాలను తెలియజేయడం కోసం, చట్టాన్ని ఉల్లంఘించేలా మేము ఎటువంటి చర్యలు చేపట్టలేదని తెలిపేందుకే ఈ ప్రకటనను విడుదల చేస్తున్నాను. ఆ భూమి పట్టా భూమి. ఒక్క అంగుళం ట్యాంక్ ప్లాన్ కూడా ఆక్రమణకు గురికాలేదు. ప్రైవేట్ స్థలంలో నిర్మించిన భవనమిది. కూల్చివేత కోసం గతంలో ఇచ్చిన అక్రమ నోటీసుపై స్టే కూడా మంజూరు ఇచ్చారు. స్పష్టంగా చెప్పాలంటే, కూల్చివేత తప్పుడు సమాచారంతో లేదా చట్ట విరుద్ధంగా జరిగింది. ఈరోజు ఉదయం కూల్చివేతకు ముందు మాకు ఎలాంటి నోటీసు జారీ చేయలేదు. కేసు కోర్టులో ఉన్నప్పుడు ఇలా చేయడం సరికాదు. చట్టాన్ని గౌరవించే పౌరుడిగా, కోర్టు నాకు వ్యతిరేకంగా తీర్పునిస్తే, కూల్చివేత ప్రక్రియ నేనే నిర్వహించి ఉండేవాడిని. తాజా పరిణామాల వల్ల, మేము ఆక్రమణలు చేశామని, తప్పుడు నిర్మాణాలు చేపట్టామని ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్ళే అవకాశముంది. ఆ అభిప్రాయాన్ని పోగొట్టాలనేదే మా ప్రధాన ఉద్దేశం. అధికారులు చేసిన ఈ చట్ట విరుద్ధ చర్యలకు వ్యతిరేకంగా మేము న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. అక్కడ మాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాను’ అని రాసుకొచ్చారు నాగ్.

ఇవి కూడా చదవండి

నాగార్జున ట్వీట్ ఇదిగో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

IPL 2025: పంజాబ్ కింగ్స్ రిటైన్ చేసే ఐదుగురు ఆటగాళ్లు వీరే..
IPL 2025: పంజాబ్ కింగ్స్ రిటైన్ చేసే ఐదుగురు ఆటగాళ్లు వీరే..
చికెన్‌ బిర్యానీ విత్ పెరుగు.. కుమ్మేసుకుంటున్నారా..? డేంజర్‌లో
చికెన్‌ బిర్యానీ విత్ పెరుగు.. కుమ్మేసుకుంటున్నారా..? డేంజర్‌లో
గురక సమస్యతో బాధపడుతున్నారా.? చికిత్స కోసం ఇక్కడి కొచ్చేయండి
గురక సమస్యతో బాధపడుతున్నారా.? చికిత్స కోసం ఇక్కడి కొచ్చేయండి
ధోనితో ఉన్న ఈటాలీవుడ్ హీరోయిన్‌ను గుర్తు పట్టారా? త్వరలోనే పెళ్లి
ధోనితో ఉన్న ఈటాలీవుడ్ హీరోయిన్‌ను గుర్తు పట్టారా? త్వరలోనే పెళ్లి
శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. తిరుపతిలో మరో అద్భుత కట్టడం
శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. తిరుపతిలో మరో అద్భుత కట్టడం
నాగుపాము బుసకొడుతూ ధమ్మీకి.. తోక ముడిచిన పెద్దపులి పరుగో పరుగు
నాగుపాము బుసకొడుతూ ధమ్మీకి.. తోక ముడిచిన పెద్దపులి పరుగో పరుగు
అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక డకౌట్లు.. లిస్టులో భారత ఆటగాళ్లు
అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక డకౌట్లు.. లిస్టులో భారత ఆటగాళ్లు
శ్రీవారి సన్నిధిలో బంగారు భక్తులు. ఒంటినిండా కేజీల కొద్దీ ఆభరణాలు
శ్రీవారి సన్నిధిలో బంగారు భక్తులు. ఒంటినిండా కేజీల కొద్దీ ఆభరణాలు
కొత్త టీవీని లాంచ్‌ చేస్తున్న షావోమీ.. క్యూఎల్‌ఈడీ స్క్రీన్‌తో..
కొత్త టీవీని లాంచ్‌ చేస్తున్న షావోమీ.. క్యూఎల్‌ఈడీ స్క్రీన్‌తో..
రవితేజ 'ఇడియట్' మూవీ హీరోయిన్ గుర్తుందా..?
రవితేజ 'ఇడియట్' మూవీ హీరోయిన్ గుర్తుందా..?
శ్రీవారి సన్నిధిలో బంగారు భక్తులు. ఒంటినిండా కేజీల కొద్దీ ఆభరణాలు
శ్రీవారి సన్నిధిలో బంగారు భక్తులు. ఒంటినిండా కేజీల కొద్దీ ఆభరణాలు
భలే భలేగా.. పెన్సిల్ మొనపై బాలగోపాలుడు.. చూస్తే అవాక్!
భలే భలేగా.. పెన్సిల్ మొనపై బాలగోపాలుడు.. చూస్తే అవాక్!
మధ్యప్రదేశ్‌లో విషాదం.! ఆవును కాపాడబోయి ముగ్గురు మృతి..
మధ్యప్రదేశ్‌లో విషాదం.! ఆవును కాపాడబోయి ముగ్గురు మృతి..
యుగాలు మారినా.. తరాలు మారినా.. కృష్ణతత్వమే ఇంకా దారి చూపుతోందా.!
యుగాలు మారినా.. తరాలు మారినా.. కృష్ణతత్వమే ఇంకా దారి చూపుతోందా.!
హైదరాబాద్‌లో వింతఘటన.! ఆశ్చర్యపోతున్న జనం.. నెట్టింట వైరల్‌.
హైదరాబాద్‌లో వింతఘటన.! ఆశ్చర్యపోతున్న జనం.. నెట్టింట వైరల్‌.
ప్రపంచంలోనే అతి పెద్ద వజ్రం దొరికింది.! భారీ వజ్రాన్ని 9 భాగాలు..
ప్రపంచంలోనే అతి పెద్ద వజ్రం దొరికింది.! భారీ వజ్రాన్ని 9 భాగాలు..
ఏది నిజం.? ఏది అబద్ధం.? సునీతా-విల్ మోర్ ప్రాణాలతో తిరిగొస్తారా.?
ఏది నిజం.? ఏది అబద్ధం.? సునీతా-విల్ మోర్ ప్రాణాలతో తిరిగొస్తారా.?
తిరుమల కొండపై నీటి కష్టాలు! ఈ ఎఫెక్ట్ బ్రహ్మోత్సవాలు మీద పడనుందా?
తిరుమల కొండపై నీటి కష్టాలు! ఈ ఎఫెక్ట్ బ్రహ్మోత్సవాలు మీద పడనుందా?
కాళేశ్వరంప్రాజెక్టుకు భారీగావరద ఉధృతి..లక్ష్మీ బ్యారేజ్ పరిస్థితి
కాళేశ్వరంప్రాజెక్టుకు భారీగావరద ఉధృతి..లక్ష్మీ బ్యారేజ్ పరిస్థితి
కోల్ కతా డాక్టర్ హత్యాచారం కేసులో DNA రిపోర్టే కీలకం.!
కోల్ కతా డాక్టర్ హత్యాచారం కేసులో DNA రిపోర్టే కీలకం.!