Tollywood: పునీత్తో ఉన్న ఈ పిల్లాడు ఇప్పుడు హీరో అయిపోయాడు.. డ్యాన్సులు ఇరగదీస్తున్నాడు.. గుర్తు పట్టారా?
స్టార్ నటీ నటుల చిన్ననాటి, త్రో బ్యాక్ ఫొటోలు సోషల్ మీడియాలో తరచూ దర్శనమిస్తుంటాయి. వీటిని చూసి సినీ అభిమానులు, నెటిజన్లు కూడా ఆశ్చర్యపోతుంటారు. తమ హీరో చిన్నప్పుడు ఇలా ఉండేవాడా? అప్పటికీ, ఇప్పటికీ ఎంతగా మారిపోయాడు కదా? అంటూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తుంటారు.

దివంగత నటుడు పునీత్ రాజ్ కుమార్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. కన్నడ హీరోనే అయినప్పటికీ తెలుగు రాష్ట్రాల్లోనూ అతనికి చాలా మంది అభిమానులు ఉన్నారు. చిన్నతనంలోనే స్టార్ హీరోగా ఎదిగిన అప్పు నాలుగేళ్ల క్రితం గుండెపోటుతో కన్నుమూశాడు. అయితే తన సినిమాలు, సామాజిక సేవా కార్యక్రమాల రూపంలో ఇప్పటికీ అభిమానుల గుండెల్లో ఉన్నాడీ కన్నడ హీరో. ఇక పునీత్ ను ఆదర్శంగా తీసుకునే ఎంతో మంది సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్నారు. నటులుగా రాణిస్తూ తమ కంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఈ క్రమంలో ఇటీవలే ఓ కొత్త హీరో కూడా సినిమాల్లోకి అడుగు పెట్టాడు. మొదటి సినిమాలోనే అద్భుతమైన డ్యాన్సులు, ఫైట్లతో ఆకట్టుకున్నాడు. యాక్టింగ్ పరంగా కూడా మంచి మార్కులే అందుకున్నాడు. ఈ క్రమంలో కొందరు సినీ అభిమానులు, నెటిజన్లు ఈ యంగ్ హీరోను పునీత్ రాజ్ కుమార్ తో పోల్చుతున్నారు. ఇద్దరినీ కంపేర్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెడుతున్నారు. ఇవి నెట్టింట బాగా వైరలవుతున్నాయి. అలా పై ఫొటో కూడా అందరినీ ఆకట్టుకుంటోంది. మరి అందులో పునీత్ తో ఉన్నదెవరో గుర్తు పట్టారా? అతను మరెవరో కాదు ఇటీవలే జూనియర్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన మాజీ మంత్రి గాలి జనార్ధన రెడ్డి కుమారుడు కిరిటీ. జూనియర్ సినిమా రిలీజ్ నేపథ్యంలో అతని చిన్ననాటి ఫొటోలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి.
తెలుగు, కన్నడ భాషల్లో ఒకేసారి జూనియర్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.జూలై 18న రిలీజైన ఈ సినిమమా థియేటర్లలో బాగానే సందడి చేస్తోంది. కిరిటీ డ్యాన్సులు, ఫైట్లకు ఆడియెన్స్ నుంచి మంచి స్పందన వస్తోంది. ముఖ్యంగా వైరల్ వయ్యారీ సాంగ్ లో శ్రీలీలకు పోటీగా కిరిటీ వేసిన స్టెప్పులు జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ ను గుర్తకు తెచ్చాయంటున్నారు ఫ్యాన్స్.
పునీత్ రాజ్ కుమార్ తో కిరిటీ రెడ్డి..
View this post on Instagram
రాధా కృష్ణారెడ్డి తెరకెక్కించిన జూనియర్ సినిమాలో రవిచంద్రన్, జెనీలియా, రావు రమేష్, సత్య కీలక పాత్రలో పోషించారు. వారాహి చలన చిత్ర, సాయి కొర్రపాటి ప్రొడక్షన్ బ్యానర్పై సంయుక్తంగా నిర్మించారు. రజనీ కొర్రపాటి నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.
శివన్నతో కలిసి..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








