Rajinikanth: రజినీకాంత్కు తల్లిగా, చెల్లిగా, ప్రియురాలిగా నటించిన ఏకైక హీరోయిన్.. ఇంతకీ ఆమె ఎవరంటే..
ప్రస్తుతం యంగ్ హీరోలకు సీనియర్స్ స్టార్స్ గట్టిపోటినిస్తున్న సంగతి తెలిసిందే. ఏడు పదుల వయసులోనూ బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. సూపర్ స్టార్ రజినీకాంత్ గురించి చెప్పక్కర్లేదు. ఇప్పటికీ చేతినిండా సినిమాలతో బిజీగా ఉంటున్నారు. అయితే రజినీ కెరీర్ లో ఓ హీరోయిన్ చాలా స్పెషల్.. మీకు తెలుసా.. ?

సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ కు ఉన్న క్రేజ్ గురించి తెలిసిందే. మన దేశంతోపాటు విదేశాల్లోనూ ప్రాణాలు ఇచ్చే అభిమానులు ఉన్నారు. ఆయనను ఫ్యాన్స్ ముద్దుగా తలైవా అని పిలుచుకుంటారు. ఈ స్టార్ హీరో సినిమాల కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తుంటారు. ఇప్పటివరకు వందల హిట్ చిత్రాలతో అలరించారు. ఇప్పటికీ తలైవా మూవీస్ కోసం కోట్లాది మంది అభిమానులు ఎదురుచూస్తుంటారు. నిజానికి రజినీకాంత్ తమిళ్ హీరో.. అయినా దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ ఉంది. ఏడుపదుల వయసులోనూ బ్యాక్ టూ బ్యాక్ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. సినిమా కంటెంట్ ప్రాధాన్యతను బట్టి కుర్రహీరోయిన్లతోనూ జత కడుతున్నారు. ఇక తమిళనాడులో రజనీ సినిమా అక్కడ పెద్ద పండగే. ఇదివరకు రజనీ కొత్త సినిమా వచ్చిందంటే తమిళనాడులోని పలు సంస్థలు సెలవులు ప్రకటించాయంటే తలైవా ఫాలోయింగ్ ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇదిలా ఉంటే.. తలైవా సినీప్రయాణంలో ఓ హీరోయిన్ చాలా స్పెషల్.
ప్రస్తుతం కూలీ చిత్రంలో నటిస్తున్నారు రజినీ. అలాగే ఇప్పుడు ఒక్కో సినిమాకు దాదాపు రూ.200 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నారని టాక్. ఈ సినిమాలో అక్కినేని నాగార్జున సైతం కీలకపాత్రలో నటిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం రజినీకాంత్ కు సంబంధించి ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరలవుతుంది. అదెంటంటే.. రజనీకాంత్ తల్లిగా, భార్యగా, ప్రియురాలిగా నటించిన ఏకైక స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా..? ఆమె మరెవరో కాదు దివంగత హీరోయిన్ శ్రీదేవి. మీరు చదివింది నిజమే. హీరోయిన్ గానే కాదు.. శ్రీదేవి ఓ సినిమాలో రజనీకాంత్ తల్లిగా నటించింది. అలాగే ప్రియురాలిగా, చెల్లిగానూ నటించింది.
శ్రీదేవి తన 13 ఏళ్ల వయసులో రజనీకాంత్ తల్లి పాత్రలో నటించారు. అసలు విషయానికి వస్తే.. 1976లో వచ్చిన మండ్రు ముడిచు చిత్రంలో శ్రీదేవి రజనీ తల్లిగా నటించింది. ఆమెకు ఇదే మొదటి సినిమా. ఆ తర్వాత వీరిద్దరి కాంబోలో దాదాపు 22 సినిమాలు వచ్చాయి. నటి శ్రీదేవి చాలా సినిమాల్లో రజనీకాంత్ భార్యగా, ప్రియురాలిగా నటించారు. అంతేకాదు.. చెల్లెలిగానూ నటించినట్లు సమాచారం. ఇక శ్రీదేవి హిందీలోనే కాకుండా తెలుగు, తమిళ సినిమాల్లో కూడా తనదైన ముద్ర వేసింది. అద్భుతమైన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది. రజినీకి తల్లిగా నటించిన మండ్రు ముడిచు మూవీలో రజనీకాంత్ కంటే ఎక్కువ పారితోషికం తీసుకుంది శ్రీదేవి. ఆమెకు రూ.5,000, రజనీకాంత్ రూ.2,000 రెమ్యునరేషన్ ఇచ్చారట.

Rajini Sridevi
ఇవి కూడా చదవండి :
Mirchi Movie: ఈ హీరోయిన్ ఇంత మారిపోయిందేంటి ?.. మిర్చి మూవీ బ్యూటీ ఫ్యామిలీని చూశారా.. ?
Tollywood: సీనియర్ హీరోలతో నటించేందుకు నాకు ఎలాంటి సమస్య లేదు.. హీరోయిన్ ఓపెన్ కామెంట్స్..