AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pushpa 2: పుష్ప 2కు మరింత పక్కాగా ప్లాన్ చేస్తున్న సుకుమార్.. అల్లు అర్జున్‏ కోసం మరో బాలీవుడ్ హీరో..

పుష్ప సినిమాలోని ప్రతి సాంగ్ సోషల్ మీడియాను షేక్ చేశాయి. ఇక స్టార్ హీరోయిన్ సమంత సైతం స్పెషల్ సాంగ్ లో మెప్పించింది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మించారు. ఇక ఇప్పుడు రూపొందుతున్న పుష్ప 2పై భారీగా అంచనాలున్నాయి.

Pushpa 2: పుష్ప 2కు మరింత పక్కాగా ప్లాన్ చేస్తున్న సుకుమార్.. అల్లు అర్జున్‏ కోసం మరో బాలీవుడ్ హీరో..
Pushpa
Follow us
Rajitha Chanti

|

Updated on: Oct 03, 2022 | 8:44 AM

సక్సెస్ ఫుల్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన పుష్ప మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ మూవీకి దేశవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అంతేకాకుండా రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ రాబట్టింది. ఇక ఇప్పుడు ఈ సినిమాకు సిక్వెల్ గా రాబోతున్న పుష్ప 2 కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. పార్ట్ 1 కంటే పార్ట్ 2 పై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం సెకండ్ పార్ట్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. త్వరలోనే ఈ మూవీ చిత్రీకరణలో హీరోయిన్ రష్మిక కూడా పాల్గొననుంది. అయితే ఈ సినిమా గురించి రోజుకో వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఇందులో సాయి పల్లవి, విజయ్ సేతుపతి కీలకపాత్రలలో కనిపించనున్నట్లు రూమర్స్ నెట్టింట వైరల్ అయ్యాయి. తాజాగా మరో క్రేజ్ అప్డేట్ ఫిల్మ్ సర్కిల్లో వినిపిస్తుంది.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్ అతిథి పాత్రలో కనిపించనున్నారట. ఇప్పటికే అతడితో చర్చలు కూడా జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో మరో పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ ఉందని.. అయితే ఈ రోల్ కోసం ముందుగా విజయ్ సేతుపతిని అనుకున్నారని.. ఇక చివరి నిమిషంలో అర్జు్న్ కపూర్‏ను సెలక్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ స్మగ్లర్ పుష్పరాజ్ పాత్రలో అదరగొట్టారు. ఈ మూవీతో బన్నీతో పాటు హీరోయిన్ రష్మికకు సైతం పాన్ ఇండియా క్రేజ్ వచ్చేసింది. ఇక దేవీ శ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ మరో హైలెట్ అనే చెప్పుకోవాలి.

ఇవి కూడా చదవండి

ఈ సినిమాలోని ప్రతి సాంగ్ సోషల్ మీడియాను షేక్ చేశాయి. ఇక స్టార్ హీరోయిన్ సమంత సైతం స్పెషల్ సాంగ్ లో మెప్పించింది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మించారు. ఇక ఇప్పుడు రూపొందుతున్న పుష్ప 2పై భారీగా అంచనాలున్నాయి.