AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ajith-Dhanush: కాంబో అదిరిపోనాదిగా.. ధనుష్ దర్శకత్వంలో అజిత్.. థియేటర్లు దద్దరిల్లాల్సిందే..

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ నటించిన విడాముయార్చి సినిమా ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ చిత్రంలో త్రిష కథానాయికగా నటించిన సంగతి తెలిసిందే. మరోవైపు ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రాన్ని సైతం అడియన్స్ ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.

Ajith-Dhanush: కాంబో అదిరిపోనాదిగా.. ధనుష్ దర్శకత్వంలో అజిత్.. థియేటర్లు దద్దరిల్లాల్సిందే..
Dhanush, Ajith
Rajitha Chanti
|

Updated on: Mar 04, 2025 | 10:36 AM

Share

కోలీవుడ్ ఇండస్ట్రీలోనే భారీ మల్టీస్టారర్ ప్రాజెక్ట్ రాబోతుంది. ఇన్నాళ్లు హీరోగా వెండితెరను ఏలిన ధనుష్.. ఇప్పుడు దర్శకుడిగా సత్తా చాటుతున్నాడు. ఇటీవలే అతడు తెరకెక్కించిన జాబిలమ్మ నీకు అంత కోపమా సినిమా మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ధనుష్ సోదరి కుమారుడు పవిష్ హీరోగా పరిచయమయ్యాడు. ప్రేమ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం ఫిబ్రవరి 21, 2025న భారీ అంచనాల మధ్య విడుదలై మంచి రివ్యూస్ అందుకుంది. ఈ సినిమాతో పాటు విడుదలైన ప్రదీప్ రంగనాథన్ డ్రాగన్ సినిమా విడుదలైన కొన్ని వారాల్లోనే రూ. 100 కోట్లు వసూలు చేయడం గమనార్హం. తాజాగా ధనుష్ దర్శకుడిగా మరో సినిమాను తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన క్రేజీ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతుంది.

ఇదిలా ఉండగా.. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించి అజిత్ నటించిన ఇడ్లీ కాడి సినిమా కలెక్షన్లపై ప్రభావం చూపుతుందని విడుదల తేదీని వాయిదా వేసినట్లు నివేదికలు సూచిస్తున్నాయి. ఈ సినిమా కూడా అదే తేదీన విడుదల కానుంది. మరోవైపు ధనుష్ దర్శకత్వం వహించే సినిమాలో అజిత్ నటించనున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం నడుస్తుంది. ఈ చిత్రాన్ని వుండర్‌బార్ ఫిల్మ్స్ నిర్మిస్తుందని, అనిరుధ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తారని టాక్ వినిపిస్తుంది. అజిత్ అక్టోబర్ వరకు కార్ రేసింగ్‌లో పాల్గొంటారని గతంలో వార్తలు వచ్చాయి. ధనుష్-అనిరుధ్ కాంబినేషన్‌లో రూపొందనున్న ఈ సినిమా షూటింగ్ 2025 అక్టోబర్ లేదా డిసెంబర్ నాటికి ప్రారంభమవుతుందని నివేదికలు సూచిస్తున్నాయి.

ధనుష్ ప్రతిభావంతుడైన నటుడు మాత్రమే కాదు, ఆయన దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘పవర్ పాండి’ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అదేవిధంగా, అతను దర్శకత్వం వహించి, నటించిన రాయన్ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. అజిత్ తో దర్శకత్వం వహించే ఈ సినిమా ఎంత పెద్ద సినిమా అవుతుందనే దానిపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి :  Tollywood: చిన్నప్పుడే అవార్డులు.. టాలీవుడ్ క్రేజీ హీరో.. ఇప్పుడు అవకాశాల కోసం..

Tollywood: అప్పుడు కలెక్టర్ దగ్గర ఉద్యోగం.. ఇప్పుడు స్టార్ కమెడియన్.. ఎవరో తెలుసా.. ?

Mahesh Babu: మహేష్ మేనకోడలు ఎంత అందంగా ఉందో చూశారా.. ? ఇక హీరోయిన్స్ సైడ్ అవ్వాల్సిందే..

ఒక్క సినిమా చేయలేదు.. హీరోయిన్లకు మించి క్రేజ్.. ఎవరంటే..