AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మహేష్‌ సినిమాను రిజెక్ట్ చేసిన సాయి పల్లవి.. కారణమిదేనా..!

సూపర్‌స్టార్‌ మహేష్ బాబు పక్కన ఛాన్స్‌ వస్తే ఎవ్వరూ అంత ఈజీగా వదులుకోరు. కానీ ఫిదా బ్యూటీ సాయి పల్లవి నో చెప్పిందట.

మహేష్‌ సినిమాను రిజెక్ట్ చేసిన సాయి పల్లవి.. కారణమిదేనా..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 22, 2020 | 1:45 PM

Share

సూపర్‌స్టార్‌ మహేష్ బాబు పక్కన ఛాన్స్‌ వస్తే ఎవ్వరూ అంత ఈజీగా వదులుకోరు. కానీ ఫిదా బ్యూటీ సాయి పల్లవి నో చెప్పిందట. అనిల్ రావిపూడి దర్వకత్వంలో మహేష్ సరిలేరు నీకెవ్వరు చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. ఈ మూవీలో రష్మిక హీరోయిన్‌గా నటించింది. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా నిలిచింది. అంతేకాదు ఉగాది సందర్భంగా బుల్లితెరపై ఈ మూవీ ప్రీమియర్‌ షో ప్రదర్శించగా.. అక్కడా అత్యధిక టీఆర్పీని సాధించి.. బాహుబలి 2 రికార్డును బ్రేక్ చేసింది.

కాగా ఈ మూవీలో మొదట హీరోయిన్‌గా సాయి పల్లవిని అనుకున్నారట. ఈ మేరకు ఆమెను సంప్రదించినట్లు కూడా సమాచారం. అయితే కారణాలు తెలీవు గానీ ఇందులో తాను నటించలేనని చెప్పిందట. ఇక ఆ తరువాత ఆ ఆఫర్ రష్మికకు వెళ్లినట్లు సమాచారం. కాగా కెరీర్ ప్రారంభం నుంచి చాలా సెలక్టివ్‌గా సినిమాలు చేసుకుంటూ వస్తోంది సాయి పల్లవి. లెంగ్త్ తక్కువగా ఉన్నప్పటికీ.. తనకు ప్రాధాన్యత ఉన్న కథలనే ఎంచుకుంటూ వాటిలోనే ఆమె నటిస్తోంది. ఈ క్రమంలోనే తెలుగు, తమిళ్‌లో చాలా సినిమాలను ఆమె వదులుకున్నట్లు టాక్‌ ఉంది. ఇక సరిలేరు నీకెవ్వరులో హీరోయిన్ పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేదని భావించిన సాయి పల్లవి.. ఆ ఆఫర్ కు నో చెప్పినట్లు తెలుస్తోంది. కాగా ప్రస్తుతం సాయి పల్లవి, రానా విరాట పర్వం.. నాగ చైతన్య సరసన లవ్ స్టోరీలో నటిస్తోంది. వీటి తరువాత కిశోర్ తిరుమల తెరకెక్కించబోయే కామెడీ ఎంటర్‌టైనర్‌లో శర్వానంద్‌తో మరోసారి జోడీ కట్టబోతోంది సాయి పల్లవి.

Read This Story Also: కరోనా కలిపింది ఆ ఇద్దరినీ.. లైవ్‌లో ‌దిగ్గజ ఆటగాళ్ల సరదా సంభాషణ..!