ప్రివ్యూ చూసి ఇదేం సినిమా.. అట్టర్ ఫ్లాప్ అన్నారు..! కట్ చేస్తే ఇండస్ట్రీలోనే క్లాసిక్ హిట్
తెలుగు సినిమా చరిత్రలో తిరుగులేని కల్ట్ క్లాసిక్ హిట్స్ గా నిలిచిన సినిమాలు ఈ సినిమా ఒకటి.. ఈ సినిమా కథ ఓ అద్భుతం. అందమైన ప్రేమ కథను అద్భుతమైన చిత్రంగా మలిచారు. సినిమా చూసి మొదట్లో ఫ్లాప్ అన్నారు.. కానీ ఇండస్ట్రీ హిట్ అందుకుంది.

టాలీవుడ్ కింగ్ నాగార్జున సినీ కెరీర్లో ఒక మైలురాయిగా నిలిచిన మణిరత్నం క్లాసిక్ గీతాంజలి. ఈ సినిమా ఇప్పటికీ చాలా మంది ఫేవరెట్ మూవీ.. ఈ సినిమా గురించి ప్రముఖ అనాలసిస్ట్ చిల్లగట్టు శ్రీకాంత్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ చిత్రం కేవలం ఒక ప్రేమకథ కాదని, అది ఒక కవితాత్మక దృశ్య కావ్యం అని ఆయన అన్నారు. గీతాంజలి సినిమా విజయానికి అనేక మంది నటుల అద్భుత ప్రదర్శనలు దోహదపడ్డాయని శ్రీకాంత్ పేర్కొన్నారు. నాగార్జున తల్లి పాత్రలో సుమిత్ర గారి కేరింగ్, సెటిల్డ్ నటన సినిమాకు ఒక కొత్త కోణాన్ని తీసుకొచ్చింది. అలాగే గీతాంజలి తండ్రి పాత్రలో విజయ్ కుమార్, నాగార్జున తండ్రి పాత్రలో విజయ్ చందర్, బామ్మ పాత్రలో రాధాభాయి తమ పాత్రలకు ప్రాణం పోశారు. ముఖ్యంగా సుత్తివేలు గారి హాస్య నటన, ప్రత్యేకమైన సౌండింగ్ డిజైన్ చిత్రానికి విలక్షణతను తెచ్చాయి. మణిరత్నం ఘర్షణ చిత్రంలోని ఒక హాస్య సన్నివేశాన్ని గీతాంజలికి అనుకూలంగా మార్చుకోవడం ఆయన సృజనాత్మకతకు నిదర్శనం. సుత్తివేలు గారి వయసుకు తగినట్లుగా డిస్కో శాంతి పాత్రతో కూడిన హాస్య సన్నివేశం ఆయనకు ఉత్తమ హాస్యనటుడు అవార్డు రావడానికి కారణమైందని శ్రీకాంత్ అన్నారు.
ఇది కూడా చదవండి : బాలయ్య సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్గా హీరోయిన్గా చేసిన ఏకైక నటి.. ఆ కుర్రాడు కూడా హీరోనే
గీతాంజలి కథ ఒక విషాద ప్రేమకథ అయినప్పటికీ, మణిరత్నం దానిని కవితాత్మకంగా చెప్పారని శ్రీకాంత్ అన్నారు. ఇద్దరు క్యాన్సర్ రోగుల ప్రేమకథను, చివరికి వారు మరణిస్తారనే విషయాన్ని స్పష్టంగా చూపించకుండా, ఆ ప్రేమ ప్రయాణాన్ని అత్యద్భుతంగా ఆవిష్కరించారు. ఈ కథనాన్ని ప్రేక్షకులు ఎలా స్వీకరిస్తారని సందేహాలు వ్యక్తమైనప్పటికీ, నాగార్జున మాత్రం ఈ సినిమా విజయంపై గట్టి నమ్మకాన్ని ఉంచారు. ఒక విషాదాన్ని విషాదభరితంగా కాకుండా, కొత్తదనాన్ని, నవ్యతను చూపే మణిరత్నం ఆలోచననే ఈ చిత్రం విజయానికి మూలం. మొదట్లో ప్రివ్యూలు చూసి ఫ్లాప్ అని అందరూ భావించినా, నాగార్జున నమ్మకంతో నిలిచారు, ఒక వారం తర్వాత ఆయన నమ్మకమే నిజమైంది.
ఇది కూడా చదవండి : Folk Song: ఏం పాట మావ..! అమ్మాయిలు తెగ పాడుకుంటున్న సాంగ్.. వచ్చి 5 ఏళ్లు అవుతున్నా ఇప్పటికీ ట్రెండింగ్లోనే
గీతాంజలి కేవలం కథాబలంతోనే కాకుండా, దాని సాంకేతిక విలువలతో, ముఖ్యంగా సంగీతంతో ప్రత్యేక స్థానాన్ని పొందింది. మణిరత్నం విజన్కు పి.సి. శ్రీరామ్ గారి సినిమాటోగ్రఫీ, ఇళయరాజా గారి సంగీతం తోడయ్యాయి. శ్రీకాంత్ మాట్లాడుతూ, పి.సి. శ్రీరామ్ ఒక హీరో అని, ఇళయరాజా గారి బీజీఎం, పాటలు సినిమాకు ప్రాణం పోశాయని అన్నారు. వేటూరి గారి లోతైన సాహిత్యం, ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, జానకి, చిత్ర గార్ల అద్భుత గానం “ఓం నమః” అలాగే “ఓ పాప లాలీ” వంటి పాటలను చిరస్థాయిగా నిలిపాయి. నాగార్జున, గిరిజల కెమిస్ట్రీ, డిఫరెంట్ హెయిర్స్టైల్, లుక్స్తో నాగార్జున యాక్టింగ్, గిరిజ సహజత్వం ఈ చిత్రానికి మరింత ఆకర్షణను తెచ్చాయి. గీతాంజలి తెలుగు సినిమా చరిత్రలో ఒక మరపురాని క్లాసిక్గా నిలిచిపోయింది.
ఇది కూడా చదవండి : Shruti Haasan: ఆ సాంగ్ వల్ల.. నన్ను ఇష్టపడని వారు కూడా నాకు ఫోన్ చేసి మెచ్చుకున్నారు..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




