AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రానా కోసం రంగంలోకి రిటైర్ట్ పోలీస్ ఆఫీసర్..!

దగ్గుబాటి వారసుడు రానా మళ్లీ బిజీ అవుతున్నారు. అనారోగ్య సమస్యల కారణంగా గత కొంతకాలంగా షూటింగ్‌లకు గ్యాప్ ఇచ్చిన ఈ హీరో.. ఇప్పుడు తాను ఒప్పుకున్న సినిమాలను పూర్తి చేయాలనుకుంటున్నాడు. ఈ క్రమంలో పక్కా ప్రణాళికతో షూటింగ్‌ల్లో పాల్గొంటున్నాడు. కాగా తెలుగులో రానా ‘విరాట పర్వం’లో నటిస్తోన్న విషయం తెలిసిందే. ‘నీది నాది ఒకే కథ’ ఫేమ్ వేణు ఊడుగుల దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రంలో సాయి పల్లవి హీరోయిన్‌గా కనిపించనుంది. ఇక ఇందులో రానా పోలీస్ […]

రానా కోసం రంగంలోకి రిటైర్ట్ పోలీస్ ఆఫీసర్..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Dec 29, 2019 | 12:57 PM

Share

దగ్గుబాటి వారసుడు రానా మళ్లీ బిజీ అవుతున్నారు. అనారోగ్య సమస్యల కారణంగా గత కొంతకాలంగా షూటింగ్‌లకు గ్యాప్ ఇచ్చిన ఈ హీరో.. ఇప్పుడు తాను ఒప్పుకున్న సినిమాలను పూర్తి చేయాలనుకుంటున్నాడు. ఈ క్రమంలో పక్కా ప్రణాళికతో షూటింగ్‌ల్లో పాల్గొంటున్నాడు. కాగా తెలుగులో రానా ‘విరాట పర్వం’లో నటిస్తోన్న విషయం తెలిసిందే. ‘నీది నాది ఒకే కథ’ ఫేమ్ వేణు ఊడుగుల దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రంలో సాయి పల్లవి హీరోయిన్‌గా కనిపించనుంది. ఇక ఇందులో రానా పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు.

నక్సలిజం నేపథ్యంగా తెరకెక్కుతోన్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం వికారాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. దాదాపు 10రోజుల పాటు అక్కడ షూటింగ్ జరగనుండగా.. దర్శకుడు యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నాడు. ఇదిలా ఉంటే ఇక ఇందులో పోలీస్ పాత్ర కోసం ఓ రిటైర్ట్ పోలీస్ ఆఫీసర్ దగ్గర రానా శిక్షణ పొందుతున్నాడట. రైఫిల్ షూటింగ్‌తో పాటు మారణాయుధాలను ఎలా వాడాలి అనే దానిపై రానా ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నాడట. అతడి కోసం ప్రత్యేకంగా కొంతమంది టెక్నీషియన్లు వచ్చినట్లు కూడా తెలుస్తోంది. కాగా సురేష్ బాబు, సుధాకర్ చెరుకూరి సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది వేసవిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.