AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Raj Tarun: ఓటీటీలోకి వస్తోన్న రాజ్ తరుణ్ యాక్షన్ డ్రామా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..

చాలాకాలం తర్వాత రాజ్ తరుణ్ హీరోగా నటించిన సినిమా పురుషోత్తముడు. ఈ చిత్రానికి మిశ్రమ స్పందన వచ్చింది. జూలై 26న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ ఆశించినంతగా మెప్పించలేకపోయింది. యాక్షన్ కామెడీ డ్రామాగా వచ్చిన ఈ చిత్రానికి రామ్ భీమన దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రాబోతుంది. థియేటర్లలో అంతగా ఆకట్టులేకపోయిన ఈ సినిమా స్ట్రీమింగ్ డేట్ ఫిక్సైంది.

Raj Tarun: ఓటీటీలోకి వస్తోన్న రాజ్ తరుణ్ యాక్షన్ డ్రామా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..
Purushothamudu Movie
Rajitha Chanti
|

Updated on: Aug 27, 2024 | 7:08 AM

Share

ఇటీవల కొద్ది రోజులుగా టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ పేరు వార్తలలో మారుమోగుతున్న సంగతి తెలిసిందే. వ్యక్తిగత విషయాలతో నిత్యం నెట్టింట ట్రెండ్ అయిన ఈ హీరో.. అటు బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో అడియన్స్ ముందుకు వచ్చాడు. చాలాకాలం తర్వాత రాజ్ తరుణ్ హీరోగా నటించిన సినిమా పురుషోత్తముడు. ఈ చిత్రానికి మిశ్రమ స్పందన వచ్చింది. జూలై 26న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ ఆశించినంతగా మెప్పించలేకపోయింది. యాక్షన్ కామెడీ డ్రామాగా వచ్చిన ఈ చిత్రానికి రామ్ భీమన దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రాబోతుంది. థియేటర్లలో అంతగా ఆకట్టులేకపోయిన ఈ సినిమా స్ట్రీమింగ్ డేట్ ఫిక్సైంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఆగస్ట్ 29న ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది ఆహా.

“ధైర్యానికి ఉన్న శక్తిని చూసేందుకు రెడీగా ఉండండి. ఆగస్ట్ 29న పురుషోత్తముడు ఆహాలో ప్రీమియర్ కానుంది” అంటూ ట్వీట్ చేసింది ఆహా ఓటీటీ. ఈ మూవీలో రాజ్ తరుణ్ సరసన హాసినీ సుధీర్ కథానాయికగా నటించింది. ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, మురళీశర్మ, బ్రహ్మానందం కీలకపాత్రలు పోషించగా రామ్ భీమన ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సీఈవో కావాలనుకునే యువకుడు 100 రోజుల్లో సామాన్యుడిలా జీవితం గడపడం అనే అంశం చుట్టూ ఈ సినిమా స్టోరీ సాగుతుంది. శ్రీశ్రీదేవి ప్రొడక్షన్ బ్యానర్ పై రమేశ్ తేజవత్, ప్రకాష్ తేజవత్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మించగా గోపీ సుందర్ సంగీతం అందించారు.

ఇవి కూడా చదవండి

ఈ సినిమాతోపాటు రాజ్ తరుణ్ హీరోగా నటించిన మరో సినిమా తిరగబడరా సామి. ఆగస్ట్ 2న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఇందులో మాల్వీ మల్హోత్రా కథానాయికగా నటించింది. ఇదిలా ఉంటే.. అటు రాజ్ తరుణ్, లావణ్య కేసు ఇంకా కొనసాగుతూనే ఉంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
రోజూ టన్నుల కొద్దీ జీడిపప్పు ఎలా ప్రాసెస్ చేస్తారో తెలిస్తే
రోజూ టన్నుల కొద్దీ జీడిపప్పు ఎలా ప్రాసెస్ చేస్తారో తెలిస్తే
ఐపీఎల్ 2025లో బ్యాటర్ల చేతిలో బలైపోయిన టాప్-5 బౌలర్లు వీళ్లే
ఐపీఎల్ 2025లో బ్యాటర్ల చేతిలో బలైపోయిన టాప్-5 బౌలర్లు వీళ్లే
ఎండు చేపలు వండే ముందు ఈ చిట్కా పాటిస్తే.. అస్సలు వాసన రాదు..
ఎండు చేపలు వండే ముందు ఈ చిట్కా పాటిస్తే.. అస్సలు వాసన రాదు..
తనపై వస్తున్న విమర్శలపై టీవీ9తో హైడ్రా కమిషర్ రంగనాథ్ ఏమన్నారంటే?
తనపై వస్తున్న విమర్శలపై టీవీ9తో హైడ్రా కమిషర్ రంగనాథ్ ఏమన్నారంటే?
ప్రియుడిని పెళ్లి చేసుకున్న బిగ్ బాస్ బ్యూటీ..
ప్రియుడిని పెళ్లి చేసుకున్న బిగ్ బాస్ బ్యూటీ..
పాత దువ్వెనలను పారేస్తున్నారా? ఇలాంటి ఐడియాలతో మళ్లీ వాడేయండి!
పాత దువ్వెనలను పారేస్తున్నారా? ఇలాంటి ఐడియాలతో మళ్లీ వాడేయండి!
చెరుకు రసం Vs పుచ్చకాయ రసం.. సమ్మర్‌లో ఆరోగ్యానికి ఏది మంచిది..?
చెరుకు రసం Vs పుచ్చకాయ రసం.. సమ్మర్‌లో ఆరోగ్యానికి ఏది మంచిది..?
బంగారం ధరల్లో భారీ క్రాష్.. త్వరలో రూ.1.20 లక్షలకు డౌన్..!
బంగారం ధరల్లో భారీ క్రాష్.. త్వరలో రూ.1.20 లక్షలకు డౌన్..!
జొన్న ఇడ్లీలు ఇలా చేసుకుని.. పల్లీల చట్నీతో తింటే రుచి అదుర్స్
జొన్న ఇడ్లీలు ఇలా చేసుకుని.. పల్లీల చట్నీతో తింటే రుచి అదుర్స్
మీతో సినిమా చేయాలనుందని ఆయనకు చెబితే..
మీతో సినిమా చేయాలనుందని ఆయనకు చెబితే..