ఓటీటీలోకి రానా, సాయి పల్లవి సినిమా.. ‘విరాటపర్వం’ విడుదల పై క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్..

Virata Parvam Movie Update: రానా దగ్గుపాటి ప్రధాన పాత్రలో.. డైరెక్టర్ వేణు ఊడుగుల తెరకెక్కించిన చిత్రం విరాట పర్వం. ఇందులో రానా సరసన

ఓటీటీలోకి రానా, సాయి పల్లవి సినిమా.. 'విరాటపర్వం' విడుదల పై క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్..
Virata Parvam
Follow us

|

Updated on: May 25, 2021 | 2:25 PM

Virata Parvam Movie Update: రానా దగ్గుపాటి ప్రధాన పాత్రలో.. డైరెక్టర్ వేణు ఊడుగుల తెరకెక్కించిన చిత్రం విరాట పర్వం. ఇందులో రానా సరసన నేచురల్ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, సాంగ్, టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. దాంతో సినిమా పై అంచనాలు కూడా ఏర్పడ్డాయి.  ఈ సినిమా షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ మూవీ.. ఏప్రిల్ 30న రిలీజ్‌ కావాల్సి ఉంది.. కానీ అదే సమయంలో కరోనా అడ్డంపడింది. దీంతో తాత్కలికంగా సినిమా విడుదలను వాయిదా వేసినట్లుగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా వాయిదా వేసినప్పటి నుంచి ఓటీటీలో విడుదలయ్యే అవకాశాలున్నట్లుగా సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. Rana Daggubati

తాజాగా ఈ వార్తలపై డైరెక్టర్ వేణు ఊడుగుల స్పందించారు. విరాట పర్వం సినిమా ఓటీటీలో విడుదల చేసే ఆలోచన లేదని.. కరోనా పరిస్థితులు తగ్గిన తర్వాత.. ఎప్పటికైనా థియేటర్లలోనే విడుదల చేస్తామని తెలిపారు. ప్రస్తుతం కరోనా కారణాంగా థియేటర్లు మూతపడ్డాయని.. పరిస్థితులు ఓ కొలిక్కి వచ్చాక… కొత్త తేదీని ప్రకటిస్తామని చెప్పారు. ఇదిలా ఉంటే.. విప్లవాత్మకమైన ప్రేమకథగా వస్తున్న ఈ సినిమాలో రానా కామ్రేడ్ రవన్నగా నటిస్తున్నాడు. ప్రియమణి ఓ కీలక పాత్రలో నటిస్తోంది. అలాగే ఈ చిత్రాన్ని దుగ్గుబాటి సురేష్ బాబు, సుధాకర్ చెరుకూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.. Sai pallavi

Also Read: రెమ్యునరేషన్ భారీగా పెంచిన పాన్ ఇండియా డైరెక్టర్.. ఎన్టీఆర్ సినిమా కోసం ప్రశాంత్ నీల్ అంత తీసుకుంటున్నాడా ?

Jabardasth: ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో మరోసారి చిక్కుకున్న జబర్దస్త్ నటుడు.. గాలింపు చేపట్టిన పోలీసులు..

మహేశ్ సినిమా కోసం రూటు మార్చుకున్న డైరెక్టర్.. సర్కారు వారి పాటలో కీర్తి సురేష్ రోల్ అలా ఉండబోతుందా ?

Post Corona symptoms: క‌రోనా నుంచి కోలుకున్నా ఈ ల‌క్ష‌ణాలు వెంటాడుతూనే ఉన్నాయి.. కొన్ని సార్లు నెల‌లు గ‌డిచినా..