Rakhi Sawant : క్యాన్సర్‏తో రాఖీ సావంత్ తల్లి కన్నుమూత.. ఎమోషనల్ నోట్ షేర్ చేసిన బిగ్‏బాస్ కంటెస్టెంట్..

కొద్ది రోజుల క్రితం తన తల్లి ఆరోగ్యం గురించి ఎమోషనల్ అవుతూ ఓ వీడియో షేర్ చేసింది రాఖీ. బ్రెయిన్ ట్యూమర్ మాత్రమే కాకుండా.. తన తల్లికి క్యాన్సర్ ఉన్నట్లు తెలిసిందని భావోద్వేగానికి గురయ్యింది రాఖీ.

Rakhi Sawant : క్యాన్సర్‏తో రాఖీ సావంత్ తల్లి కన్నుమూత.. ఎమోషనల్ నోట్ షేర్ చేసిన బిగ్‏బాస్ కంటెస్టెంట్..
Rakhi Sawanth
Follow us

|

Updated on: Jan 29, 2023 | 2:18 PM

బాలీవుడ్ నటి రాఖీ సావంత్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. బ్రెయిన్ ట్యూమర్..క్యాన్సర్‏తో గత కొద్ది రోజులుగా చికిత్స తీసుకుంటున్న ఆమె తల్లి జనవరి 28న తుది శ్వాస విడిచారు. ఆమె తల్లి మరణించిన విషయాన్ని రాఖీ భర్త ఆదిల్ దురానీ కన్ఫార్మ్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రముఖలు సంతాపం తెలుపుతున్నారు. రాఖీ సావంత్ బిగ్ బాస్ సీజన్ 14లో పాల్గొన్న సమయంలోనే ఆమె తల్లికి బ్రెయిన్ ట్యూమర్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. కొద్ది రోజుల క్రితం తన తల్లి ఆరోగ్యం గురించి ఎమోషనల్ అవుతూ ఓ వీడియో షేర్ చేసింది రాఖీ. బ్రెయిన్ ట్యూమర్ మాత్రమే కాకుండా.. తన తల్లికి క్యాన్సర్ ఉన్నట్లు తెలిసిందని భావోద్వేగానికి గురయ్యింది రాఖీ.

గత కొద్ది రోజులుగా రాఖీ సావంత్ తల్లి ముంబైలోని తాజ్ మెమోరియల్ క్యాన్సర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలోనే జనవరి 28న రాత్రి ఆమె ఆరోగ్యం మరింత క్షీణించి తుదిశ్వాస విడిచినట్లు రాఖీ భర్త ఆదిల్ తెలిపారు. తన తల్లిని గుర్తుచేసుకుంటూ రాఖీ సావంత్ ఎమోషనల్ నోట్ షేర్ చేసింది.

ఇవి కూడా చదవండి

“ఇకపై నన్ను ఆశీర్వదించేందుకు మా అమ్మ చేయి నా తలపై ఉండదు.. ఇంకా నేను కోల్పోవడానికేమీ లేదు. అమ్మా.. నేను నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను. మిస్ యూ అమ్మ..” అంటూ తన ఇన్ స్టాలో రాసుకోచ్చింది. దీంతో రాఖీకి ధైర్యం చెబుతూ.. ఆమె కుటుంబసభ్యులుకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు నెటిజన్స్.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.