Bengaluru: పెళ్లై ఏడాది తిరక్కముందే టెకీ ఆత్మహత్య.. భర్త ప్రవర్తన సరిగా లేదంటూ..

భార్య, భర్తలిద్దరూ మంచి పేరున్న సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. రెండు చేతుల్లా సంపాదన, మంచి లగ్జరీ జీవితం. కానీ వారి కాపురంలో మూడో వ్యక్తి రావడంతో కలలన్ని ఒక్కసారిగా కుప్పకులాయి. నచ్చిన భర్తతో సంతోషంగా జీవించాలని కోరుకున్న వధువు ఆశలన్నీ నిరాశలయ్యాయి...

Bengaluru: పెళ్లై ఏడాది తిరక్కముందే టెకీ ఆత్మహత్య.. భర్త ప్రవర్తన సరిగా లేదంటూ..
Representative Image
Follow us

|

Updated on: Nov 25, 2022 | 2:20 PM

భార్య, భర్తలిద్దరూ మంచి పేరున్న సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. రెండు చేతుల్లా సంపాదన, మంచి లగ్జరీ జీవితం. కానీ వారి కాపురంలో మూడో వ్యక్తి రావడంతో కలలన్ని ఒక్కసారిగా కుప్పకులాయి. నచ్చిన భర్తతో సంతోషంగా జీవించాలని కోరుకున్న వధువు ఆశలన్నీ నిరాశలయ్యాయి. పెళ్లైన 11 నెలలు కూడా గడవకముందే ఆత్యహత్య చేసుకొని ప్రాణాలు తీసుకుంది. బెంగళూరులోని రామ్మూర్తి నగర రిచర్డ్‌ గార్డెన్‌లో ఈ నెల 10వ తేదీన జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

అభిషేక్‌, శ్వేతలకు 11 నెలల క్రితం వివాహం జరిగింది. శ్వేత ఐబీఎంలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తుండగా, అభిషేక్‌ టీఎసీఎస్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఇద్దరికీ లక్షల్లో జీతం. ఇక జీవితం సాఫీగా సాగుతోంది అనుకుంటున్న సమయంలో శ్వేతకు ఓ విషయం తెలిసిందే. అభిషేక్‌కు పెళ్లికి ముందే ఓ యువతితో సంబంధం ఉన్న విషయం తెలిసిందే. పెళ్లి తర్వాత కూడా ఆ సంబంధాన్ని కొనసాగించాడు. ఈ విషయమై దంపతుల మధ్య పలుసార్లు గొడవలు జరిగాయి.

ఈ గొడవలు కాస్త కుటుంబ సభ్యల వరకు చేరింది. దీంతో ఇద్దరినీ ఒప్పటించి రాజీ పంచాయతీ చేయించడంతో కొన్ని రోజుల నుంచి కలిసి జీవిస్తున్నారు. అయితే అభిషేక్‌లో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు. దీంతో తీవ్ర మానసిక క్షోభకు గురైన శ్వేత ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న శ్వేత కుటుంబ సభ్యులు అభిషేక్‌పై కేసు నమోదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Latest Articles