AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Coronavirus: తెలంగాణలో కరోనా విజృంభణ.. భారీగా పెరుగుతోన్న కేసులు.. 24 గంటల్లో ఏకంగా..

Coronavirus: తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. రోజురోజుకీ పెరుగుతోన్న కేసులు భయాందోళనలను గురి చేస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో కరోనా కేసులు 2వేల మార్కును దాటేశాయి...

Coronavirus: తెలంగాణలో కరోనా విజృంభణ.. భారీగా పెరుగుతోన్న కేసులు.. 24 గంటల్లో ఏకంగా..
Narender Vaitla
|

Updated on: Jan 08, 2022 | 8:26 PM

Share

Coronavirus: తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. రోజురోజుకీ పెరుగుతోన్న కేసులు భయాందోళనలను గురి చేస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో కరోనా కేసులు 2వేల మార్కును దాటేశాయి. ఇక తాజాగా గడిచిన 24 గంటల్లో ఏకంగా 2,606 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వరుసగా రెండు వేలకు పైగా కేసులు నమోదు కావడం ఇది రెండో రోజు. వైద్య, ఆరోగ్యశాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌లో వివరాల ప్రకారం 24 గంటల్లో 285 మంది బాధితులు కరోనా నుంచి కోలుకోగా ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.

తాజాగా నమోదైన కేసులతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ సంఖ్య 6,92,357కు పెరిగింది. ఇందులో 6,76,136 మంది బాధితులు కోలుకున్నారు. వైరస్‌ కారణంగా మొత్తం 4,041 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో మరణాల రేటు 0.58శాతంగా ఉందని, రికవరీ రేటు 97.65 శాతంగా అధికారులు తెలిపారు. ప్రస్తుతం 12,180 యాక్టివ్‌ కేసులున్నాయని, ఇవాళ ఒకే రోజు 73,156 టెస్టులు నిర్వహించినట్లు వివరించింది. కొత్త కేసుల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీలో 1,583 కేసులు రికార్డయ్యాయి. అలాగే రంగారెడ్డిలో 214 కేసులు, మేడ్చల్‌లో మరో 292 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది.

Also Read: Third Front: టార్గెట్‌ బీజేపీ.. థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు లక్ష్యం దిశగా సీఎం కేసీఆర్ అడుగులు

Hyderabad: న్యూ ఇయర్ వేడుకల కోసం డ్రగ్స్ కొనుగోలు చేసిన వారి చిట్టా రెడీ.. లిస్ట్‌లో రాజకీయ, సినీ ప్రముఖుల పిల్లలు

Fake Gold: అన్నం పెడుతున్న సంస్థకే కన్నం వేసి ఊచలు లెక్కపెడుతున్న ఉద్యోగి.. అసలేం జరిగిందంటే!