‘తల్లి బామ్మ సేఫ్ ! కవలలతో ఇక ఇంటికి..
గుంటూరులో లేటు వయసులో తలిదండ్రులైన వృధ్ద దంపతులు మంగాయమ్మ, రాజారావు ఇద్దరూ సేఫ్.. వారు తమ కవల పిల్లలతో ఇక ఇంటికి వెళ్ళవచ్చునని డాక్టర్లు ప్రకటించారు. సర్జరీ తరువాత ఇన్ఫెక్షన్ సోకకుండా మంగాయమ్మను ఐసీయులో ఉంచామని, అయితే ఇన్ఫెక్షన్ తగ్గడంతో ఆమెను డిస్చార్జ్ చేస్తున్నామని వారు తెలిపారు. అలాగే ఆమె భర్త రాజారావుకు గుండె పోటు వచ్చిందనడం సరికాదని, ఆయనకు ఊపిరి తిత్తుల రుగ్మత సోకిందని, అయితే ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని వారు […]
గుంటూరులో లేటు వయసులో తలిదండ్రులైన వృధ్ద దంపతులు మంగాయమ్మ, రాజారావు ఇద్దరూ సేఫ్.. వారు తమ కవల పిల్లలతో ఇక ఇంటికి వెళ్ళవచ్చునని డాక్టర్లు ప్రకటించారు. సర్జరీ తరువాత ఇన్ఫెక్షన్ సోకకుండా మంగాయమ్మను ఐసీయులో ఉంచామని, అయితే ఇన్ఫెక్షన్ తగ్గడంతో ఆమెను డిస్చార్జ్ చేస్తున్నామని వారు తెలిపారు. అలాగే ఆమె భర్త రాజారావుకు గుండె పోటు వచ్చిందనడం సరికాదని, ఆయనకు ఊపిరి తిత్తుల రుగ్మత సోకిందని, అయితే ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని వారు చెప్పారు. అటు-వీరి కవల పిల్లల బాగోగులను తామే చూసుకుంటామని వీరి బంధువు లక్ష్మి తెలిపింది. తమకు సుమారు 15 మంది బంధుగణం ఉందని, వృధ్ధులైన మంగాయమ్మ, రాజారావు తమ ట్విన్స్ బోసినవ్వులను చూస్తూ మురిసిపోతే చాలని ఆమె పేర్కొంది. సరొగెసీ ద్వారా కవలలకు జన్మనిచ్చి వీరు… ప్రపంచంలోనే ఈ వయస్సులో మొట్ట మొదటి పేరెంట్స్ గా పాపులర్ అయ్యారు.