AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భర్తను హతమార్చి చెరువులో పడేసిన భార్య.. నిందితులు ఎలా చిక్కారంటే..

వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది ఓ భార్య. వాళ్ళిద్దరి మధ్యలో అడ్డుగా ఉన్న భర్తను తొలగించుకోవాలనుకున్నారు. హత్య చేసి పెట్రోల్ బంక్ వద్ద తగలబెట్టారు. సగం కాలిన మృతదేహాన్ని సంచిలో వేసుకొని చెరువులో పడేసి చేతులు దులుపుకున్నారు.

భర్తను హతమార్చి చెరువులో పడేసిన భార్య.. నిందితులు ఎలా చిక్కారంటే..
Wife Kills Her Husband
Nalluri Naresh
| Edited By: |

Updated on: Feb 16, 2024 | 11:48 AM

Share

వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది ఓ భార్య. వాళ్ళిద్దరి మధ్యలో అడ్డుగా ఉన్న భర్తను తొలగించుకోవాలనుకున్నారు. హత్య చేసి పెట్రోల్ బంక్ వద్ద తగలబెట్టారు. సగం కాలిన మృతదేహాన్ని సంచిలో వేసుకొని చెరువులో పడేసి చేతులు దులుపుకున్నారు. ప్రియుడితో కలిసి సొంత భార్య తన భర్తను హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మండలం సున్నపుగుట్ట తండాకు చెందిన ఖాదర్ బాషా ఐచర్ వాహన డ్రైవర్. ఖాదర్ బాషాకు భార్య గులాబ్ జాన్, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఖాదర్ భాషా‎కు కదిరి పట్టణం నిజాంవలి కాలనీకి చెందిన బాబ్జాన్ అనే వ్యక్తితో స్నేహం కుదిరింది. తరచూ ఇంటికి వచ్చేవాడు. ఈ క్రమంలో ఖాదర్ బాషా భార్య గులాబ్ జాన్, బాబ్జాన్‎ల మధ్య పరిచయం పెరిగి వివాహేతర సంబంధానికి దారితీసింది. వీరిద్దరి సంబంధాన్ని తెలుసుకున్న ఖాదర్ బాషా భార్యను మందలించాడు. అయినా ఆమెలో మార్పు కనిపించలేదు.

దీంతో ఖాదర్ బాషా దంపతుల మధ్య తరచూ గొడవలు జరిగేవి. భర్త ఖాదర్ బాషాను ఎలాగైనా అడ్డుతొలగించుకోవాలని గులాబ్ జాన్, ప్రియుడు బాబ్జాన్ నిర్ణయించుకున్నారు. గత నెల 31న మద్యం మత్తులో ఉన్న ఖాదర్ బాషాను హత్యచేశారు. మృతదేహాన్ని ప్లాస్టిక్ సంచిలో ఉంచుకుని ద్విచక్ర వాహనంపై కదిరి మండలం కారెడ్డిపల్లి సమీపంలోని వాగు వద్దకు తీసుకెళ్లారు. అప్పటికే సిద్ధంగా ఉంచుకున్న పెట్రోలును ఖాదర్ బాషాపై పోసి తగలబెట్టారు. మృతదేహం పూర్తిగా కాలకపోవడంతో సగం కాలిన శవాన్ని ప్లాస్టిక్ సంచిలో వేసుకుని దగ్గరలోని చెరువులో పడేసి ఇంటికి చేరుకున్నారు. అనంతరం ఏమి ఎరగనట్టు తన భర్త ఖాదర్ బాషా డ్రైవింగ్‎కు వెళ్లి తిరిగి రాలేదంటూ భార్య గులాబ్ జాన్ కదిరి రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రస్తుత టెక్నాలజీ ఆధారంగా భర్త ఖాదర్ బాషా ఫోన్ లొకేషన్ ద్వారా కేసును ఛేదించారు. మృతుడి సెల్ ఫోన్ సున్నపుగుట్టతండా పరిసరాల్లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. సెల్ ఫోన్ లొకేషన్‎లో కదలికలు లేకపోవడంతో పోలీసులకు మృతుడి భార్యపై అనుమానం కలిగింది. ఆమెను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించడంతో అసలు విషయం వెలుగు చూసింది. మృతుడి భార్య గులాబ్ జాన్‎తోపాటు ఆమె ప్రియుడు బాబ్జాన్‎ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చెరువులో పారేసిన ఖాదర్ బాషా మృతదేహాన్ని పోలీసులు రికవరీ చేయడంతో మర్డర్ మిస్టరీ వీడింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?