AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భర్తను హతమార్చి చెరువులో పడేసిన భార్య.. నిందితులు ఎలా చిక్కారంటే..

వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది ఓ భార్య. వాళ్ళిద్దరి మధ్యలో అడ్డుగా ఉన్న భర్తను తొలగించుకోవాలనుకున్నారు. హత్య చేసి పెట్రోల్ బంక్ వద్ద తగలబెట్టారు. సగం కాలిన మృతదేహాన్ని సంచిలో వేసుకొని చెరువులో పడేసి చేతులు దులుపుకున్నారు.

భర్తను హతమార్చి చెరువులో పడేసిన భార్య.. నిందితులు ఎలా చిక్కారంటే..
Wife Kills Her Husband
Nalluri Naresh
| Edited By: |

Updated on: Feb 16, 2024 | 11:48 AM

Share

వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది ఓ భార్య. వాళ్ళిద్దరి మధ్యలో అడ్డుగా ఉన్న భర్తను తొలగించుకోవాలనుకున్నారు. హత్య చేసి పెట్రోల్ బంక్ వద్ద తగలబెట్టారు. సగం కాలిన మృతదేహాన్ని సంచిలో వేసుకొని చెరువులో పడేసి చేతులు దులుపుకున్నారు. ప్రియుడితో కలిసి సొంత భార్య తన భర్తను హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మండలం సున్నపుగుట్ట తండాకు చెందిన ఖాదర్ బాషా ఐచర్ వాహన డ్రైవర్. ఖాదర్ బాషాకు భార్య గులాబ్ జాన్, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఖాదర్ భాషా‎కు కదిరి పట్టణం నిజాంవలి కాలనీకి చెందిన బాబ్జాన్ అనే వ్యక్తితో స్నేహం కుదిరింది. తరచూ ఇంటికి వచ్చేవాడు. ఈ క్రమంలో ఖాదర్ బాషా భార్య గులాబ్ జాన్, బాబ్జాన్‎ల మధ్య పరిచయం పెరిగి వివాహేతర సంబంధానికి దారితీసింది. వీరిద్దరి సంబంధాన్ని తెలుసుకున్న ఖాదర్ బాషా భార్యను మందలించాడు. అయినా ఆమెలో మార్పు కనిపించలేదు.

దీంతో ఖాదర్ బాషా దంపతుల మధ్య తరచూ గొడవలు జరిగేవి. భర్త ఖాదర్ బాషాను ఎలాగైనా అడ్డుతొలగించుకోవాలని గులాబ్ జాన్, ప్రియుడు బాబ్జాన్ నిర్ణయించుకున్నారు. గత నెల 31న మద్యం మత్తులో ఉన్న ఖాదర్ బాషాను హత్యచేశారు. మృతదేహాన్ని ప్లాస్టిక్ సంచిలో ఉంచుకుని ద్విచక్ర వాహనంపై కదిరి మండలం కారెడ్డిపల్లి సమీపంలోని వాగు వద్దకు తీసుకెళ్లారు. అప్పటికే సిద్ధంగా ఉంచుకున్న పెట్రోలును ఖాదర్ బాషాపై పోసి తగలబెట్టారు. మృతదేహం పూర్తిగా కాలకపోవడంతో సగం కాలిన శవాన్ని ప్లాస్టిక్ సంచిలో వేసుకుని దగ్గరలోని చెరువులో పడేసి ఇంటికి చేరుకున్నారు. అనంతరం ఏమి ఎరగనట్టు తన భర్త ఖాదర్ బాషా డ్రైవింగ్‎కు వెళ్లి తిరిగి రాలేదంటూ భార్య గులాబ్ జాన్ కదిరి రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రస్తుత టెక్నాలజీ ఆధారంగా భర్త ఖాదర్ బాషా ఫోన్ లొకేషన్ ద్వారా కేసును ఛేదించారు. మృతుడి సెల్ ఫోన్ సున్నపుగుట్టతండా పరిసరాల్లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. సెల్ ఫోన్ లొకేషన్‎లో కదలికలు లేకపోవడంతో పోలీసులకు మృతుడి భార్యపై అనుమానం కలిగింది. ఆమెను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించడంతో అసలు విషయం వెలుగు చూసింది. మృతుడి భార్య గులాబ్ జాన్‎తోపాటు ఆమె ప్రియుడు బాబ్జాన్‎ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చెరువులో పారేసిన ఖాదర్ బాషా మృతదేహాన్ని పోలీసులు రికవరీ చేయడంతో మర్డర్ మిస్టరీ వీడింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
రూ.7,500 తగ్గిన బంగారం ధర.. తాజాగా హైదరాబాద్‌లో తులం ధర ఎంతంటే..!
రూ.7,500 తగ్గిన బంగారం ధర.. తాజాగా హైదరాబాద్‌లో తులం ధర ఎంతంటే..!
బ్యాంక్ లోన్ కావాలా? ఇకపై సిబిల్ ఒక్కటి సరిపోదు.. ఇవి మ్యాండేటరీ
బ్యాంక్ లోన్ కావాలా? ఇకపై సిబిల్ ఒక్కటి సరిపోదు.. ఇవి మ్యాండేటరీ
సోమవతి అమావాస్య రోజు ఈ తప్పులు చేయొద్దు.. లేదంటే లక్ష్మీదేవి..
సోమవతి అమావాస్య రోజు ఈ తప్పులు చేయొద్దు.. లేదంటే లక్ష్మీదేవి..
శని త్రయోదశి-మాసశివరాత్రి అరుదైన యోగం.. ఈ ఒక్క పూజ చేస్తే శని దోష
శని త్రయోదశి-మాసశివరాత్రి అరుదైన యోగం.. ఈ ఒక్క పూజ చేస్తే శని దోష
జూన్ 12 రాశిఫలాలు: ఆ రాశుల వారికి ఆర్థిక లాభాలు.. 12 రాశుల వారికి
జూన్ 12 రాశిఫలాలు: ఆ రాశుల వారికి ఆర్థిక లాభాలు.. 12 రాశుల వారికి
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్