టీవీ9 లో సీనియర్ కరస్పాండెంట్ గా పనిచేస్తున్నారు. 2009లో ఎలక్ట్రానిక్ మీడియాలో జర్నలిస్టుగా ప్రస్థానం ప్రారంభించారు. జర్నలిస్టుగా 15 సంవత్సరాల అనుభవం ఉంది. 2013 నుంచి టీవీ9 సంస్థలో హైదరాబాద్, విజయవాడలో క్రైమ్ రిపోర్టర్ గా పనిచేశారు. క్రైమ్ రిపోర్టర్ గా పనిచేసిన రోజుల్లో అనేక పరిశోధనాత్మక, స్టింగ్ ఆపరేషన్లు చేశారు. ప్రస్తుతం అనంతపురం జిల్లా సీనియర్ కరస్పాండెంట్ గా పని చేస్తున్నారు. అనంతపురం జిల్లాలో రాజకీయ, వర్తమాన, హ్యూమన్ ఇంట్రెస్టింగ్, ఇతర వార్తల సేకరణలో అందరికంటే ముందుండాలని తపన పడతారు.
ఎందుకు మహాలక్ష్మి ఇలా చేశావ్.. అప్పుల బాధతో కన్న పిల్లలకు విష గుళికలు ఇచ్చి..
శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మండలం ఎం. బీరేపల్లి గ్రామంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. అప్పుల ఒత్తిడిని తట్టుకోలేక ఓ మహిళ తన ఇద్దరు పిల్లలకు విషం కలిపిన ఆహారం తినిపించి, తాను కూడా ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆస్పత్రికి తరలిస్తుండగా తల్లి మహాలక్ష్మి, కుమారుడు రిషిత్ మృతి చెందగా, కుమార్తె శ్రీనిధి అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ విషాద ఘటన గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
- Nalluri Naresh
- Updated on: Jun 3, 2026
- 3:16 pm
వీళ్ళు కదా నిజమైన స్నేహితులు.. చనిపోయిన దోస్త్ జ్ఞాపకార్థం ఏం చేశారో తెలుసా?
స్నేహం అంటే కలిసి తిరగడం, సరదాగా గడపడమే కాదు.. ఒకరి కష్టసుఖాలలో తోడుండటం, ఒకరు దూరమైతే వారి జ్ఞాపకాలను సమాజానికి ఉపయోగపడేలా సజీవంగా ఉంచడం. సరిగ్గా ఇదే నిరూపించారు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణానికి చెందిన కొందరు యువకులు. రోడ్డు ప్రమాదంలో తమ ప్రియమైన స్నేహితుడిని కోల్పోయిన ఆ మిత్ర బృందం, ఆ బాధలోంచి సమాజానికి మేలు చేసే ఒక గొప్ప సంకల్పానికి శ్రీకారం చుట్టింది.
- Nalluri Naresh
- Updated on: May 29, 2026
- 11:45 am
బంగారం దొరుతుందని కొండల్లో తవ్వకాలు.. అక్కడికెళ్లి చూసిన పోలీసులకు షాకింగ్ సీన్..!
ఏపీలోని సత్యసాయి జిల్లా పులిగుండ్లపల్లి గ్రామ శివారులో ఉన్న అటవీ ప్రాంతంలో గుప్తనిధుల కోసం కొందరు రహస్యంగా తవ్వకాలు చేపట్టిన ఘటన కలకలం రేపింది. సమాచారం ప్రకారం, రెండు కార్లలో ఎనిమిది మంది వ్యక్తులు తవ్వకాలకు అవసరమైన పనిముట్లతో అక్కడికి చేరుకుని గుప్తనిధుల కోసం తవ్వకాలు ప్రారంభించారు. అడవి ప్రాంతంలో అనుమానాస్పద శబ్దాలు వినిపించడంతో అప్రమత్తమైన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
- Nalluri Naresh
- Updated on: May 28, 2026
- 4:03 pm
Andhra Pradesh: ప్రేమిస్తున్నానంటూ వేధింపులు.. యువకుడికి అరగుండు కొట్టించి ఊళ్లో ఊరేగింపు..
ప్రేమ పేరుతో వేధిస్తున్న యువకుడికి కుటుంబసభ్యులు దేహశుద్ది చేశారు. అరగుండు కొట్టించి ఊరేగించారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అనంతపురం జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. యువకుడి కుటుంబసభ్యులు పోలీసులు ఇంకా ఫిర్యాదు చేయలేదని తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే..
- Nalluri Naresh
- Updated on: May 20, 2026
- 6:08 pm
Andhra Pradesh: మోసగాళ్లకే మోసగాళ్లు.. వీళ్ల స్కెచ్ మామూలుగా లేదుగా.. వీడియో చూస్తే నోరెళ్లబెడతారు..
మోసగాడికి మోసగాడు.. వీడు వాడికి మొగుడు.. ఒక లక్ష ఇస్తే పది లక్షల నకిలీ కరెన్సీ ఇస్తామంటూ బురిడీ కొట్టించే ముఠాలు చాలానే ఉంటాయి. కానీ వీళ్లు ఏకంగా నకిలీ నోట్ల పేరుతో బొమ్మ నోట్లు అంటగట్టి అసలు నోట్లు కాజేశారు. నకిలీ కరెన్సీ కోసం ఆశగా వచ్చిన వారిని టాయ్ కరెన్సీతో ఆడుకున్న ఈ ముఠా గుట్టును లేపాక్షి పోలీసులు రట్టు చేశారు.
- Nalluri Naresh
- Updated on: May 18, 2026
- 10:25 pm
షాపులు, బేకరీల్లో తనిఖీలు చేసిన ఫుడ్ సేఫ్టీ అధికారులు.. చివరికి షాకింగ్ ట్విస్ట్!
Fake Food Safety Officials: అనంతపురం జిల్లా బెలుగుప్ప మండలంలో నకిలీ ఫుడ్ సేఫ్టీ అధికారులమంటూ ఐదుగురు మహిళలు దుకాణాలు, బేకరీల్లో తనిఖీలు చేసి ఫైన్లు వేసి డబ్బులు వసూలు చేశారు. మెడలో ఐడీ కార్డులు ధరించి “ఫుడ్ సేఫ్టీ సర్వీసెస్ గుంటూరు” పేరుతో రసీదులు కూడా ఇచ్చినట్లు సమాచారం. పలువురు షాపుదారుల నుంచి డబ్బులు తీసుకుని మహిళలు పరారయ్యారు.
- Nalluri Naresh
- Updated on: May 17, 2026
- 1:34 pm
Andhra News: పెళ్లి గురించి పేరెంట్స్ మధ్య చర్చ.. అది విని కూతురి చేసిన పనికి అంతా షాక్
ఈ మధ్య కాలంలో చిన్న చిన్న విషయాలకే యువత ప్రాణాలు తీసుకుంటున్నారు. తాజగా ఇలాంటి ఘటనే అనంతపురం జిల్లాలో వెలుగు చూసింది. పెళ్లి చేస్తారన్న భయంతో ఇంటర్ చదువుతున్న 17 ఏళ్ల విద్యార్థిని అర్థాంతరంగా తన జీవితాన్ని ముగించుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. చేతికొచ్చిన కూతురి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
- Nalluri Naresh
- Updated on: May 10, 2026
- 12:36 pm
Andhra: ఏంట్రా ఇలా ఉన్నారు.. సిగరెట్ అప్పుగా ఇవ్వలేదని ఎంతకు తెగించాడంటే..
శ్రీ సత్యసాయి జిల్లా ముదిగుబ్బలో దారుణం చోటుచేసుకుంది. తనకు సిగరెట్ అప్పుగా ఇవ్వలేదని ఓ వ్యక్తి ఏకంగా కిరాణా షాపు యజమానిపై కత్తితో దాడి చేశాడు. దీంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు.. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చిన్న విషయాలకే పెరిగిపోతున్న హింసకు ఈ ఘటన నిదర్శనం..
- Nalluri Naresh
- Updated on: May 7, 2026
- 3:27 pm
పదేళ్ల బాలికకు పెళ్లి! బాల్య వివాహం అనుకుంటే పొరపాటే.. అది దైవ సంకల్పం!! వరుడు ఎవరంటే..
పదేళ్ల బాలికకు పెళ్లి.. మేళ తాళాలు... భాజా భజంత్రీలు... వేద మంత్రోచ్ఛరణాల మధ్య... వేలాది మంది సమక్షంలో జరిగిన వివాహ వేడుక... అదేంటి 10 ఏళ్ల బాలికకు బాల్య వివాహం చేస్తుంటే ఎవరూ అడ్డుకోలేదా అనుకుంటున్నారా? విషయం తెలిస్తే మీరు చేతులెత్తి మొక్కుతారు. అదేంటని ఆశ్చర్యంతో నోరెళ్ల బెడుతున్నారు కదా..! పూర్తి వివరాల్లోకి వెళితే..
- Nalluri Naresh
- Updated on: May 6, 2026
- 8:42 am
Andhra: ఆటో కావాలా మేడం అంటూ ఆటో ఎక్కించుకుని… ఆ మహిళను
హిందూపురంలో సర్వీస్ ఆటో పేరుతో ప్రయాణికుల్లా నటించిన దొంగల ముఠా, మహిళపై పట్టపగలు దోపిడీకి పాల్పడింది. ఆటోలో ముందే ఉన్న వ్యక్తులే డ్రైవర్కు సహకరించి ఐదు తులాల బంగారం దోచుకుని బాధితురాలిని కిందకు తోసి పరారయ్యారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
- Nalluri Naresh
- Updated on: May 1, 2026
- 8:10 pm
Rayalaseema: కరువు నేలలో జలధార.. బోరు బావి నుంచి తక్కువ లోతులోనే ఎగిసిపడ్డ గంగమ్మ..
కరువు కాటుకు గురైన ఉమ్మడి అనంతపురం జిల్లాలో అరుదైన దృశ్యం కనిపించింది. శ్రీ సత్యసాయి జిల్లా కొర్రెవు గ్రామంలో రైతు మాలింగప్ప పొలంలో బోరు వేస్తుండగా కేవలం 470 అడుగుల లోతులోనే భూగర్భ జలాలు ఉబికి వచ్చి 15 అడుగుల ఎత్తుకు ఎగసిపడాయి. ఎండిన నేలల్లో ఇలాంటి జలసిరి కనిపించడం స్థానిక రైతుల్లో కొత్త ఆశలను నింపింది.
- Nalluri Naresh
- Updated on: Apr 18, 2026
- 9:41 am
Andhra: అలా అయితేనే నిన్ను ఇంట్లోకి రానిస్తాను.. భర్త పెట్టిన షరతుకు భార్యకు దిక్కుతోచని స్థితి
శుభకార్యానికి వెళ్లిన మహిళ… తిరిగొచ్చేసరికి జీవితం రోడ్డుపై పడింది. 15 తులాల బంగారం మిస్సయిందన్న కారణంతో భర్త ఇంట్లోకి అనుమతించకపోవడం… చేతిలో మూడు నెలల శిశువుతో ఇంటి ముందు కూర్చున్న కరిష్మా గాథ హృదయాలను కలిచివేస్తోంది. పూర్తి వివరాలు కథనం లోపల ...
- Nalluri Naresh
- Updated on: Apr 16, 2026
- 8:56 pm