టీవీ9 లో సీనియర్ కరస్పాండెంట్ గా పనిచేస్తున్నారు. 2009లో ఎలక్ట్రానిక్ మీడియాలో జర్నలిస్టుగా ప్రస్థానం ప్రారంభించారు. జర్నలిస్టుగా 15 సంవత్సరాల అనుభవం ఉంది. 2013 నుంచి టీవీ9 సంస్థలో హైదరాబాద్, విజయవాడలో క్రైమ్ రిపోర్టర్ గా పనిచేశారు. క్రైమ్ రిపోర్టర్ గా పనిచేసిన రోజుల్లో అనేక పరిశోధనాత్మక, స్టింగ్ ఆపరేషన్లు చేశారు. ప్రస్తుతం అనంతపురం జిల్లా సీనియర్ కరస్పాండెంట్ గా పని చేస్తున్నారు. అనంతపురం జిల్లాలో రాజకీయ, వర్తమాన, హ్యూమన్ ఇంట్రెస్టింగ్, ఇతర వార్తల సేకరణలో అందరికంటే ముందుండాలని తపన పడతారు.
పుణ్యదంపతులు.. మరణంలోనూ విడిపోని జంట.. కడవరకు కలిసే’పోయారు’!
శ్రీ సత్యసాయి జిల్లా రొళ్ల మండలం రత్నగిరి గ్రామంలో నెలకొన్న విషాద ఘటన అందరినీ ఆశ్చర్యపోయేలా చేసింది. జీవితాంతం ఒకరికొకరు తోడునీడగా నిలిచిన వృద్ధ దంపతులు 95 ఏళ్ల మల్లప్ప, 88 ఏళ్ల లింగమ్మ మరణంలోనూ విడిపోలేదు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న భర్త మల్లప్ప ముందుగా కన్నుమూయగా, ఆ వియోగాన్ని తట్టుకోలేక భార్య లింగమ్మ కేవలం ఐదు నిమిషాల వ్యవధిలోనే గుండె ఆగి ప్రాణాలు విడిచారు. తొమ్మిది పదుల వయస్సులోనూ ఒకే రోజు, ఒకే సమయంలో తనువు చాలించిన ఈ ఆదర్శ జంటను చూసి స్థానికులు కన్నీరు మున్నీరవుతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
- Nalluri Naresh
- Updated on: Jul 20, 2026
- 8:40 pm
Video: పీఠాధిపతికి కన్నీటి వీడ్కోలు పలికిన ఏనుగు.. అనంతపురంలో ఆసక్తికర ఘటన
అనంతపురం జిల్లా ఉరవకొండ గవి మఠంలో పీఠాధిపతి శివైక్యం చెందగా, ఆస్థాన ఏనుగు గజలక్ష్మి తన దుఃఖాన్ని విలక్షణంగా వ్యక్తం చేసింది. స్వామి అంతిమ యాత్రలో పూల మాల సమర్పించి, తల ఆడిస్తూ, కన్నీరు పెడుతూ, తొండం నేలకు ఆనించి సంతాపం తెలిపింది. 20 సంవత్సరాలుగా పీఠాధిపతితో గజలక్ష్మికున్న అనుబంధాన్ని ఈ హృదయ విదారక దృశ్యం కళ్ళకు కట్టింది.
- Nalluri Naresh
- Updated on: Jul 19, 2026
- 6:32 pm
Andhra Pradesh: ఇదేం పద్దతిరా నాయన.. వర్షం కోసం గాడిదలకు పెళ్లి.. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడంటే..?
నైరుతి రుతుపవనాలు వచ్చినా తెలుగు రాష్ట్రాల వాన చినుకు జాడ కనిపించడం లేదు. వర్షాకాలం మొదలై చాలా రోజులైనా వర్షాలు కనుకరించడం లేదు. దీంతో కరువు పరిస్థితులు దాపురించాయి. రైతులు వర్షాల్లేక అల్లాడిపోతున్నాయి. వాన చినుకు కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో..
- Nalluri Naresh
- Updated on: Jul 14, 2026
- 10:34 am
Andhra: హీరోగా సగం సినిమా కూడా కంప్లీట్.. ఆ ఒక్క ఘటనతో చివరకు ఇలా..
హీరో కావాలనే కలతో సినిమాను ప్రారంభించిన ఓ యువకుడు... చివరకు హైటెక్ దొంగగా మారి మూడు రాష్ట్రాల పోలీసులకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్గా మారాడు. భారీ షాపింగ్ మాల్స్ను టార్గెట్ చేస్తూ పదేళ్ల పాటు పోలీసులను ముప్పుతిప్పలు పెట్టిన ఆనంద్... అనంతపురం చోరీ కేసులో చివరకు పోలీసులకు చిక్కాడు.
- Nalluri Naresh
- Updated on: Jul 11, 2026
- 11:35 am
వర్షాల కోసం వింత సాంప్రదాయం.. పెళ్లి కాని యువకులతో 108 బిందెలతో జలాభిషేకం!
వర్షాలు కురవాలని కోరుతూ అనంతపురం జిల్లా ఉరవకొండలోని జమ్మి అంకాలమ్మ దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తరతరాలుగా వస్తున్న సంప్రదాయం ప్రకారం ఏడుగురు పెళ్లి కాని యువకులు 108 బిందెలతో నీటిని మోసుకొచ్చి శమీ వృక్షం, నాగుల కట్టకు జలాభిషేకం చేశారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి 108 కొబ్బరికాయలు కొట్టి, 108 నిమ్మకాయలతో మాలను సమర్పించారు. పూజల తర్వాత జొన్నలపై ఉంచిన చిన్న రాతి గుండుపై యువకుడు కూర్చొని గిరగిరా తిరిగే అరుదైన ఆచారాన్ని నిర్వహించారు..
- Nalluri Naresh
- Updated on: Jul 10, 2026
- 8:30 pm
ఆరు తరాలు.. 83 మంది కుటుంబ సభ్యులతో ఒకే ఇల్లు.. ఒకే వంట..
కలిసి ఉంటే కలదు సుఖం.. ఈ సామెత చాలాసార్లు వినే ఉంటాం కానీ చూసి ఉండరు. ఉమ్మడి కుటుంబాలు అంతరించిపోయి వేరు కాపురాలు పెట్టి, పట్టుమని ఐదుగురు కుటుంబ సభ్యులు కూడా ఉండని ఈ రోజుల్లో ఆరు తరాలు మారినా చెక్కు చెదరకుండా అందరూ కలిసే ఓ ఉమ్మడి కుటుంబంగా ఉంటున్నారు. అది కాదు 20 కాదు ఏకంగా 83 మంది కుటుంబ సభ్యులు ఉమ్మడి కుటుంబం గా ఉంటూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది ఈ జంబో జాయింట్ ఫ్యామిలీ అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం కుర్లపల్లి గ్రామంలో హనుమంత రాయుడు, ముత్యాలప్పల కుటుంబం.. ఉమ్మడి కుటుంబాలకి ఆదర్శంగా నిలుస్తుంది..
- Nalluri Naresh
- Updated on: Jul 6, 2026
- 7:48 pm
అక్కడ దోశ కేవలం 2 రూపాయలే..! ప్రతి రోజూ క్యూ కడుతున్న జనం
అనంతపురంలోని తాడిపత్రికి చెందిన సావిత్రమ్మ గత 35 ఏళ్లుగా రూ.1-2కే రుచికరమైన దోశలు విక్రయిస్తూ పేదల ఆకలి తీరుస్తున్నారు. పావలాకు మొదలుపెట్టి, పెరిగిన ధరలను పట్టించుకోకుండా, ఇప్పటికీ తక్కువ ధరకే దోశలు అందిస్తూ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. లాభాపేక్ష లేకుండా సేవ చేయాలనే ఆమె తత్త్వం ఎందరికో స్ఫూర్తినిస్తోంది.
- Nalluri Naresh
- Updated on: Jul 4, 2026
- 5:34 pm
Andhra: దేవుడి హుండీలో రూ.20 నోటుపై వినతి.. ఏం రాశారో తెలిస్తే అవాక్కే..
అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం పంపనూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో హుండీ లెక్కింపు సందర్భంగా ఓ రూ.20 నోటుపై రాసిన వినతి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. "మా అత్త వేధింపులు తట్టుకోలేకపోతున్నాను.. ఆమె త్వరగా చనిపోయేలా చూడు" అంటూ దేవుడిని కోరుతూ రాసిన సందేశం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ ఘటనపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తుండగా, కుటుంబ విభేదాలపై చర్చకు దారి తీసింది.
- Nalluri Naresh
- Updated on: Jun 19, 2026
- 12:25 pm
Andhra Pradesh: ఫేస్బుక్లో చాటింగ్.. అడిగినంత డబ్బు ఇచ్చాడు.. తీరా కలవడానికి వెళ్తే ఊహించని సీన్..
సోషల్ మీడియాలో వచ్చే తెలియని అమ్మాయిల మెసేజ్లకు రిప్లై ఇస్తున్నారా? అయితే ఈ షాకింగ్ స్టోరీ మీ కోసమే. ఫేస్బుక్లో అమ్మాయి పేరుతో వచ్చిన రిక్వెస్ట్ను నమ్మి, చాటింగ్ల వ్యామోహంలో పడి ఓ పోలీస్ కానిస్టేబుల్ ఏకంగా లక్షలు సమర్పించుకున్నాడు. చివరికి కలవడానికి వెళ్తే అక్కడ ఎదురైన వారిని చూసి అతని మైండ్ బ్లాంక్ అయ్యింది.
- Nalluri Naresh
- Updated on: Jun 17, 2026
- 7:12 pm
Watch: తమ్ముడు సీన్ రిపీట్.. 100 కార్లు, 100 బైకులతో అన్నదమ్ముల ఒళ్ళు గగ్గురు పొడిచే సాహసాలు!
సినిమాల్లో హీరోలు చేసే సాహస విన్యాసాలను చూసి మనం రోమాంచితం అవుతాం. తమ్ముడు సినిమాలో పవన్ కళ్యాణ్ చేతులపై నుండి కార్లు వెళ్లే సీన్ చూసి థియేటర్లలో అందరూ నోరెళ్లబెట్టారు. సరిగ్గా అలాంటి కళ్ళు చెదిరే, ఒళ్ళు గగ్గురు పొడిచే నిజజీవిత సాహస ఘట్టాలు అనంతపురం జిల్లాలో ఆవిష్కృతమయ్యాయి. తాడిపత్రి పట్టణానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములు తమ అసాధారణ ప్రతిభతో, గుండె నిబ్బరంతో చూసే ప్రతి ఒక్కరినీ అబ్బురపరిచారు.
- Nalluri Naresh
- Updated on: Jun 14, 2026
- 6:12 pm
Andhra News: బియ్యం కావాలని షాప్కు వచ్చాడు.. రూ.10వేలు UPI చేసి వెళ్లిపోయాడు.. సీన్కట్ చేస్తే..
డిజిటల్ చెల్లింపుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు ఎన్ని సార్లు హెచ్చరించినా.. ప్రజలు మళ్లీ మోసపోతూనే ఉన్నారు.. చేసిన పేమెంట్ పూర్తిగా అయ్యిందా లేదా అని నిర్ధారించుకోకుండా నష్టపోతున్నారు. ముఖ్యంగా UPI చెల్లింపుల ద్వారా జరిగే ట్రాన్సాక్షన్స్తో చాలా మంది వ్యాపారులు డబ్బులు కోల్పోతున్నారు. తాజాగా మరోసారి ఇలాంటి ఓ ఘటన వెలుగు చూసింది. యూపీఐ చేశానంటూ.. ఓ కేటుగాడు వ్యాపారికి రూ.10 వేల కుచ్చుటోపి పెట్టాడు.
- Nalluri Naresh
- Updated on: Jun 14, 2026
- 11:01 am
పెళ్లి పత్రికలో సైబర్ మోసాల హెచ్చరికలు.. అనంతపురం తండ్రి వినూత్న ఆలోచనకు ప్రశంసల వెల్లువ!
పెళ్లి పత్రిక అంటే కేవలం ఆహ్వానం మాత్రమే అనుకునే వారికి అనంతపురం జిల్లాకు చెందిన నాగళ్లు రాజా కొత్త సందేశం ఇచ్చారు. తన కుమారుడి వివాహ పత్రికలో డిజిటల్ అరెస్ట్, ఫేక్ లోన్ యాప్స్, పార్ట్టైమ్ జాబ్ ఫ్రాడ్స్ వంటి సైబర్ మోసాలపై అవగాహన సందేశాలను ముద్రించి వేలాది మందికి చేరవేశారు. ఈ వినూత్న ప్రయత్నానికి పోలీసులతో పాటు ప్రజల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి.
- Nalluri Naresh
- Updated on: Jun 13, 2026
- 7:27 pm