టీవీ9 లో సీనియర్ కరస్పాండెంట్ గా పనిచేస్తున్నారు. 2009లో ఎలక్ట్రానిక్ మీడియాలో జర్నలిస్టుగా ప్రస్థానం ప్రారంభించారు. జర్నలిస్టుగా 15 సంవత్సరాల అనుభవం ఉంది. 2013 నుంచి టీవీ9 సంస్థలో హైదరాబాద్, విజయవాడలో క్రైమ్ రిపోర్టర్ గా పనిచేశారు. క్రైమ్ రిపోర్టర్ గా పనిచేసిన రోజుల్లో అనేక పరిశోధనాత్మక, స్టింగ్ ఆపరేషన్లు చేశారు. ప్రస్తుతం అనంతపురం జిల్లా సీనియర్ కరస్పాండెంట్ గా పని చేస్తున్నారు. అనంతపురం జిల్లాలో రాజకీయ, వర్తమాన, హ్యూమన్ ఇంట్రెస్టింగ్, ఇతర వార్తల సేకరణలో అందరికంటే ముందుండాలని తపన పడతారు.
Andhra Pradesh: మోసగాళ్లకే మోసగాళ్లు.. వీళ్ల స్కెచ్ మామూలుగా లేదుగా.. వీడియో చూస్తే నోరెళ్లబెడతారు..
మోసగాడికి మోసగాడు.. వీడు వాడికి మొగుడు.. ఒక లక్ష ఇస్తే పది లక్షల నకిలీ కరెన్సీ ఇస్తామంటూ బురిడీ కొట్టించే ముఠాలు చాలానే ఉంటాయి. కానీ వీళ్లు ఏకంగా నకిలీ నోట్ల పేరుతో బొమ్మ నోట్లు అంటగట్టి అసలు నోట్లు కాజేశారు. నకిలీ కరెన్సీ కోసం ఆశగా వచ్చిన వారిని టాయ్ కరెన్సీతో ఆడుకున్న ఈ ముఠా గుట్టును లేపాక్షి పోలీసులు రట్టు చేశారు.
- Nalluri Naresh
- Updated on: May 18, 2026
- 10:25 pm
షాపులు, బేకరీల్లో తనిఖీలు చేసిన ఫుడ్ సేఫ్టీ అధికారులు.. చివరికి షాకింగ్ ట్విస్ట్!
Fake Food Safety Officials: అనంతపురం జిల్లా బెలుగుప్ప మండలంలో నకిలీ ఫుడ్ సేఫ్టీ అధికారులమంటూ ఐదుగురు మహిళలు దుకాణాలు, బేకరీల్లో తనిఖీలు చేసి ఫైన్లు వేసి డబ్బులు వసూలు చేశారు. మెడలో ఐడీ కార్డులు ధరించి “ఫుడ్ సేఫ్టీ సర్వీసెస్ గుంటూరు” పేరుతో రసీదులు కూడా ఇచ్చినట్లు సమాచారం. పలువురు షాపుదారుల నుంచి డబ్బులు తీసుకుని మహిళలు పరారయ్యారు.
- Nalluri Naresh
- Updated on: May 17, 2026
- 1:34 pm
Andhra News: పెళ్లి గురించి పేరెంట్స్ మధ్య చర్చ.. అది విని కూతురి చేసిన పనికి అంతా షాక్
ఈ మధ్య కాలంలో చిన్న చిన్న విషయాలకే యువత ప్రాణాలు తీసుకుంటున్నారు. తాజగా ఇలాంటి ఘటనే అనంతపురం జిల్లాలో వెలుగు చూసింది. పెళ్లి చేస్తారన్న భయంతో ఇంటర్ చదువుతున్న 17 ఏళ్ల విద్యార్థిని అర్థాంతరంగా తన జీవితాన్ని ముగించుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. చేతికొచ్చిన కూతురి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
- Nalluri Naresh
- Updated on: May 10, 2026
- 12:36 pm
Andhra: ఏంట్రా ఇలా ఉన్నారు.. సిగరెట్ అప్పుగా ఇవ్వలేదని ఎంతకు తెగించాడంటే..
శ్రీ సత్యసాయి జిల్లా ముదిగుబ్బలో దారుణం చోటుచేసుకుంది. తనకు సిగరెట్ అప్పుగా ఇవ్వలేదని ఓ వ్యక్తి ఏకంగా కిరాణా షాపు యజమానిపై కత్తితో దాడి చేశాడు. దీంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు.. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చిన్న విషయాలకే పెరిగిపోతున్న హింసకు ఈ ఘటన నిదర్శనం..
- Nalluri Naresh
- Updated on: May 7, 2026
- 3:27 pm
పదేళ్ల బాలికకు పెళ్లి! బాల్య వివాహం అనుకుంటే పొరపాటే.. అది దైవ సంకల్పం!! వరుడు ఎవరంటే..
పదేళ్ల బాలికకు పెళ్లి.. మేళ తాళాలు... భాజా భజంత్రీలు... వేద మంత్రోచ్ఛరణాల మధ్య... వేలాది మంది సమక్షంలో జరిగిన వివాహ వేడుక... అదేంటి 10 ఏళ్ల బాలికకు బాల్య వివాహం చేస్తుంటే ఎవరూ అడ్డుకోలేదా అనుకుంటున్నారా? విషయం తెలిస్తే మీరు చేతులెత్తి మొక్కుతారు. అదేంటని ఆశ్చర్యంతో నోరెళ్ల బెడుతున్నారు కదా..! పూర్తి వివరాల్లోకి వెళితే..
- Nalluri Naresh
- Updated on: May 6, 2026
- 8:42 am
Andhra: ఆటో కావాలా మేడం అంటూ ఆటో ఎక్కించుకుని… ఆ మహిళను
హిందూపురంలో సర్వీస్ ఆటో పేరుతో ప్రయాణికుల్లా నటించిన దొంగల ముఠా, మహిళపై పట్టపగలు దోపిడీకి పాల్పడింది. ఆటోలో ముందే ఉన్న వ్యక్తులే డ్రైవర్కు సహకరించి ఐదు తులాల బంగారం దోచుకుని బాధితురాలిని కిందకు తోసి పరారయ్యారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
- Nalluri Naresh
- Updated on: May 1, 2026
- 8:10 pm
Rayalaseema: కరువు నేలలో జలధార.. బోరు బావి నుంచి తక్కువ లోతులోనే ఎగిసిపడ్డ గంగమ్మ..
కరువు కాటుకు గురైన ఉమ్మడి అనంతపురం జిల్లాలో అరుదైన దృశ్యం కనిపించింది. శ్రీ సత్యసాయి జిల్లా కొర్రెవు గ్రామంలో రైతు మాలింగప్ప పొలంలో బోరు వేస్తుండగా కేవలం 470 అడుగుల లోతులోనే భూగర్భ జలాలు ఉబికి వచ్చి 15 అడుగుల ఎత్తుకు ఎగసిపడాయి. ఎండిన నేలల్లో ఇలాంటి జలసిరి కనిపించడం స్థానిక రైతుల్లో కొత్త ఆశలను నింపింది.
- Nalluri Naresh
- Updated on: Apr 18, 2026
- 9:41 am
Andhra: అలా అయితేనే నిన్ను ఇంట్లోకి రానిస్తాను.. భర్త పెట్టిన షరతుకు భార్యకు దిక్కుతోచని స్థితి
శుభకార్యానికి వెళ్లిన మహిళ… తిరిగొచ్చేసరికి జీవితం రోడ్డుపై పడింది. 15 తులాల బంగారం మిస్సయిందన్న కారణంతో భర్త ఇంట్లోకి అనుమతించకపోవడం… చేతిలో మూడు నెలల శిశువుతో ఇంటి ముందు కూర్చున్న కరిష్మా గాథ హృదయాలను కలిచివేస్తోంది. పూర్తి వివరాలు కథనం లోపల ...
- Nalluri Naresh
- Updated on: Apr 16, 2026
- 8:56 pm
Andhra: ఆటో కాదన్న.. అది టీవీఎస్.. ఎక్సెల్ బండిపై ఆరుగురిని ఎలా కూర్చొబెట్టాడో చూడండి..
బైక్, టీవీఎస్ లాంటి ద్విచక్రవాహనలపై ఇద్దరు మాత్రమే ప్రయాణించాలి.. ఇంకా.. వాహనం నడిపే వారు హెల్మెట్ కూడా ధరించాలి.. అయితే.. ఓ వాహనదారుడు.. నిబంధనలు గాలికి వదిలేసి.. టీవీఎస్ ఎక్సెల్ పై ఆరుగురిని ఎక్కించుకుని రయ్ రయ్ అంటూ గాల్లోకి తేలిపోతున్నాడు.
- Nalluri Naresh
- Updated on: Apr 14, 2026
- 6:30 pm
Andhra: ఓరి.. ఓరి.. రాత్రి షాపులో ఎవరా జీవి.. అసలు కథ ఏందంటే..?
అనంతపురం జిల్లా పామిడి పట్టణంలో ఓ దొంగ వెరైటీగా చోరీకి పాల్పడ్డాడు. సింహం మాస్క్ ధరించి కిరాణా దుకాణంలోకి చొరబడి చిల్లర నాణేలు, సరుకులు దొంగిలించేందుకు ప్రయత్నించాడు. సీసీ కెమెరా గుర్తించిన దొంగ.. దృశ్యాలు రికార్డ్ కాకుండా దుప్పటి కప్పే ప్రయత్నం చేయడం గమనార్హం.
- Nalluri Naresh
- Updated on: Apr 9, 2026
- 10:58 am
పెళ్లైన 11 నెలలకే చెల్లెలు భర్తను చంపిన అన్న.. అసలు విషయం తెలిసి అంతా షాక్!
చెల్లెలు కాపురం నిలబడటం కోసం అన్న ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటారు. ఆఖరికి చంపడానికైనా వెనుకాడని అన్నలు ఉన్నారు. చెల్లెలు కాపురం నిలబడటం కోసం ఏం చేసిన పర్వాలేదు కానీ, ఏకంగా చెల్లెలు భర్తనే చంపేస్తే..! ఇంకేం కాపురం నిలబడుతుంది. చెల్లెలిని నిత్యం అనుమానిస్తూ.. వేధింపులకు గురిచేస్తున్నాడని సొంత బావనే కడతేర్చాడు ఓ వ్యక్తి. ఈ విషాద ఘటన శ్రీసత్యసాయి జిల్లాలో వెలుగు చూసింది.
- Nalluri Naresh
- Updated on: Apr 7, 2026
- 9:40 pm
Andhra: ఆయనో తహసీల్దార్.. అన్ని తెలిసినోడే వాడి బుట్టలో పడ్డాడు.. కట్ చేస్తే, ఏపీలోనే సెన్సెషనల్..
ఆయనో తాహసీల్దార్.. అతనికి అన్నీ తెలుసు.. కానీ, అతన్నే.. ఏసీబీ అధికారి అంటూ ఓ వ్యక్తి బెదిరించి ఏకంగా.. లక్షలు లక్షలు వసూలు చేశాడు ఓ కేటుగాడు.. తాను ఏసీబీ అధికారినని.. తన అవినీతి చిట్టా అంతా నా దగ్గర ఉందంటూ.. తహసీల్దార్ ను పరిచయం చేసుకున్నాడు..
- Nalluri Naresh
- Updated on: Apr 6, 2026
- 10:18 am