AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nalluri Naresh

Nalluri Naresh

Senior Correspondent (Anantapur District) - TV9 Telugu

naresh.nalluri@tv9.com

టీవీ9 లో సీనియర్ కరస్పాండెంట్ గా పనిచేస్తున్నారు. 2009లో ఎలక్ట్రానిక్ మీడియాలో జర్నలిస్టుగా ప్రస్థానం ప్రారంభించారు. జర్నలిస్టుగా 15 సంవత్సరాల అనుభవం ఉంది. 2013 నుంచి టీవీ9 సంస్థలో హైదరాబాద్, విజయవాడలో క్రైమ్ రిపోర్టర్ గా పనిచేశారు. క్రైమ్ రిపోర్టర్ గా పనిచేసిన రోజుల్లో అనేక పరిశోధనాత్మక, స్టింగ్ ఆపరేషన్లు చేశారు. ప్రస్తుతం అనంతపురం జిల్లా సీనియర్ కరస్పాండెంట్ గా పని చేస్తున్నారు. అనంతపురం జిల్లాలో రాజకీయ, వర్తమాన, హ్యూమన్ ఇంట్రెస్టింగ్, ఇతర వార్తల సేకరణలో అందరికంటే ముందుండాలని తపన పడతారు.

Read More
Anantapur: పొద్దున్న ముగ్గురిపై దాడి చేసి గాయపరిచింది.. సాయంత్రం అయ్యేసరికి ఇలా..

Anantapur: పొద్దున్న ముగ్గురిపై దాడి చేసి గాయపరిచింది.. సాయంత్రం అయ్యేసరికి ఇలా..

అనంతపురం జిల్లా నార్పల మండలం బొందలవాడలో చిరుత దాడి అంటూ కలకలం రేగింది. ముగ్గురిపై దాడి జరగడంతో గ్రామంలో భయాందోళనలు నెలకొన్నాయి. అయితే అటవీశాఖ దర్యాప్తులో దాడులు చేసినది చిరుత కాదని, అడవి పిల్లి అని నిర్ధారణకు వచ్చింది. గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు.

Andhra Pradesh: హెల్మెట్ లేకుండా బైక్‌పై వచ్చిన యువకుడు.. సడెన్‌గా మంత్రి ఆపి ఏం చేశారో తెలుసా..? వీడియో

Andhra Pradesh: హెల్మెట్ లేకుండా బైక్‌పై వచ్చిన యువకుడు.. సడెన్‌గా మంత్రి ఆపి ఏం చేశారో తెలుసా..? వీడియో

ఏపీలో రోడ్డు భద్రత వారోత్సవాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. హెల్మెట్ లేకుండా కనిపించిన ఓ యువకుడికి.. మంత్రి క్లాస్ పీకారు.. కాస్ట్లీ బైక్ సరే.. హెల్మెట్ ఎక్కడ అంటూ మంత్రి సవిత.. ఆ యువకుడిని ప్రశ్నించారు.

Andhra News: ఎంత కష్టమొచ్చిందో పాపం.. పుట్టిన రెండ్రోజులకే పాపను దూరం చేసుకున్న తల్లి.. అంతలోనే

Andhra News: ఎంత కష్టమొచ్చిందో పాపం.. పుట్టిన రెండ్రోజులకే పాపను దూరం చేసుకున్న తల్లి.. అంతలోనే

ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో బిడ్డను పోశించే శక్తిలేక.. పుట్టిన రెండ్రోజులకే పాపను మరొకరికి అప్పగించారు తల్లిదండ్రులు. అప్పటికే ముగ్గురు సంతానం ఉండగా నాలుగో సంతానం కూడా ఆడబిడ్డ అవడంతో పొత్తిల్లోనే బిడ్డను దూరం చేసుకున్నారు. పసికందును వేరొకరికి అప్పగించి హాస్పిటల్లో చెప్పా పెట్టకుండా వెళ్లిపోవడంతో హాస్పిటల్స్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు బిడ్డను స్వాధీనం చేసుకొని మళ్లీ తల్లిదండ్రుల వద్దకు చేర్చారు.

Andhra: అర్థరాత్రి కానిస్టేబుల్ భార్యకు ఆ వీడియోలతో మెసేజ్.. సీన్ కట్ చేస్తే..

Andhra: అర్థరాత్రి కానిస్టేబుల్ భార్యకు ఆ వీడియోలతో మెసేజ్.. సీన్ కట్ చేస్తే..

గురుడికి సోషల్ మీడియాలో ఓ మహిళ పరిచయమైంది.. ఇంకెందుకు ఆలస్యం వెంటనే.. ఆమెను బుట్టలో వేసుకోవాలనుకున్నాడు.. ఆ మహిళ ఎవరు..? ఏంటి అనేది తెలియక.. అర్ధరాత్రి అశ్లీల ఫోటోలు, అశ్లీల వీడియోలు, అసభ్యకర మెసేజ్‌లు పెట్టాడు.. కట్ చేస్తే, జైలు పాలయ్యాడు ఓ జిమ్ ఓనర్..

Andhra: అక్కడి పావురాలకు, కాకులకు ఏమైంది.. ఎందుకు ఇలా.. మిస్టరీగా మారిన మరణాలు

Andhra: అక్కడి పావురాలకు, కాకులకు ఏమైంది.. ఎందుకు ఇలా.. మిస్టరీగా మారిన మరణాలు

అనంతపురం ఎస్‌కే యూనివర్సిటీ పరిసరాల్లో వరుసగా కాకులు, పావురాలు మృతి చెందడం స్థానికంగా ఆందోళన కలిగిస్తోంది. కారణాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతుండగా, రక్త నమూనాలను భోపాల్ ల్యాబ్‌కు పంపించారు. అనంతపురంలోని ఎస్కే యూనివర్సిటీ పరిసర ప్రాంతాల్లో కాకుల మరణంపై మిస్టరీ నెలకొంది.. ..

ప్రధాని మోదీ మెచ్చిన మన నగరవనం.. ఏపీలోని ఈ పట్టణం గురించి మీకు తెలుసా..?

ప్రధాని మోదీ మెచ్చిన మన నగరవనం.. ఏపీలోని ఈ పట్టణం గురించి మీకు తెలుసా..?

ప్రధాని మోదీ 'మన్ కీ బాత్'లో అనంతపురం జిల్లా రాయదుర్గం నగర వనాన్ని ప్రశంసించారు. ఎడారి వంటి ప్రాంతంలో నీటి ఎద్దడిని అధిగమించి, 175 ఎకరాల్లో ఈ వనాన్ని అభివృద్ధి చేశారు. జల సంరక్షణ పద్ధతులు, పచ్చదనం పెంపుతో ఇది ప్రజలకు ఆహ్లాదాన్ని పంచుతోంది. కేంద్ర నిధులతో పర్యావరణ పరిరక్షణకు, పచ్చదనం పెంపునకు ఇది ఒక గొప్ప ఉదాహరణ.

Andhra: శభాష్‌రా చిన్నోడా.. ఆడుకుంటూ నీటిగుంటలో పడిన తమ్ముడు.. ఏడేళ్ల అన్న ఏం చేశాడంటే..

Andhra: శభాష్‌రా చిన్నోడా.. ఆడుకుంటూ నీటిగుంటలో పడిన తమ్ముడు.. ఏడేళ్ల అన్న ఏం చేశాడంటే..

ఇద్దరు చిన్నారులు ఇంటిముందు ఆడుకుంటున్నారు. అంతలో ఓ చిన్నారి ఇంటి ముందు కుళాయి పైపులైన్లు మరమ్మత్తుల కోసం తవ్విన గుంతలో పడి.. కొట్టుమిట్టాడుతుండగా.. అక్కడే ఉన్న ఏడేళ్ల అన్న.. వెంటనే తమ్ముడు చెయ్యి పట్టుకుని బయటకు లాగి ప్రాణాలు కాపాడాడు. అధికారుల నిర్లక్ష్యంతో ఇదంతా జరిగిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.

Andhra: చేసేదే పాడుపని.. మళ్లీ రుబాబా..! తండ్రీ, కూతురిని రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్న ఎస్సై.. ఆ తర్వాత

Andhra: చేసేదే పాడుపని.. మళ్లీ రుబాబా..! తండ్రీ, కూతురిని రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్న ఎస్సై.. ఆ తర్వాత

రిగేపల్లి గ్రామంలో కర్ణాటక మద్యం అమ్ముతున్నారన్న సమాచారంతో ఎస్సై శోభారాణి ఓ హోటల్ లో తనిఖీలు నిర్వహించారు.. హోటల్లో అక్రమంగా కర్ణాటక మద్యం విక్రయిస్తున్న విషయం గుట్టు రట్టయింది. పైకి హోటల్ గా కనిపిస్తున్నా.. లోపల బెల్ట్ షాప్ నడుపుతున్న తండ్రి మల్లికార్జున్.. కూతురు కీర్తన వ్యవహారం బట్టబయలైంది.

కరువు సీమలో కాసుల పంట.. ఏడాదికి రూ.2 కోట్ల ఆదాయం.. ఆనందంలో రైతన్నలు

కరువు సీమలో కాసుల పంట.. ఏడాదికి రూ.2 కోట్ల ఆదాయం.. ఆనందంలో రైతన్నలు

డబ్బులు చెట్లకు కాస్తున్నాయా అనే సామెతను నిజం చేశాడు ఓ రైతు. పండించిన పంటలకు గిట్టుబాటు ధర రావడంలేదని ఎంతో మంది రైతులు నష్టపోతుంటే.. ఓ రైతు 15 ఎకరాల్లో దానిమ్మ పండించి ఏకంగా రెండు కోట్ల రూపాయలు సంపాదించాడు. రాయలసీమలో కరువు జిల్లాగా పిలవబడే అనంతపురం జిల్లాలో దానిమ్మ రైతు కోట్లు సంపాదించడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఫ్రూట్ బౌల్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ గా పిలవబడే అనంతపురం జిల్లాలో ప్రస్తుతం దానిమ్మ పంట సిరులు కురిపిస్తోంది.

Andhra: పోలీసుల సమక్షంలో.. పోలీస్ స్టేషన్‌ ముందే అతడ్ని నరికి చంపారు.. రీజన్ అదే..

Andhra: పోలీసుల సమక్షంలో.. పోలీస్ స్టేషన్‌ ముందే అతడ్ని నరికి చంపారు.. రీజన్ అదే..

సత్యసాయి జిల్లాలో పోలీస్ స్టేషన్ గేట్ ఎదుటే జరిగిన హత్య రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. తనకల్లు పోలీస్ స్టేషన్‌కు పోలీసులు తీసుకొస్తున్న వ్యక్తిని వేట కొడవళ్లతో నరికి చంపిన ఘటన షాక్‌కు గురిచేసింది. అక్రమ సంబంధమే ఈ దారుణ హత్యకు కారణమని పోలీసులు నిర్ధారించారు. ఈ ఘటనలో నలుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించగా, వేట కొడవళ్లు, సెల్‌ఫోన్లు, వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.

అమెరికా చెరలో ఉన్న మదురో మన బాబా భక్తుడే.. పుట్టపర్తిలో పర్యటించిన ఫొటోలు వైరల్..

అమెరికా చెరలో ఉన్న మదురో మన బాబా భక్తుడే.. పుట్టపర్తిలో పర్యటించిన ఫొటోలు వైరల్..

క్కడో దక్షిణ అమెరికా దేశమైన వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మధురో పుట్టపర్తి సత్య సాయిబాబా భక్తుడని మీకు తెలుసా..? అవును.. గతంలో తాను పుట్టపర్తి సత్య సాయిబాబా ప్రియ శిష్యుడినని వెనిజులా అధ్యక్షుడు మధురో చెప్పుకునే వారట.. అప్పట్లో పుట్టపర్తిలో మదురో పర్యటించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి..

అయ్యో దేవుడా.. మాటలకందని విషాదం.. చావులోనూ వీడని తల్లీబిడ్డ బంధం.. పురుడుపోసిన కాసేపటికే..

అయ్యో దేవుడా.. మాటలకందని విషాదం.. చావులోనూ వీడని తల్లీబిడ్డ బంధం.. పురుడుపోసిన కాసేపటికే..

విధి ఎంత విచిత్రమైనది.. నవ మాసాలు మోసి బిడ్డను కన్న తల్లి చనిపోయిన 24 గంటల్లోనే.. ఆ చిన్నారి మృతి చెందింది.. ప్రసవ వేదన భరించలేక బిడ్డను కన్న ఆ తల్లి కాసేపటికి మృతి చెందితే.. ఆ తల్లి డెడ్ బాడీని అంబులెన్స్‌లో ఇంటికి తీసుకెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో.. అప్పుడే పుట్టిన శిశువు కూడా చనిపోయింది.