టీవీ9 లో సీనియర్ కరస్పాండెంట్ గా పనిచేస్తున్నారు. 2009లో ఎలక్ట్రానిక్ మీడియాలో జర్నలిస్టుగా ప్రస్థానం ప్రారంభించారు. జర్నలిస్టుగా 15 సంవత్సరాల అనుభవం ఉంది. 2013 నుంచి టీవీ9 సంస్థలో హైదరాబాద్, విజయవాడలో క్రైమ్ రిపోర్టర్ గా పనిచేశారు. క్రైమ్ రిపోర్టర్ గా పనిచేసిన రోజుల్లో అనేక పరిశోధనాత్మక, స్టింగ్ ఆపరేషన్లు చేశారు. ప్రస్తుతం అనంతపురం జిల్లా సీనియర్ కరస్పాండెంట్ గా పని చేస్తున్నారు. అనంతపురం జిల్లాలో రాజకీయ, వర్తమాన, హ్యూమన్ ఇంట్రెస్టింగ్, ఇతర వార్తల సేకరణలో అందరికంటే ముందుండాలని తపన పడతారు.
Viral: వరుడి కొంపముంచిన వెడ్డింగ్ కార్డ్.. అక్కాచెల్లెళ్లతో పెళ్లికి రెడీ అయిన యువకుడు.. చివరకు..
ప్రస్తుత పరిస్థితుల్లో ఒక అబ్బాయికి.. ఒక అమ్మాయితో పెళ్లి సంబంధం కుదరడమే గగనం అయిపోతుంది. కానీ శ్రీ సత్యసాయి జిల్లాలో ఒక అబ్బాయికి ఇద్దరమ్మాయిలతో పెళ్లి కుదిరింది. నారీ నారీ నడుమ మురారి.. ఇద్దరమ్మాయిలతో.. అంటూ పెళ్లి కార్డు ప్రింటింగ్ కూడా అయిపోయింది. అయితే.. ఒకే అబ్బాయిని మనువాడటానికి రెడీ అయిన వారిద్దరూ సొంత అక్కా చెల్లెళ్లే..
- Nalluri Naresh
- Updated on: Apr 9, 2025
- 10:09 am
Andhra Pradesh: యూట్యూబ్లో మర్మ కళ నేర్చుకుని.. చేతివేళ్లతో మహిళను హత్య చేసిన దుండగుడు
ఆన్లైన్ రమ్మీ... బెట్టింగ్ యాప్ లలో లక్షలు పోగొట్టుకున్న ఓ వ్యక్తి... ఈజీ మనీ కోసం... ఈజీగా మర్డర్ ఎలా చేయాలో నేర్చుకున్నాడు. ఆధారాలు దొరక్కుండా మనిషిని ఎలా చంపాలో యూట్యూబ్లో వీడియో చూసి నేర్చుకున్న ఓ దుండగుడు... ఓ మహిళను అత్యంత దారుణంగా హత్య చేశాడు. పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి...
- Nalluri Naresh
- Updated on: Apr 2, 2025
- 3:02 pm
Andhra Pradesh: పోలీస్ స్టేషన్ల మధ్య డెడ్బాడీ పంచాయతీ.. సర్వేయర్ వస్తే కానీ చిక్కుముడి వీడలేదు!
డెడ్ బాడీ తల కొత్త చెరువు మండలం లోచర్ల గ్రామపంచాయతీ పరిధిలోకి వస్తుందని.. కాళ్లు మాత్రమే పుట్టపర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుందని.. కాదు కాదు ఆ డెడ్ బాడీ పుట్టపర్తి పోలీసులే తరలించాలి అది పుట్టపర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోకే వస్తుందంటూ కొత్తచెరువు పోలీసులు వాదించుకున్నారు.
- Nalluri Naresh
- Updated on: Mar 30, 2025
- 7:11 pm
Andhra Pradesh: అభం.. శుభం తెలియని భార్యా పిల్లలు ఏం చేశారు చారి.. ఎంతకు ఒడిగట్టావు..!
తెల్లారితే ఉగాది పండుగ.. కానీ ఆ ఇంట్లో తెల్లవారగానే విషాదం నెలకొంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు చనిపోవడం ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. నలుగురి అనుమానాస్పద మృతి స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. స్వర్ణకారుడు కృష్ణాచారి, భార్య సరళ, ఇద్దరు కుమారులతో ఇంట్లో విగతజీవులుగా పడి ఉన్నారు.
- Nalluri Naresh
- Updated on: Mar 30, 2025
- 6:09 pm
Watch: విమానం నుంచి దూకేసిన వందలాది మంది ప్యారా ట్రూపర్స్.. ఉలిక్కిపడ్డ స్థానికులు..!
ఆకాశం నుంచి వందల మంది ప్యారా చుట్ సాయంతో కిందకు దూకేశారు. అటు ఇటు జోరుగా విమానాలు వస్తున్నాయి.. విమానాల నుంచి పారా ట్రూపర్స్ అలా గాలిలో నుంచి కిందకు దిగుతున్నారు. దాదాపు రెండు వందల ఎనభై మంది సైనికులు ఒకేసారి విమానాల నుంచి కిందకు దూకారు. ఈ హఠాత్తు పరిణామంతో స్థానికలుు యుద్ధం ఏమైనా జరుగుతుందా అనుకుని భయభ్రాంతులకు గురయ్యారు.
- Nalluri Naresh
- Updated on: Mar 27, 2025
- 6:22 pm
AP News: ఆలయ హుండీ లెక్కింపులో కనిపించని నగల మూట.. కట్ చేస్తే.. తెల్లారేసరికి
ఆలయ హుండీ లెక్కింపు సమయంలో ఓ భక్తురాలు వేసిన నగల మూట కనిపించలేదు. కట్ చేస్తే.. భక్తురాలి ఫిర్యాదుతో దేవాదాయ శాఖ అధికారులు మళ్లీ లెక్కింపు చేపట్టగా.. ఈసారి ఊహించని షాక్ ఎదురైంది. అదేంటో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా మరి.
- Nalluri Naresh
- Updated on: Mar 21, 2025
- 12:25 pm
AP News: గుడి కడుతున్న వ్యక్తి.. గుప్త నిధుల కోసం తవ్వకాలు.. సీన్ కట్ చేస్తే
ఈజీ మనీ కోసం గుప్త నిధుల తవ్వకాలు జరపాలని అనుకున్నారు. ఆ నెపంతో ఒక అతడ్ని కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత సీన్ కాస్తా సితారయ్యింది. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగింది.? ఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా మరి.
- Nalluri Naresh
- Updated on: Mar 18, 2025
- 8:11 pm
Anantapur: అయ్యారే.. మేకపోతుకు పుట్టినరోజు వేడుకలు.. వీడియో చూడండి…
పెట్ డాగ్స్కి, పిల్లులకు జన్మదిన వేడుకలు చేయడం మనం ఇప్పటివరకు చూశాం.. కానీ ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ మేకపోతుకు కూడా ఓ వ్యక్తి జన్మదిన వేడుకలు నిర్వహించాడు. ఏం తప్పేముంది... మా ఇంట్లో పుట్టింది.. మా మధ్య పెరిగింది.. అందుకే దాని ఫ్యామిలీ మెంబర్లా భావించి బర్త్ డే చేశామని దాని యజమాని చెబుతున్నాడు.
- Nalluri Naresh
- Updated on: Mar 15, 2025
- 6:07 pm
Andhra News: ఎంత పనిచేశావ్రా..! సెల్ ఫోన్ కొనివ్వలేదని 15 ఏళ్ల బాలుడు..
15ఏళ్లే.. చదువు మానేసి ఖాళీగా ఉంటున్నాడు.. స్నేహితులు అందరూ సెల్ఫోన్ వాడుతుండడంతో దానిపై మోజు పెరిగింది.. తనకు కూడా సెల్ ఫోన్ కావాలని తల్లిని అడిగాడు ఆ బాలుడు.. భర్త చనిపోయి వీధి వీధి తిరుగుతూ పండ్లు కూరగాయలు అమ్ముకొని కుటుంబాన్ని నెట్టుకొస్తున్న... ఆ తల్లి స్మార్ట్ ఫోన్ కొనివ్వలేనని కొడుకుకి చెప్పింది.
- Nalluri Naresh
- Updated on: Mar 9, 2025
- 12:13 pm
ఆస్తికోసం సొంత అన్న..అన్న కొడుకు మర్డర్ కు తమ్ముడు స్కెచ్..సుపారి ఎంతో తెలిస్తే..
12 కోట్ల రూపాయలు ఆస్తి తనకే దక్కుతుందని తమ్ముడు దామోదర్ గౌడ్ జంట హత్యలకు కుట్ర చేశాడు. దీంతో అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం మెచ్చిరి గ్రామానికి చెందిన టిడిపి నాయకుడు ఆది కేశవులు హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మారుతి రెడ్డిని తమ్ముడు దామోదర్ గౌడ్ సంప్రదించాడు. అన్న... అన్న కొడుకును హత్య చేసేందుకు సుఫారి కుదుర్చుకున్నాడు. హత్య చేసేందుకు 23 లక్షలకు మారుతి రెడ్డితో ఒప్పందం చేసుకున్నాడు. మూడు లక్షలు అడ్వాన్స్ గా ఇచ్చి...
- Nalluri Naresh
- Updated on: Mar 7, 2025
- 1:06 pm
అతడినే పెళ్లి చేసుకుంటానన్న కూతురు.. పరువు పోతుందని కన్నతండ్రి ఏం చేశాడంటే..
అనంతపురం జిల్లా గుంతకల్లులో పరువు హత్య సంచలనం సృష్టించింది. ప్రేమించిన యువకుడిని పెళ్లి చేసుకుంటానన్న కూతురిని తండ్రి కడతేర్చాడు.. వేరే కులం యువకుడిని పెళ్లి చేసుకుంటాననడంతో కన్నతండ్రి హత్య చేసి.. పెట్రోల్ పోసి తగులబెట్టాడు.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన సంచలనంగా మారింది..
- Nalluri Naresh
- Updated on: Mar 5, 2025
- 6:09 pm
పంటపొలాల్లో ఊహించని వస్తువులు.. దెబ్బకు ఉలిక్కిపడిన పోలీసులు.. అసలేం జరుగుతోంది..
ఒకప్పుడు ఆ ప్రాంతంలో టెన్షన్ .. టెన్షన్.. మావోయిస్టులు, రాడికల్స్ ఎక్కువగా ప్రభావితం చేసే ప్రాంతం కావడంతో ఎప్పుడూ భయంగానే ఉండేది.. కాలక్రమేణా.. మావోయిస్టులు, రాడికల్స్ కనుమరుగైపోయారు. తాజాగా ఓ ఘటన పోలీసులను ఉలిక్కిపడేలా చేసింది. పచ్చని పంట పొలాల్లో రెండు నాటు తుపాకులు పోలీసులకు లభ్యమయ్యాయి..
- Nalluri Naresh
- Updated on: Mar 3, 2025
- 6:38 pm