టీవీ9 లో సీనియర్ కరస్పాండెంట్ గా పనిచేస్తున్నారు. 2009లో ఎలక్ట్రానిక్ మీడియాలో జర్నలిస్టుగా ప్రస్థానం ప్రారంభించారు. జర్నలిస్టుగా 15 సంవత్సరాల అనుభవం ఉంది. 2013 నుంచి టీవీ9 సంస్థలో హైదరాబాద్, విజయవాడలో క్రైమ్ రిపోర్టర్ గా పనిచేశారు. క్రైమ్ రిపోర్టర్ గా పనిచేసిన రోజుల్లో అనేక పరిశోధనాత్మక, స్టింగ్ ఆపరేషన్లు చేశారు. ప్రస్తుతం అనంతపురం జిల్లా సీనియర్ కరస్పాండెంట్ గా పని చేస్తున్నారు. అనంతపురం జిల్లాలో రాజకీయ, వర్తమాన, హ్యూమన్ ఇంట్రెస్టింగ్, ఇతర వార్తల సేకరణలో అందరికంటే ముందుండాలని తపన పడతారు.
ఓరీ దేవుడో.. ప్రాణం తీసిన ఖర్జూరం.. అదేలా సాధ్యం అనుకుంటున్నారా..?
శ్రీ సత్య సాయి జిల్లాలోని పెనుకొండలో విషాదం చోటుచేసుకుంది. గంగాధర్ అనే 46 ఏళ్ల వ్యక్తి ఇంట్లో ఖర్జూరం తింటుండగా, విత్తనం గొంతులో ఇరుక్కుని ఊపిరాడక మరణించారు. కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. అనంతపురం తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
- Nalluri Naresh
- Updated on: Dec 7, 2025
- 8:36 am
Anantapur: ఇంటి అద్దె ఎగ్గొట్టడానికి ఎవరైనా ఇంత పని చేస్తారా..? వామ్మో..
ఒక నెల అద్దె ఆలస్యమైనా ఇంటి ఓనర్ని బతిమిలాడుకోవాల్సిన పరిస్థితి. అద్దె కట్టలేకపోతే అదే ఇంట్లో ఉండటం అసంభవం. కానీ అనంతపురం గుత్తిలో అద్దె ఎగ్గొట్టేందుకు దంపతులు చేసిన పని మాత్రం కిరాతకాన్ని మించిపోయింది. పదివేల అప్పు… నెలలుగా బకాయి అద్దె… ఒత్తిడి పెంచిన ఇంటి యజమానిని ఈ లోకం నుంచి పంపించివేశారు దంపతులు.
- Nalluri Naresh
- Updated on: Dec 7, 2025
- 6:59 am
Andhra: రిజర్వాయర్లో దొరికిన కుళ్లిన డెడ్బాడీ.. 6 నెలల తర్వాత తేలిన అసలు నిజం..
భర్త దగ్గర దొరకని సంతోషం.. వేరే మగాడి దగ్గర దొరుకుతుందని కొంతమంది భార్యలు.. వివాహ బంధాన్ని తెంచుకోవటానికి కూడా వెనుకాడడం లేదు.. ఆఖరికి అడ్డొచ్చిన భర్తలను కూడా చంపేస్తున్నారు.. రోజు తాగి వచ్చి కొడుతున్నాడని.. వేధిస్తున్నాడని.. ప్రియుడితో కలిసి ఇంట్లోనే భర్తను హత్య చేయించింది ఓ భార్య. భర్తను హత్య చేసి ఆ డెడ్బాడీని రిజర్వాయర్ నీటిలో పడేసింది. ప్రియుడి మోజులో పడి భర్తను హత్య చేసిన ఆ భార్య బాగోతాన్ని ఆరు నెలల తర్వాత పోలీసులు బట్టబయలు చేశారు. శ్రీ సత్య సాయి జిల్లా లో ఆరు నెలల క్రితం ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన మర్డర్ మిస్టరీని ఎట్టకేలకు పోలీసులు చేధించారు. భార్య అసలు నిందితురాలని తెలుసుకొని పోలీసులు షాక్ అయ్యారు.
- Nalluri Naresh
- Updated on: Dec 6, 2025
- 5:23 pm
Andhra: ఆ ఊరు పెరుగు తింటే.. మళ్లీ మళ్లీ కావాలంటారు..
రాయదుర్గం పట్టణానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న సిరిగేదొడ్డి గ్రామం మహిళలు 40 సంవత్సరాలుగా పెరుగును విక్రయిస్తూ వందల కుటుంబాలను పోషిస్తున్నారు. ప్రతిరోజూ ఉదయం పెరుగు కుండలు తీసుకొని రాయదుర్గం పట్టణంలో అమ్మకానికి వెళ్తారు. ప్రభుత్వ ఆర్థిక సహాయం, రుణ సబ్సిడీలు అందితే వారి ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది అని గ్రామ మహిళలు అభిప్రాయపడుతున్నారు.
- Nalluri Naresh
- Updated on: Dec 5, 2025
- 8:16 pm
Andhra: వారు తొక్కితే రోగాలన్నీ మటుమాయం..! కాలి స్పర్శ తగిలితే సంతాన భాగ్యం..!
శ్రీ సత్యసాయి జిల్లాలోని మడకశిరలో జరిగే భూతప్పల ఉత్సవం ప్రత్యేక ఆచారాలతో ఆకట్టుకుంటోంది. దైవస్వరూపులుగా భావించే భూతప్పల కాలి స్పర్శ తగిలితే దీర్ఘకాలిక రోగాలు నయమవుతాయనీ, సంతానం లేని వారికి సంతానం కలుగుతుందనీ స్థానికుల విశ్వాసం. అందుకే తడి బట్టలతో భక్తులు భూతప్పలు నడిచే దారిలో పొర్లు దండాలు పెట్టి బోర్లా పడుకుంటారు.
- Nalluri Naresh
- Updated on: Dec 5, 2025
- 5:54 pm
Andhra News: అయ్యో పాపం.. ఫిర్యాదు చేస్తే పట్టించుకోని పోలీసులు!.. మనస్థాపంతో విద్యార్థిని..
ఓవైపు ఆకతాయి వేధింపులు.. మరోవైపు సమస్య చెప్తే పోలీసులు రెస్పాండ్ అవ్వలేదని మనస్థాపం.. ఈ రెండు కారణాలు ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. తనను వేధిస్తున్న ఆకతాయిలపై ఫిర్యాదు చేస్తే పోలీసులు సరిగ్గా పట్టించుకోలేదని మనస్థాపానికి గురైన స్పందన అనే ఇంటర్ విద్యార్థిని ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. ఈ విషాద ఘటన సత్యసాయి జిల్లాలో వెలుగు చూసింది.
- Nalluri Naresh
- Updated on: Dec 4, 2025
- 6:28 pm
Snake Bite: నిద్రిస్తున్న ఇద్దరు చిన్నారులను కాటేసిన పాము.. తమ్ముడు మృతి.. అన్న పరిస్థితి విషమం!
Snake Bite: చిన్నారులకు పాము కాటేసిన విషయం తమకు తెలియదని, కడుపు నొప్పి రావడంతో్ ఆస్పత్రికి తరలించామని తల్లిదండ్రులు చెబుతున్నారు. ప్రస్తుతం శివరామరాజు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పాము కాటేసిన విషయం తల్లిదండ్రులకు తెలియకపోవడంతో ఆలస్యంగా ఆస్పత్రికి తరలించారు. దీంతో విషం..
- Nalluri Naresh
- Updated on: Dec 3, 2025
- 4:52 pm
Andhra: డబ్బు డిపాజిట్ చేసేందుకు బ్యాంకుకు వచ్చిన మహిళ.. ఆమె రాసిన స్లిప్ చూడగా
కళ్ళముందే కనికట్టు చేసినట్లు రమణమ్మ అనే మహిళను మాటలతో ఏమార్చి 50 వేల రూపాయల కట్టలో 18 వేల రూపాయలు కొట్టేశారు. డబ్బులు తీసుకున్న దుండగులిద్దరూ హడావుడిగా బ్యాంకు నుంచి బయటకు నడుచుకుంటూ పారిపోయారు. అటు బాధితురాలు రమణమ్మ క్యాష్ కౌంటర్ దగ్గరికి వెళ్లగా..
- Nalluri Naresh
- Updated on: Dec 3, 2025
- 12:30 pm
Andhra: ముసలోడు మామూలోడు కాదు మావ.! అప్పుడే 35 ఏళ్ల క్రితం.. ఏం చేశాడో తెలిస్తే స్టన్
1992 డిసెంబర్ 28వ తేదీన APSRTCకు చెందిన AP 9Z 4105 బస్సు దోపిడీ జరిగింది. జల్లిపల్లి-కుడేరు మధ్య అర్ధరాత్రి మదనపల్లి డిపోకు చెందిన ఓ బస్సులోకి ముగ్గురు దొంగలు ఎక్కి డ్రైవర్ను, ప్రయాణికులను బెదిరించి వారి వద్ద ఉన్న నగదు, బంగారు ఆభరణాలు బలవంతంగా దోచుకుని బస్సు నుంచి దిగి పారిపోయారు.
- Nalluri Naresh
- Updated on: Dec 2, 2025
- 12:39 pm
Andhra Pradesh: ఛీ.. ఏం మనుషులురా.. కూతురిని కూడా వదలని తండ్రి.. నెలల పాటు దారుణంగా..
శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరంలో సభ్యసమాజం తలదించుకునే ఘటన జరిగింది. పిల్లలు లేరని దత్తత తీసుకున్న 14 ఏళ్ల బాలికపై పెంపుడు తండ్రి వీరాంజనేయులు, అతని బావమరిది నరసింహులు నెలల తరబడి లైంగిక దాడి చేశారు. ఐదు నెలల గర్భవతి అయిన బాలిక ఆసుపత్రికి వెళ్లడంతో ఈ దారుణం బయటపడింది.
- Nalluri Naresh
- Updated on: Dec 1, 2025
- 8:23 pm
Andhra: నన్ను తిడతారా..? మిమల్ని ఏడిపిస్తాను చూడండి అంటూ రూమ్లోకి వెళ్లింది.. కాసేపటికి..
హిందూపురం పట్టణంలో చోటుచేసుకున్న విషాదం రీల్స్ మోజు యువతను ఎంత ప్రమాదకర దారికి నెడుతుందో చాటిచెప్పింది. సత్యనారాయణపేటకు చెందిన భానుతేజ (19) ఎప్పుడూ మొబైల్లో రీల్స్లో గంటలు గంటలు గడిపేది. బుక్ పట్టుకుని కూడా రీల్స్ చూసేది. దీంతో తండ్రి హెచ్చరించాడు.
- Nalluri Naresh
- Updated on: Nov 29, 2025
- 7:05 pm
Andhra Pradesh: ఎంత పనిచేశావ్ తల్లి.. కొడుకును చంపి.. ఉరేసుకుని ఆత్మహత్య.. కారణం ఇదేనా..
అల్లారుముద్దుగా పెంచిన కొడుకును చంపింది. ఆ తర్వాత తల్లి కూడా ఆత్మహత్యకు పాల్పడింది. అనంతపురంలో చోటుచేసుకున్న ఈ విషాద ఘటన కలచివేస్తుంది. మహిళ తల్లిదండ్రులు భర్త గురించి షాకింగ్ విషయాలు చెప్పారు. ఈ ఘటనలో అసలు ఏం జరిగింది..? మహిళ ఆత్మహత్యకు ఎందుకు పాల్పడింది అనేది తెలుసుకుందాం..
- Nalluri Naresh
- Updated on: Nov 28, 2025
- 10:39 am