టీవీ9 లో సీనియర్ కరస్పాండెంట్ గా పనిచేస్తున్నారు. 2009లో ఎలక్ట్రానిక్ మీడియాలో జర్నలిస్టుగా ప్రస్థానం ప్రారంభించారు. జర్నలిస్టుగా 15 సంవత్సరాల అనుభవం ఉంది. 2013 నుంచి టీవీ9 సంస్థలో హైదరాబాద్, విజయవాడలో క్రైమ్ రిపోర్టర్ గా పనిచేశారు. క్రైమ్ రిపోర్టర్ గా పనిచేసిన రోజుల్లో అనేక పరిశోధనాత్మక, స్టింగ్ ఆపరేషన్లు చేశారు. ప్రస్తుతం అనంతపురం జిల్లా సీనియర్ కరస్పాండెంట్ గా పని చేస్తున్నారు. అనంతపురం జిల్లాలో రాజకీయ, వర్తమాన, హ్యూమన్ ఇంట్రెస్టింగ్, ఇతర వార్తల సేకరణలో అందరికంటే ముందుండాలని తపన పడతారు.
కరువు సీమలో కాసుల పంట.. ఏడాదికి రూ.2 కోట్ల ఆదాయం.. ఆనందంలో రైతన్నలు
డబ్బులు చెట్లకు కాస్తున్నాయా అనే సామెతను నిజం చేశాడు ఓ రైతు. పండించిన పంటలకు గిట్టుబాటు ధర రావడంలేదని ఎంతో మంది రైతులు నష్టపోతుంటే.. ఓ రైతు 15 ఎకరాల్లో దానిమ్మ పండించి ఏకంగా రెండు కోట్ల రూపాయలు సంపాదించాడు. రాయలసీమలో కరువు జిల్లాగా పిలవబడే అనంతపురం జిల్లాలో దానిమ్మ రైతు కోట్లు సంపాదించడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఫ్రూట్ బౌల్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ గా పిలవబడే అనంతపురం జిల్లాలో ప్రస్తుతం దానిమ్మ పంట సిరులు కురిపిస్తోంది.
- Nalluri Naresh
- Updated on: Jan 10, 2026
- 1:56 pm
Andhra: పోలీసుల సమక్షంలో.. పోలీస్ స్టేషన్ ముందే అతడ్ని నరికి చంపారు.. రీజన్ అదే..
సత్యసాయి జిల్లాలో పోలీస్ స్టేషన్ గేట్ ఎదుటే జరిగిన హత్య రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. తనకల్లు పోలీస్ స్టేషన్కు పోలీసులు తీసుకొస్తున్న వ్యక్తిని వేట కొడవళ్లతో నరికి చంపిన ఘటన షాక్కు గురిచేసింది. అక్రమ సంబంధమే ఈ దారుణ హత్యకు కారణమని పోలీసులు నిర్ధారించారు. ఈ ఘటనలో నలుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించగా, వేట కొడవళ్లు, సెల్ఫోన్లు, వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.
- Nalluri Naresh
- Updated on: Jan 7, 2026
- 9:34 pm
అమెరికా చెరలో ఉన్న మదురో మన బాబా భక్తుడే.. పుట్టపర్తిలో పర్యటించిన ఫొటోలు వైరల్..
క్కడో దక్షిణ అమెరికా దేశమైన వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మధురో పుట్టపర్తి సత్య సాయిబాబా భక్తుడని మీకు తెలుసా..? అవును.. గతంలో తాను పుట్టపర్తి సత్య సాయిబాబా ప్రియ శిష్యుడినని వెనిజులా అధ్యక్షుడు మధురో చెప్పుకునే వారట.. అప్పట్లో పుట్టపర్తిలో మదురో పర్యటించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి..
- Nalluri Naresh
- Updated on: Jan 6, 2026
- 8:53 pm
అయ్యో దేవుడా.. మాటలకందని విషాదం.. చావులోనూ వీడని తల్లీబిడ్డ బంధం.. పురుడుపోసిన కాసేపటికే..
విధి ఎంత విచిత్రమైనది.. నవ మాసాలు మోసి బిడ్డను కన్న తల్లి చనిపోయిన 24 గంటల్లోనే.. ఆ చిన్నారి మృతి చెందింది.. ప్రసవ వేదన భరించలేక బిడ్డను కన్న ఆ తల్లి కాసేపటికి మృతి చెందితే.. ఆ తల్లి డెడ్ బాడీని అంబులెన్స్లో ఇంటికి తీసుకెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో.. అప్పుడే పుట్టిన శిశువు కూడా చనిపోయింది.
- Nalluri Naresh
- Updated on: Dec 29, 2025
- 8:36 pm
Andhra: దొంగలకే దొంగ..! వైన్ షాపులో దొంగతనం చూసి పోలీసులే షాక్.. వీడియో
శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. వైన్ షాపులో చోరీకి వెళ్ళిన దొంగ.. వైన్ షాప్ ముందు వాచ్మెన్ కాపలా ఉన్నట్లు ప్లాన్ చేశాడు.. అనంతరం వైన్ షాప్ షట్టర్ తాళాలు పగలగొట్టి లోపలికి వెళ్లి మరీ చోరీకి పాల్పడ్డాడు.
- Nalluri Naresh
- Updated on: Dec 25, 2025
- 7:58 pm
Andhra News: కన్న తండ్రే.. కాలయముడై.. కడుపున పుట్టారని కూడా చూడకుండా..
ఈ విశ్వంలోనే అపురూపమైన బంధం ఏదైనా ఉందంటే.. అది కేవలం తల్లిబిడ్డల బంధం మాత్రమే.. కానీ ఈ మధ్య కాలంలో కొందరు తల్లిదండ్రలు అ బందానికి ఉన్న అర్థాన్నే మార్చేస్తున్నారు. నవమాసాలు మోసి, కని పెంచిన కన్న బిడ్డలను పొత్తిళ్లలోనే చిదిమేస్తున్నారు. తాజాగా అలాంటి ఘటనే వెలుగు చూసింది. భార్యపై అనుమానంతో ఓ కిరాతకుడు అభంశుభం తెలియని చిన్నారులను కడతేర్చాడు.
- Nalluri Naresh
- Updated on: Dec 23, 2025
- 7:19 pm
అమాయకుడు అనుకుంటే పొరపాటే.. ఇతను ఏం చేశాడో తెలిస్తే.. నోరెళ్లబెట్టాల్సిందే..
అనంతపురం జిల్లాలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. మద్యం మత్తులో జనాలపై కత్తితో దాడి చేస్తున్న నిందితుడిని పట్టుకునేందుకు వెళ్లిన పోలీసులపైనే.. దుండగుడు కత్తితో దాడి చేశాడు. దీంతో దుండగుడిపై పట్టుకునేందుకు కాల్పుడు జరిపిన పోలీసులు.. అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకం రేపింది.
- Nalluri Naresh
- Updated on: Dec 22, 2025
- 10:39 pm
Anantapur: ఇటు చర్మవ్యాధికి.. అటు ఒబేసిటీకి కలిపి మందులు వాడింది.. చివరకు..
చర్మవ్యాధి చికిత్స పేరుతో వాడిన మందులే ఓ విద్యార్థినిని బలి తీసుకున్నాయా..? ఒబేసిటీ తగ్గించేందుకు తీసుకున్న అదనపు డోసులు ప్రాణాంతకంగా మారాయా..? అనంతపురం ఎస్కే యూనివర్సిటీలో ఎమ్మెస్సీ చదువుతున్న మాధుర్య ఆకస్మిక మృతి విద్యార్థుల్లో విషాదాన్ని మిగిల్చింది. వివరాలు ఇలా ..
- Nalluri Naresh
- Updated on: Dec 21, 2025
- 2:35 pm
Andhra: ఓరి వీడు పాడుగాను.. అక్కడెక్కడో కాదు డైరెక్టుగా అక్కడే కొరికాడు
కుక్క కాదు… కుక్క యజమానే కుక్కలా కరిచాడు.. కొరికాడు! పెంపుడు కుక్క విషయమై తలెత్తిన గొడవలో ఎదురింటి వ్యక్తిపై దాడి చేసి మర్మాంగాన్ని కొరికిన ఘటన శ్రీ సత్యసాయి జిల్లాలో సంచలనం సృష్టిస్తోంది. బాధితుడి పరిస్థితి విషమంగా ఉండటంతో బెంగళూరుకు తరలించారు.
- Nalluri Naresh
- Updated on: Dec 20, 2025
- 7:49 pm
Andhra Pradesh: లవర్ కోసం మతం మారిన యువకుడు.. కట్ చేస్తే.. కటకటాల్లోకి.. ఏం జరిగిందంటే..?
ప్రేమించిన యువతి కోసం ఇస్లాంలోకి మారిన ధనుంజయ్ తన పేరును షేక్ మొహమ్మద్ ఆసిఫ్గా మార్చుకున్నాడు. ఇంతవరకు బాగానే ఉన్న అతడు చేసిన ఓ తప్పుతో వివాదంలో చిక్కుకున్నాడు. ఏకంగా జైలుకే వెళ్లాల్సి వచ్చింది. అసలు ఏం జరిగిందనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..
- Nalluri Naresh
- Updated on: Dec 19, 2025
- 1:45 pm
ఓరీ దేవుడో.. ప్రాణం తీసిన ఖర్జూరం.. అదేలా సాధ్యం అనుకుంటున్నారా..?
శ్రీ సత్య సాయి జిల్లాలోని పెనుకొండలో విషాదం చోటుచేసుకుంది. గంగాధర్ అనే 46 ఏళ్ల వ్యక్తి ఇంట్లో ఖర్జూరం తింటుండగా, విత్తనం గొంతులో ఇరుక్కుని ఊపిరాడక మరణించారు. కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. అనంతపురం తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
- Nalluri Naresh
- Updated on: Dec 7, 2025
- 8:36 am
Anantapur: ఇంటి అద్దె ఎగ్గొట్టడానికి ఎవరైనా ఇంత పని చేస్తారా..? వామ్మో..
ఒక నెల అద్దె ఆలస్యమైనా ఇంటి ఓనర్ని బతిమిలాడుకోవాల్సిన పరిస్థితి. అద్దె కట్టలేకపోతే అదే ఇంట్లో ఉండటం అసంభవం. కానీ అనంతపురం గుత్తిలో అద్దె ఎగ్గొట్టేందుకు దంపతులు చేసిన పని మాత్రం కిరాతకాన్ని మించిపోయింది. పదివేల అప్పు… నెలలుగా బకాయి అద్దె… ఒత్తిడి పెంచిన ఇంటి యజమానిని ఈ లోకం నుంచి పంపించివేశారు దంపతులు.
- Nalluri Naresh
- Updated on: Dec 7, 2025
- 6:59 am