Nalluri Naresh

Nalluri Naresh

Senior Correspondent - TV9 Telugu

naresh.nalluri@tv9.com
Andhra Pradesh: రెండు ఇళ్ల గోడల మధ్య ఇరుక్కుపోయి చిక్కులు చూసిన ఏడేళ్ల చిన్నారి.. చివరికి..!

Andhra Pradesh: రెండు ఇళ్ల గోడల మధ్య ఇరుక్కుపోయి చిక్కులు చూసిన ఏడేళ్ల చిన్నారి.. చివరికి..!

ఇంటి దగ్గర ఆడుకుంటూ ఓ చిన్నారి రెండు ఇళ్ళ మధ్య సందులో ఇరుక్కుంది. కనీసం అర అడుగు వెడల్పు కూడా లేని ఆ సందులో చిన్నారి దూరిపోయింది. నరకయాతన అనుభవించిన చిన్నారిని అతి కష్టం మీద సహాయక సిబ్బంది క్షేమంగా బయటకు తీశారు. ఈ ఘటన అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది.

Dharmavaram Politics: ధర్మవరం టికెట్ రేసులో పరిటాల శ్రీరామ్, వరదాపురం సూరి.. మధ్యలో సత్యకుమార్!

Dharmavaram Politics: ధర్మవరం టికెట్ రేసులో పరిటాల శ్రీరామ్, వరదాపురం సూరి.. మధ్యలో సత్యకుమార్!

ధర్మవరంలో నిన్నటి వరకు పరిటాల శ్రీరామ్ వర్సెస్ గోనుగుంట్ల సూర్యనారాయణ మద్య టికెట్ ఫైట్ నడిచింది. తెలుగుదేశం పార్టీ తరఫున పరిటాల శ్రీరామ్, భారతీయ జనతా పార్టీ తరఫున వరదాపురం సూరి మధ్య టికెట్ కోసం తీవ్రమైన పోటీ నెలకొంది. ధర్మవరంలో ఓవైపు పరిటాల శ్రీరామ్.. మరోవైపు వరదాపురం సూరి టికెట్ కోసం పోటీ పడుతుంటే, మధ్యలో జనసేన కూడా ధర్మవరం టికెట్ ఈసారి తమకే ఇవ్వాలన్న డిమాండ్ తెర మీదకి తీసుకొచ్చింది.

Andhra Pradesh: మాజీ ఆర్మీ జవాన్ ఇంట్లో దొరికిన వస్తువులు చూసి పోలీసులే షాక్!

Andhra Pradesh: మాజీ ఆర్మీ జవాన్ ఇంట్లో దొరికిన వస్తువులు చూసి పోలీసులే షాక్!

ఒకప్పుడు దేశానికి ఎంతో సేవ చేశాడు. రిటైర్మెంట్ తీసుకుని దేశానికి సేవ చేసిన గౌరవంతో మిగిలిన జీవితాన్ని గడపాల్సిన ఆర్మీ జవాను కాసుల కోసం కక్కుర్తి పడ్డాడు. పక్కా సమాచారంతో దాడి చేసిన పోలీసులు మాజీ ఆర్మీ జవాన్ గుట్టురట్టు చేశారు. భారీగా మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అతగాడిని కటకటాల వెనక్కు నెట్టారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లో వెలుగు చూసింది.

అప్పు ఇచ్చిన పాపానికి ముక్కలు ముక్కలుగా నరికి అంతం చేసిన వైనం..

అప్పు ఇచ్చిన పాపానికి ముక్కలు ముక్కలుగా నరికి అంతం చేసిన వైనం..

ఫ్యాక్షనిస్టులు కూడా తమ ప్రత్యర్థుల్ని అంత దారుణంగా హత్య చేయరు. కానీ ఓ వృద్ధురాలిని ముక్కలు ముక్కలుగా నరికి దారుణంగా హత్య చేశారు. తీసుకున్న అప్పు ఎగ్గొట్టేందుకు వృద్దురాలిని హత్య చేసి.. దారుణానికి ఒడిగట్టారు. అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం ఎర్రగుంట్ల గ్రామానికి చెందిన 85 ఏళ్ల ఓబులమ్మను.. అదే గ్రామానికి చెందిన కృష్ణమూర్తి అతని కుటుంబ సభ్యులు దారుణంగా హత్య చేశారు.

అక్కడ నీరు, ఆహారం దొరక్క మరణిస్తున్న చిరుతలు.. వన్యప్రాణులను పట్టించుకోని అటవీశాఖ..

అక్కడ నీరు, ఆహారం దొరక్క మరణిస్తున్న చిరుతలు.. వన్యప్రాణులను పట్టించుకోని అటవీశాఖ..

అనంతపురం జిల్లాలో వరుసగా చిరుత పులుల మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇటీవల కాలంలో చిరుత పులలో మరణాల సంఖ్య పెరుగుతూ వస్తుంది. కళ్యాణదుర్గం శెట్టూరు మండలం అటవీ ప్రాంతంలో వన్యప్రాణులకు తాగడానికి నీరు కూడా దొరకడం లేదు. దీంతో రెండు రోజుల క్రితం ఓ చిరుత మృతి చెందింది.

Andhra Pradesh: ఇదేం బెట్టింగ్ రా సామీ..! పందెంలో ఓడిపోతే అర గుండు, అర మీసం కట్!

Andhra Pradesh: ఇదేం బెట్టింగ్ రా సామీ..! పందెంలో ఓడిపోతే అర గుండు, అర మీసం కట్!

పేకాట, క్రికెట్ బెట్టింగ్, పొలిటికల్ బెట్టింగులలో ఇప్పటి వరకు ఇలాంటి బెట్టింగ్ ఎవరూ చూసి ఉండరు..! రాజకీయాల్లో గెలుపు, ఓటములపై పందెలు కాయడం సహజం. కానీ ఓ వ్యక్తి బెట్టింగ్ బంగార్రాజులకే ట్రెండ్ సెట్ చేశాడు. శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తి వైసీపీ టికెట్ శ్రీధర్ రెడ్డికి రాదని ఓ వ్యక్తి పందెం వేశాడు. శ్రీధర్ రెడ్డికి వైసీపీ టిక్కెట్ ఇస్తే, అరగుండు కొట్టించుకుంటానని, సగం మీసం తీసేస్తానని పందెం కాశాడు.

AP News: ఒకే కుటుంబం రెండు విషాదాలు.. సాయంత్రం భర్త హత్య.. తెల్లవారి భార్య మృతి..

AP News: ఒకే కుటుంబం రెండు విషాదాలు.. సాయంత్రం భర్త హత్య.. తెల్లవారి భార్య మృతి..

అనంతపురంలోని జెఎన్‎టీయు సమీపంలో ఓ ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలో ప్రిన్సిపల్‎గా పని చేసిన మూర్తిరావు హత్యకు గురయ్యారు. నిన్న సాయంత్రం ఇంట్లోనే ఉన్న మూర్తిరావును మేనల్లుడు ఆదిత్య గొంతు కోసి హత్య చేశాడు. మేనల్లుడు ఆదిత్యకు ఉద్యోగం ఇప్పిస్తానని మూర్తిరావు డబ్బులు తీసుకొని ఉద్యోగం ఇప్పించకపోవడంతో ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగింది. దీంతో మేనల్లుడు ఆదిత్య కత్తితో మూర్తిరావు గొంతు కోసి హత్య చేశాడు. సొంత కుటుంబ సభ్యుడి చేతిలోనే మూర్తిరావు హత్యకు గురవడంతో కుటుంబ సభ్యుల్లో తీవ్ర విషాదం నెలకొంది.

AP News: దాడి చేసి ప్రాణాలు తీస్తోన్నా ఈ దున్నపోతును ఏం అనరు.. ఎందుకంటే..?

AP News: దాడి చేసి ప్రాణాలు తీస్తోన్నా ఈ దున్నపోతును ఏం అనరు.. ఎందుకంటే..?

 రోళ్ళ మండలంలో ఈ  దున్నపోతు దాడిలో ఓ వృద్ధురాలు ప్రాణం కోల్పోయింది. ఎం.రాయాపురం పంచాయతీ ఎంఆర్ గొల్లహట్టికి చెందిన ఈరమ్మ (72) అనే వృద్ధురాలు పశువుల మేత కోసం పొలానికి వెళ్లింది. అక్కడ మేత కోసుకుని చీకటి పడ్డాక ఇంటికి బయల్దేరింది. అక్కడే పొలాల్లో మేత మేస్తున్న దేవుని పేరు మీద వదిలిన దున్నపోతు...

Andhra Pradesh: సగం గడ్డం చేసి వదిలేసిన సెలూన్ షాప్ నిర్వాహకుడు.. ఎందుకో తెలుసా..?

Andhra Pradesh: సగం గడ్డం చేసి వదిలేసిన సెలూన్ షాప్ నిర్వాహకుడు.. ఎందుకో తెలుసా..?

అర గుండు, అర మీసం తీసేసిన సందర్భాలు చాలా చూశాం..! కానీ ఇదేంటి సగం గడ్డం చేసి వదిలేయడం ఏంటనీ అనుకుంటున్నారా..? అచ్చం ఇదే జరిగింది. కాంగ్రెస్, వైసీపీ నాయకుల మధ్య గత కొంతకాలంగా పాత గొడవలు ఉన్నాయి. దీంతో ఒకరికొకరు ఎదురుపడితే కారాలు, మిరియాలు నూరుకునే పరిస్థితి. తీరా ఒక రోజు ఒకరికి పగ తీర్చుకునే సమయం రానే వచ్చిందని అనుకున్నాడు. ఇద్దరూ ఎదురెదురు పడ్డారు.

Andhra Pradesh: కిరాణ సరుకులు తీసుకుని.. డబ్బులు ఫోన్ పే చేశాడు.. తీరా అకౌంట్ చెక్ చేస్తే షాక్..!

Andhra Pradesh: కిరాణ సరుకులు తీసుకుని.. డబ్బులు ఫోన్ పే చేశాడు.. తీరా అకౌంట్ చెక్ చేస్తే షాక్..!

లావాదేవీల రూపంలో పళ్ళు, కూరగాయల దగ్గర నుండి పెద్ద పెద్ద మాల్స్, షోరూంలో చెల్లించే బిల్లులు కూడా డిజిటల్ చెల్లింపులు చెల్లించేస్తున్నారు. అనంతపురం జిల్లా ఉరవకొండలో ఫోన్ పే పేరుతో కిరాణా కొట్టు యజమానికి టోకరా ఇచ్చాడు ఓ మోసగాడు. వేలాది రూపాయల కిరాణా సరుకులు కొని ఉడాయించాడు.

Andhra Pradesh: మిరప చేనులో ఘాటు వాసన.. వచ్చి చూస్తే తెలిసిందీ అసలు సంగతి..!

Andhra Pradesh: మిరప చేనులో ఘాటు వాసన.. వచ్చి చూస్తే తెలిసిందీ అసలు సంగతి..!

ఇదీ నిజంగా పుష్ప సీన్‌ను మించిన ఘటన.. అది రైతు వ్యవసాయ క్షేత్రం.. చూసే వారికి అది వరితో పాటు, కూరగాయలు పండిస్తునన్నట్లు కనిపిస్తోంది. అక్కడే వేసిన మిరప తోటలోకి వెళ్లి చూస్తే మాత్రం ఆ రైతు అసలు రంగుబయట పడింది. మిరప చేను మాటున గంజాయి సాగు చేస్తున్నాడు రైతు. పక్కా ప్లాన్‌తో నిర్వహించిన ఆపరేషన్‌లో అసలు యవ్వారం వెలుగులోకి వచ్చింది.

AP News: అధికారి బదిలీ.. వినూత్నంగా వీడ్కోలు.. వీడియో వైరల్

AP News: అధికారి బదిలీ.. వినూత్నంగా వీడ్కోలు.. వీడియో వైరల్

ఎక్కడైనా అధికారి బదిలీ అయితే అక్కడ ఉన్న ఉద్యోగస్తులు గాని రాజకీయ నాయకులు గాని ఘనంగా వీడ్కోలు పలుకుతారు. కానీ తాడిపత్రి మున్సిపల్ కమిషనర్ బదిలీపై వెళ్లినప్పుడు టిడిపి కౌన్సిలర్లు కాస్త వినూత్నంగానే వీడ్కోలు పలికారు. తాడిపత్రి మున్సిపల్ కమిషనర్ రవి. ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కనుసన్నల్లో పని చేశారని. ఇవాల్టితో తాడిపత్రి మున్సిపాలిటీకి పట్టిన పీడ విరగడయిందంటూ టిడిపి కౌన్సిలర్లు వినూత్నంగా వీడ్కోలుతో కూడిన నిరసన తెలియజేశారు. తాడిపత్రి మున్సిపల్ కార్యాలయానికి దిష్టి తీసి మున్సిపల్ కమిషనర్ ఛాంబర్‎ను గోమూత్రంతో టిడిపి కౌన్సిలర్లు శుద్ధి చేశారు.

Latest Articles