AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nalluri Naresh

Nalluri Naresh

Senior Correspondent (Anantapur District) - TV9 Telugu

naresh.nalluri@tv9.com

టీవీ9 లో సీనియర్ కరస్పాండెంట్ గా పనిచేస్తున్నారు. 2009లో ఎలక్ట్రానిక్ మీడియాలో జర్నలిస్టుగా ప్రస్థానం ప్రారంభించారు. జర్నలిస్టుగా 15 సంవత్సరాల అనుభవం ఉంది. 2013 నుంచి టీవీ9 సంస్థలో హైదరాబాద్, విజయవాడలో క్రైమ్ రిపోర్టర్ గా పనిచేశారు. క్రైమ్ రిపోర్టర్ గా పనిచేసిన రోజుల్లో అనేక పరిశోధనాత్మక, స్టింగ్ ఆపరేషన్లు చేశారు. ప్రస్తుతం అనంతపురం జిల్లా సీనియర్ కరస్పాండెంట్ గా పని చేస్తున్నారు. అనంతపురం జిల్లాలో రాజకీయ, వర్తమాన, హ్యూమన్ ఇంట్రెస్టింగ్, ఇతర వార్తల సేకరణలో అందరికంటే ముందుండాలని తపన పడతారు.

Read More
పెళ్లైన 11 నెలలకే చెల్లెలు భర్తను చంపిన అన్న.. అసలు విషయం తెలిసి అంతా షాక్!

పెళ్లైన 11 నెలలకే చెల్లెలు భర్తను చంపిన అన్న.. అసలు విషయం తెలిసి అంతా షాక్!

చెల్లెలు కాపురం నిలబడటం కోసం అన్న ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటారు. ఆఖరికి చంపడానికైనా వెనుకాడని అన్నలు ఉన్నారు. చెల్లెలు కాపురం నిలబడటం కోసం ఏం చేసిన పర్వాలేదు కానీ, ఏకంగా చెల్లెలు భర్తనే చంపేస్తే..! ఇంకేం కాపురం నిలబడుతుంది. చెల్లెలిని నిత్యం అనుమానిస్తూ.. వేధింపులకు గురిచేస్తున్నాడని సొంత బావనే కడతేర్చాడు ఓ వ్యక్తి. ఈ విషాద ఘటన శ్రీసత్యసాయి జిల్లాలో వెలుగు చూసింది.

Andhra: ఆయనో తహసీల్దార్.. అన్ని తెలిసినోడే వాడి బుట్టలో పడ్డాడు.. కట్ చేస్తే, ఏపీలోనే సెన్సెషనల్..

Andhra: ఆయనో తహసీల్దార్.. అన్ని తెలిసినోడే వాడి బుట్టలో పడ్డాడు.. కట్ చేస్తే, ఏపీలోనే సెన్సెషనల్..

ఆయనో తాహసీల్దార్.. అతనికి అన్నీ తెలుసు.. కానీ, అతన్నే.. ఏసీబీ అధికారి అంటూ ఓ వ్యక్తి బెదిరించి ఏకంగా.. లక్షలు లక్షలు వసూలు చేశాడు ఓ కేటుగాడు.. తాను ఏసీబీ అధికారినని.. తన అవినీతి చిట్టా అంతా నా దగ్గర ఉందంటూ.. తహసీల్దార్ ను పరిచయం  చేసుకున్నాడు..

కాలనీలో రోడ్డు కోసం సామాన్యుడి వినూత్న నిర్ణయం.. నోరెళ్లబెట్టిన జనం!

కాలనీలో రోడ్డు కోసం సామాన్యుడి వినూత్న నిర్ణయం.. నోరెళ్లబెట్టిన జనం!

సాధారణంగా ఇంటి ముందు డ్రైనేజీ మరమ్మత్తు పనులు ఉన్నా.. కాలనీలో రోడ్లు సరిగా లేకపోయినా అధికారుల దృష్టికి తీసుకెళ్లడం, ప్రజా ప్రతినిధులను నిలదీయడం చూస్తుంటాం. కానీ ఓ వ్యక్తి తమ కాలనీలో కొత్త రోడ్లు వేసేందుకు ఉన్న రోడ్డును తవ్వి గుంతల మయం చేశారు. దీంతో రోడ్డు వేయలేదని వినూత్న నిరసనకు దిగాడు ఓ వ్యక్తి.

Andhra Pradesh: భర్త గ్యాస్ సిలిండర్ తీసుకురావడం లేదని భార్య ఆత్మహత్యాయత్నం.. చివరికి..?

Andhra Pradesh: భర్త గ్యాస్ సిలిండర్ తీసుకురావడం లేదని భార్య ఆత్మహత్యాయత్నం.. చివరికి..?

ఏపీలోని అనంతపురంలో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. గుత్తి మండలం తొండపాడులో ఓ మహిళ భర్త గ్యాస్ సిలిండర్ తెచ్చి ఇవ్వడం లేదని ఆత్మాహత్యాయత్నానికి పాల్పడింది. ఫినాయిల్ తగ్గి ఆత్మహత్య చేసుకోవడానికి యత్నించింది. కానీ వెంటనే కుటుంబసభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లడంతో ప్రమాదం తప్పింది.

Andhra: సుకన్య మామూల్ది కాదు.. నిద్రపోతున్న భర్తను రోకలిబండతో చంపి.. ఏకంగా ఇంట్లోనే..

Andhra: సుకన్య మామూల్ది కాదు.. నిద్రపోతున్న భర్తను రోకలిబండతో చంపి.. ఏకంగా ఇంట్లోనే..

దాదాపు నాలుగు నెలల క్రితం భర్తను రోకలిబండతో కొట్టి చంపి.. శవాన్ని ఇంటి ఆవరణలోనే పూడ్చిపెట్టింది ఆ భార్య.. ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది.. భర్త కనిపించడం లేదని అందరినీ నమ్మించింది.. అయితే.. నాలుగు నెలల క్రితం జరిగిన మర్డర్ ఇప్పుడెలా బయటపడింది? అంటే తండ్రిని.. తన తల్లే చంపిందని.. స్వయంగా కూతురే పోలీసులకు సమాచారం ఇచ్చింది.. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురంలో సంచలనంగా మారింది.

Andhra: ఇలాంటి దుర్మార్గులను ఏం చేయాలి..? కాల్పులతో ఉలిక్కిపడిన అనంతపురం.. అసలేం జరిగిందంటే..

Andhra: ఇలాంటి దుర్మార్గులను ఏం చేయాలి..? కాల్పులతో ఉలిక్కిపడిన అనంతపురం.. అసలేం జరిగిందంటే..

ఆస్తికోసం అత్తమామల మీద కోపంతో.. ఐదేళ్ల బావమరిదిని హత్య చేశాడు ఓ దుర్మార్గుడు.. ఈ షాకింగ్ ఘటన అనంతపురం జిల్లాలోని యాడికి మండలం కోనుప్పలపాడు గ్రామంలో చోటుచేసుకుంది. కేసు నమోదు చేసిన పోలీసులు .. నిందితుడు బావనని గుర్తించారు. నిందితుడు సర్వేష్ ను అదుపులోకి తీసుకుని విచారించి.. ఐదేళ్ల హేమచంద్ర డెడ్ బాడీని గుర్తించారు

Andhra: ఛీ.. ఛీ.. దుర్మార్గుడా.. అత్తమామల మీద కోపంతో అల్లుడు ఏం చేసాడో తెలుసా..?

Andhra: ఛీ.. ఛీ.. దుర్మార్గుడా.. అత్తమామల మీద కోపంతో అల్లుడు ఏం చేసాడో తెలుసా..?

అత్తమామల మీద కోపంతో బావమరిదిని కిడ్నాప్ చేసి అతి దారుణంగా హత్య చేశాడు బావ.. అనంతపురం జిల్లా యాడికి మండలం కోనుప్పలపాడు గ్రామానికి చెందిన ఐదేళ్ల బాలుడు హేమచంద్ర కిడ్నాప్ విషాదంగా ముగిసింది. మెడకు తాడు బిగించి.. రాళ్లతో కొట్టి ఐదేళ్ల బావమరిదిని.. బావ చంపాడు... స్కూల్ బస్సు దిగి ఇంటికి వెళుతున్న బావమరిదిని తినుబండారాలు కొనిస్తానని బైక్ పై ఎక్కించుకొని... తీసుకెళ్లి అటవీ ప్రాంతంలో అతి దారుణంగా హత్య చేయడం కలకలం రేపింది.

ఉరవకొండ చేనేతకు అరుదైన గౌరవం

ఉరవకొండ చేనేతకు అరుదైన గౌరవం

Droupadi Murmu: ఉగాది పండుగ రోజు ఉరవకొండ చేనేతలు నేసిన చీరను కట్టుకుని అయోధ్య రామ మందిరానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వెళ్ళడంతో అరుదైన గౌరవం దక్కిందంటున్నారు చేనేత కార్మికులు. ఆ చీరనే అయోధ్య రామ మందిరంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కనిపించారు

AP News: ఉదయాన్నే గ్రౌండ్‌లో వింత ఆకారం.. దగ్గరికెళ్లి చూసి పరుగో పరుగు.. వీడియో వైరల్..

AP News: ఉదయాన్నే గ్రౌండ్‌లో వింత ఆకారం.. దగ్గరికెళ్లి చూసి పరుగో పరుగు.. వీడియో వైరల్..

అది తెల్లవారుజాము సమయం.. ఎప్పటిలాగే వాకింగ్ చేసేందుకు జనం గ్రౌండ్‌కు చేరుకున్నారు. అంతా ప్రశాంతంగా ఉందనుకుంటున్న తరుణంలో ఒక్కసారిగా అక్కడ ప్రత్యక్షమైన ఆ అతిథిని చూసి అందరి గుండెలు ఆగిపోయినంత పనైంది. రాయదుర్గం ప్రభుత్వ జూనియర్ కాలేజీ గ్రౌండ్‌లో ఎలుగుబంటి హల్చల్ వీడియో వైరల్‌గా మారింది.

దవాఖానా? లేదంటే దగాఖానా? ఓ ప్రయివేటు ఆస్పత్రి నిర్వాకంపై సామాన్యుడి పోరుబాట!

దవాఖానా? లేదంటే దగాఖానా? ఓ ప్రయివేటు ఆస్పత్రి నిర్వాకంపై సామాన్యుడి పోరుబాట!

దవాఖానా? లేదంటే దగాఖానా? ఓ ప్రయివేటు ఆస్పత్రిపై సామాన్యుడు పోరుబాటపట్టాడు. డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే తన భార్య కోమాలోకి వెళ్లిందన్నాడు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ పోరాడుతున్నారు. న్యాయం చేయాల్సిన అధికారులు ఫిర్యాదు చేస్తే నిర్లక్ష్యంగా వ్యవహారిస్తున్నారంటూ.. జిల్లా కలెక్టరేట్ ముందు వినూత్న రీతిలో ఆందోళనకు దిగాడు.

అయ్యో.. ఎంత పని జరిగింది.. మరికాసేపట్లో హైదరాబాద్ బస్సు ఎక్కాల్సినోడు..!

అయ్యో.. ఎంత పని జరిగింది.. మరికాసేపట్లో హైదరాబాద్ బస్సు ఎక్కాల్సినోడు..!

పని నిమిత్తం మరికాసేపట్లో హైదరాబాద్ బస్సు ఎక్కాల్సిన యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. మద్యం మత్తులో జరిగిన గొడవలో.. అనంతపురం బస్టాండ్ సమీపంలో యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. హఠాత్తు పరిణామంతో షాకైన కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Andhra: 20 విజిల్స్ వచ్చినా మటన్ ఉడకలేదు సార్.. పోలీసులకు వ్యక్తి ఫిర్యాదు

Andhra: 20 విజిల్స్ వచ్చినా మటన్ ఉడకలేదు సార్.. పోలీసులకు వ్యక్తి ఫిర్యాదు

వెయ్యి ఖర్చు చేసి కొనుగోలు చేసిన మటన్ ఉడకకపోవడంతో ఆగ్రహించిన ఓ వ్యక్తి ఏకంగా పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాడు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో జరిగిన ఈ విచిత్ర ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. కుక్కర్‌లో ఎన్నిసార్లు ఉడికించినా మటన్ మెత్తబడకపోవడంతో, దుకాణదారుడిపై చర్యలు తీసుకోవాలని బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.