టీవీ9 లో సీనియర్ కరస్పాండెంట్ గా పనిచేస్తున్నారు. 2009లో ఎలక్ట్రానిక్ మీడియాలో జర్నలిస్టుగా ప్రస్థానం ప్రారంభించారు. జర్నలిస్టుగా 15 సంవత్సరాల అనుభవం ఉంది. 2013 నుంచి టీవీ9 సంస్థలో హైదరాబాద్, విజయవాడలో క్రైమ్ రిపోర్టర్ గా పనిచేశారు. క్రైమ్ రిపోర్టర్ గా పనిచేసిన రోజుల్లో అనేక పరిశోధనాత్మక, స్టింగ్ ఆపరేషన్లు చేశారు. ప్రస్తుతం అనంతపురం జిల్లా సీనియర్ కరస్పాండెంట్ గా పని చేస్తున్నారు. అనంతపురం జిల్లాలో రాజకీయ, వర్తమాన, హ్యూమన్ ఇంట్రెస్టింగ్, ఇతర వార్తల సేకరణలో అందరికంటే ముందుండాలని తపన పడతారు.
Watch: తమ్ముడు సీన్ రిపీట్.. 100 కార్లు, 100 బైకులతో అన్నదమ్ముల ఒళ్ళు గగ్గురు పొడిచే సాహసాలు!
సినిమాల్లో హీరోలు చేసే సాహస విన్యాసాలను చూసి మనం రోమాంచితం అవుతాం. తమ్ముడు సినిమాలో పవన్ కళ్యాణ్ చేతులపై నుండి కార్లు వెళ్లే సీన్ చూసి థియేటర్లలో అందరూ నోరెళ్లబెట్టారు. సరిగ్గా అలాంటి కళ్ళు చెదిరే, ఒళ్ళు గగ్గురు పొడిచే నిజజీవిత సాహస ఘట్టాలు అనంతపురం జిల్లాలో ఆవిష్కృతమయ్యాయి. తాడిపత్రి పట్టణానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములు తమ అసాధారణ ప్రతిభతో, గుండె నిబ్బరంతో చూసే ప్రతి ఒక్కరినీ అబ్బురపరిచారు.
- Nalluri Naresh
- Updated on: Jun 14, 2026
- 6:12 pm
Andhra News: బియ్యం కావాలని షాప్కు వచ్చాడు.. రూ.10వేలు UPI చేసి వెళ్లిపోయాడు.. సీన్కట్ చేస్తే..
డిజిటల్ చెల్లింపుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు ఎన్ని సార్లు హెచ్చరించినా.. ప్రజలు మళ్లీ మోసపోతూనే ఉన్నారు.. చేసిన పేమెంట్ పూర్తిగా అయ్యిందా లేదా అని నిర్ధారించుకోకుండా నష్టపోతున్నారు. ముఖ్యంగా UPI చెల్లింపుల ద్వారా జరిగే ట్రాన్సాక్షన్స్తో చాలా మంది వ్యాపారులు డబ్బులు కోల్పోతున్నారు. తాజాగా మరోసారి ఇలాంటి ఓ ఘటన వెలుగు చూసింది. యూపీఐ చేశానంటూ.. ఓ కేటుగాడు వ్యాపారికి రూ.10 వేల కుచ్చుటోపి పెట్టాడు.
- Nalluri Naresh
- Updated on: Jun 14, 2026
- 11:01 am
పెళ్లి పత్రికలో సైబర్ మోసాల హెచ్చరికలు.. అనంతపురం తండ్రి వినూత్న ఆలోచనకు ప్రశంసల వెల్లువ!
పెళ్లి పత్రిక అంటే కేవలం ఆహ్వానం మాత్రమే అనుకునే వారికి అనంతపురం జిల్లాకు చెందిన నాగళ్లు రాజా కొత్త సందేశం ఇచ్చారు. తన కుమారుడి వివాహ పత్రికలో డిజిటల్ అరెస్ట్, ఫేక్ లోన్ యాప్స్, పార్ట్టైమ్ జాబ్ ఫ్రాడ్స్ వంటి సైబర్ మోసాలపై అవగాహన సందేశాలను ముద్రించి వేలాది మందికి చేరవేశారు. ఈ వినూత్న ప్రయత్నానికి పోలీసులతో పాటు ప్రజల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి.
- Nalluri Naresh
- Updated on: Jun 13, 2026
- 7:27 pm
ATM: ఎంతకు తెగించార్రా..? ఏటీఎం మెషిన్ ఎత్తుకెళ్లేందుకు యత్నం.. బెడిసికొట్టిన ప్లాన్..!
ATM: రెండు నెలల క్రితం సరిగ్గా ఇలాగే ధర్మవరంలో కూడా కొంతమంది దుండగులు బొలెరో టెంపో వాహనంలో వచ్చి ఎస్బిఐ ఎటిఎం మెషిన్ ను తాడుతో కట్టి లాక్కెళ్ళి, రాప్తాడు సమీపంలో ఏటీఎం మెషిన్ పగలగొట్టి మెషిన్ అక్కడే వదిలేసి డబ్బులు ఎత్తుకెళ్లారు..
- Nalluri Naresh
- Updated on: Jun 13, 2026
- 11:03 am
Andhra Pradesh: మీరేం మనుషులురా.. రూ.20 కోసం చిల్లర గొడవ.. కాపాడడానికి వెళ్తే కొట్టి చంపేశారు..
మద్యం మత్తు.. మనుషుల ప్రాణాలకు విలువే లేకుండా చేస్తోంది. కేవలం 20 రూపాయల చిల్లర గొడవ.. ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. గొడవను ఆపబోయినందుకు.. సాటి మనిషిని అక్కడికక్కడే కొట్టి చంపేశారు. అసలు గొడవ ఎలా మొదలైంది.. ఏం జరిగింది..? అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..
- Nalluri Naresh
- Updated on: Jun 13, 2026
- 10:24 am
పోలీస్ అని నమ్మి కారు ఇచ్చాడు.. 3 నెలల తర్వాత బయటపడిన అసలు కథ!
అతను కాకి యూనిఫామ్ వేసుకుంటే అచ్చం పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ మాదిరే ఉన్నాడు. మాట్లాడితే చాలు లాండ్ ఆర్డర్ అంటూ లెక్కలు చెప్తాడు. మీకు నామీద నమ్మకం లేదా. అయితే వాట్సాప్ లో పోలీస్ డ్రెస్ లో ఉన్న ఫోటో పంపిస్తాడు. అచ్చం పోలీసులానే ఉన్న. నకిలీ పోలీసులను నమ్మి అనంతపురం జిల్లాలో మోసపోయిన బాధితులు. అసలు పోలీసులు వద్దకు వెళ్లి తమ గోడు వెళ్ళగక్కారు... అర్జెంటుగా కారు అద్దెక్కి కావాలని. కారును అద్దెకి తీసుకొని... ఉడాయించి... ఎంచక్కా కార్లో చెక్కర్లు కొడుతున్న ఫేక్ ఎస్ఐ ని పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు..
- Nalluri Naresh
- Updated on: Jun 10, 2026
- 8:12 pm
ఎందుకు మహాలక్ష్మి ఇలా చేశావ్.. అప్పుల బాధతో కన్న పిల్లలకు విష గుళికలు ఇచ్చి..
శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మండలం ఎం. బీరేపల్లి గ్రామంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. అప్పుల ఒత్తిడిని తట్టుకోలేక ఓ మహిళ తన ఇద్దరు పిల్లలకు విషం కలిపిన ఆహారం తినిపించి, తాను కూడా ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆస్పత్రికి తరలిస్తుండగా తల్లి మహాలక్ష్మి, కుమారుడు రిషిత్ మృతి చెందగా, కుమార్తె శ్రీనిధి అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ విషాద ఘటన గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
- Nalluri Naresh
- Updated on: Jun 3, 2026
- 3:16 pm
వీళ్ళు కదా నిజమైన స్నేహితులు.. చనిపోయిన దోస్త్ జ్ఞాపకార్థం ఏం చేశారో తెలుసా?
స్నేహం అంటే కలిసి తిరగడం, సరదాగా గడపడమే కాదు.. ఒకరి కష్టసుఖాలలో తోడుండటం, ఒకరు దూరమైతే వారి జ్ఞాపకాలను సమాజానికి ఉపయోగపడేలా సజీవంగా ఉంచడం. సరిగ్గా ఇదే నిరూపించారు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణానికి చెందిన కొందరు యువకులు. రోడ్డు ప్రమాదంలో తమ ప్రియమైన స్నేహితుడిని కోల్పోయిన ఆ మిత్ర బృందం, ఆ బాధలోంచి సమాజానికి మేలు చేసే ఒక గొప్ప సంకల్పానికి శ్రీకారం చుట్టింది.
- Nalluri Naresh
- Updated on: May 29, 2026
- 11:45 am
బంగారం దొరుతుందని కొండల్లో తవ్వకాలు.. అక్కడికెళ్లి చూసిన పోలీసులకు షాకింగ్ సీన్..!
ఏపీలోని సత్యసాయి జిల్లా పులిగుండ్లపల్లి గ్రామ శివారులో ఉన్న అటవీ ప్రాంతంలో గుప్తనిధుల కోసం కొందరు రహస్యంగా తవ్వకాలు చేపట్టిన ఘటన కలకలం రేపింది. సమాచారం ప్రకారం, రెండు కార్లలో ఎనిమిది మంది వ్యక్తులు తవ్వకాలకు అవసరమైన పనిముట్లతో అక్కడికి చేరుకుని గుప్తనిధుల కోసం తవ్వకాలు ప్రారంభించారు. అడవి ప్రాంతంలో అనుమానాస్పద శబ్దాలు వినిపించడంతో అప్రమత్తమైన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
- Nalluri Naresh
- Updated on: May 28, 2026
- 4:03 pm
Andhra Pradesh: ప్రేమిస్తున్నానంటూ వేధింపులు.. యువకుడికి అరగుండు కొట్టించి ఊళ్లో ఊరేగింపు..
ప్రేమ పేరుతో వేధిస్తున్న యువకుడికి కుటుంబసభ్యులు దేహశుద్ది చేశారు. అరగుండు కొట్టించి ఊరేగించారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అనంతపురం జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. యువకుడి కుటుంబసభ్యులు పోలీసులు ఇంకా ఫిర్యాదు చేయలేదని తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే..
- Nalluri Naresh
- Updated on: May 20, 2026
- 6:08 pm
Andhra Pradesh: మోసగాళ్లకే మోసగాళ్లు.. వీళ్ల స్కెచ్ మామూలుగా లేదుగా.. వీడియో చూస్తే నోరెళ్లబెడతారు..
మోసగాడికి మోసగాడు.. వీడు వాడికి మొగుడు.. ఒక లక్ష ఇస్తే పది లక్షల నకిలీ కరెన్సీ ఇస్తామంటూ బురిడీ కొట్టించే ముఠాలు చాలానే ఉంటాయి. కానీ వీళ్లు ఏకంగా నకిలీ నోట్ల పేరుతో బొమ్మ నోట్లు అంటగట్టి అసలు నోట్లు కాజేశారు. నకిలీ కరెన్సీ కోసం ఆశగా వచ్చిన వారిని టాయ్ కరెన్సీతో ఆడుకున్న ఈ ముఠా గుట్టును లేపాక్షి పోలీసులు రట్టు చేశారు.
- Nalluri Naresh
- Updated on: May 18, 2026
- 10:25 pm
షాపులు, బేకరీల్లో తనిఖీలు చేసిన ఫుడ్ సేఫ్టీ అధికారులు.. చివరికి షాకింగ్ ట్విస్ట్!
Fake Food Safety Officials: అనంతపురం జిల్లా బెలుగుప్ప మండలంలో నకిలీ ఫుడ్ సేఫ్టీ అధికారులమంటూ ఐదుగురు మహిళలు దుకాణాలు, బేకరీల్లో తనిఖీలు చేసి ఫైన్లు వేసి డబ్బులు వసూలు చేశారు. మెడలో ఐడీ కార్డులు ధరించి “ఫుడ్ సేఫ్టీ సర్వీసెస్ గుంటూరు” పేరుతో రసీదులు కూడా ఇచ్చినట్లు సమాచారం. పలువురు షాపుదారుల నుంచి డబ్బులు తీసుకుని మహిళలు పరారయ్యారు.
- Nalluri Naresh
- Updated on: May 17, 2026
- 1:34 pm