టీవీ9 లో సీనియర్ కరస్పాండెంట్ గా పనిచేస్తున్నారు. 2009లో ఎలక్ట్రానిక్ మీడియాలో జర్నలిస్టుగా ప్రస్థానం ప్రారంభించారు. జర్నలిస్టుగా 15 సంవత్సరాల అనుభవం ఉంది. 2013 నుంచి టీవీ9 సంస్థలో హైదరాబాద్, విజయవాడలో క్రైమ్ రిపోర్టర్ గా పనిచేశారు. క్రైమ్ రిపోర్టర్ గా పనిచేసిన రోజుల్లో అనేక పరిశోధనాత్మక, స్టింగ్ ఆపరేషన్లు చేశారు. ప్రస్తుతం అనంతపురం జిల్లా సీనియర్ కరస్పాండెంట్ గా పని చేస్తున్నారు. అనంతపురం జిల్లాలో రాజకీయ, వర్తమాన, హ్యూమన్ ఇంట్రెస్టింగ్, ఇతర వార్తల సేకరణలో అందరికంటే ముందుండాలని తపన పడతారు.
ఆంధ్ర అరుణాచలం.. దక్షిణ కాశీ! కుందుర్పమ్మ కొండలో ఆధ్యాత్మికతతో పాటు ఎన్నో చారిత్రక విశేషాలు
Kundurpi Kundurupamma Temple Histery Telugu: ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా కుందుర్పి ప్రకృతి అందాలు, ఆధ్యాత్మిక విశిష్టత, చారిత్రక ఆనవాళ్లకు ప్రసిద్ధి. ఆంధ్ర అరుణాచలం, దక్షిణ కాశీగా పేరొందిన కుందుర్పమ్మ కొండపై ప్రతి పౌర్ణమికి గిరి ప్రదక్షిణ నిర్వహిస్తారు. సహజసిద్ధమైన కొలనులు, పురాతన మండపం, ధాన్యాగారం వంటి ఎన్నో ప్రత్యేకతలు ఈ ప్రాంతాన్ని మరింత ఆకర్షణీయంగా మారుస్తున్నాయి.
- Nalluri Naresh
- Updated on: Aug 31, 2026
- 11:47 am
వర్షాల కోసం ఊరంతా ఒక్కటై వనభోజనాలు.. ఈ వింత ఆచారం ఎక్కడో తెలుసా?
వర్షాలు సమృద్ధిగా కురవాలని అనంతపురం జిల్లాలోని ఓ గ్రామంలో గ్రామస్తులంతా కలిసి వనభోజనాలకు వెళ్లే వింత ఆచారం కొనసాగుతోంది. కళ్యాణదుర్గం నియోజకవర్గం బోరంపల్లిలో పూర్వీకుల కాలం నుంచి ఈ సంప్రదాయం పాటిస్తున్నారు. ఇళ్లకు తాళాలు వేసుకుని మేళతాళాలతో ఊరేగింపుగా ఊరి శివారుకు వెళ్లి..
- Nalluri Naresh
- Updated on: Aug 29, 2026
- 7:09 pm
Andhra: శుభమా అని కొత్త ఇల్లు కట్టుకొని గృహ ప్రవేశం చేయాలనుకుంటే.. ఇంటి ముందు
సొంతింటి కల నెరవేరకముందే షాక్.. గృహప్రవేశానికి ముందే కొత్తింట్లో క్షుద్ర పూజలు.. బొగ్గుతో ముగ్గులు, పసుపు, కుంకుమ, రక్తపు ఆనవాళ్లు.. అర్ధరాత్రి ఇంట్లోకి ప్రవేశించి పూజలు చేసిన గుర్తుతెలియని వ్యక్తులు.. భయాందోళనలో కుటుంబ సభ్యులు.. అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం ఆమిద్యాలలో కలకలం.. పూర్తి వివరాలు కథనంలో ..
- Nalluri Naresh
- Updated on: Aug 29, 2026
- 6:27 pm
Andhra Pradesh: 6869 ఊడలు.. 8.5 ఎకరాల విస్తీర్ణం.. రాత్రైతే పక్షి కూడా వాలని తిమ్మమ్మ మర్రిమాను రహస్యాలు తెలిస్తే..
ఒకే ఒక్క చెట్టు.. ఏకంగా ఎనిమిదిన్నర ఎకరాల విస్తీర్ణం.. 6 వేలకు పైగా ఊడలు.. వినడానికే ఎంతో ఆశ్చర్యంగా ఉన్న ఈ ప్రకృతి వింత ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లాలో కొలువై ఉంది. 660 ఏళ్లకు పైగా చరిత్ర కలిగి, ప్రపంచంలోనే అతిపెద్ద వృక్షంగా గిన్నిస్ రికార్డుల్లోకెక్కిన తిమ్మమ్మ మర్రిమాను వెనుక ఉన్న అద్భుతమైన విశేషాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం..
- Nalluri Naresh
- Updated on: Aug 29, 2026
- 1:47 pm
Andhra Pradesh: మనిషి రూపంలో శివుడు.. పక్కకు చూసే నంది.. ఈ అద్భుత ఆలయం వీడియో చూస్తే..
ఏ గుడిలో చూసిన శివుడు లింగరూపంలోనే దర్శనమిస్తాడు. కానీ ఆ ఒక్క ఆలయంలో మాత్రం ఆ దేవదేవుడు సాక్షాత్తు సిద్ధాసనంలో కూర్చున్న ఒక మహాయోగిలా.. మానిషి రూపంలో దర్శనమిచ్చే అత్యంత అరుదైన పుణ్యక్షేత్రం గురించి మీకు తెలుసా? అది కూడా ఏపీలోనే ఉండడం గమనార్హం. ఆ అద్భుత ఆలయం గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం..
- Nalluri Naresh
- Updated on: Aug 27, 2026
- 12:09 pm
వింత ఆచారం.. వర్షాల కోసం గాడిదలకు పెళ్లి చేసి భోజనాలు పెట్టిన గ్రామస్తులు
వర్షాకాలం మొదలై రెండు నెలలు గడుస్తున్నా.. తెలుగురాష్ట్రాల్లో పెద్దగా వర్షాలు కురువడం లేదు. దీంతో వర్షాలు లేక చాలా గ్రామాల్లో పంట పొలాలు ఎండిపోతున్నాయి. ఈ కరువు పరిస్థితి చూసి తట్టుకోలేక రైతులు పురాతన ఆచారాలను పాటిస్తున్నారు. ఇందులో భాగంగానే అనంతపురం జిల్లాలోని పాల్తూరులో రైతులు వర్షాల కోసం గాడిదలకు వివాహం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇలా గాడిదలకు పూజలు చేస్తూ వరుణ దేవుడు కరుణించి వర్షాలు కురుస్తాయని స్థానిక ప్రజల ప్రగాడ నమ్మకం.
- Nalluri Naresh
- Updated on: Aug 26, 2026
- 8:25 pm
రూ. 1.5 కోట్ల స్కాలర్షిప్తో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి ఎంపికైన ఏకైక భారతీయ విద్యార్థిని ఫాతిమా!
ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లా గుంతకల్లుకు చెందిన అనీష్ ఫాతిమా అనే విద్యార్థిని ప్రపంచ ప్రఖ్యాత ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో అడ్వాన్స్డ్ కంప్యూటేషనల్ న్యూరోసైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ కోర్సులో సీటు సాధించి అరుదైన ఘనత సాధించింది. 2025-26 విద్యా సంవత్సరానికి గాను 120 దేశాల విద్యార్థులు పాల్గొన్న ఈ పోటీలో భారతదేశం నుంచి ఎంపికైన ఏకైక యువతిగా నిలిచింది.
- Nalluri Naresh
- Updated on: Aug 21, 2026
- 7:53 pm
ప్రైవసీ కోసం అడవిలోకి ప్రేమజంట.. ఒక్కసారిగా అరుపులు! గొర్లకాపర్లు వచ్చి చూసేసరికి..
శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మండలం బత్తలపల్లి తండా అటవీ ప్రాంతంలో ప్రేమజంటకు ప్రమాదం జరిగింది. ఏకాంతంగా గడిపేందుకు అక్కడికి వెళ్లిన ఫయాజ్, మల్లీశ్వరిపై ఒక్కసారిగా విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. విద్యుత్ షాక్తో ఫయాజ్కు తీవ్ర గాయాలు కాగా, మల్లీశ్వరికి స్వల్ప గాయాలయ్యాయి. అరుపులు విన్న గొర్రెల కాపరులు పోలీసులకు సమాచారం అందించారు.
- Nalluri Naresh
- Updated on: Aug 20, 2026
- 8:08 pm
Andhra Pradesh: తండ్రి కొత్త మొబైల్ కొనివ్వలేదని… కొడుకు ఆత్మహత్య.. పోలీసుల కేసు నమోదు..
తండ్రి కొత్త మొబైల్ కొనివ్వలేదని కొడుకు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన శ్రీ సత్యసాయి జిల్లాలో చోటుచేసుకుంది. ఇటీవల కుమారుడికి తండ్రి కొత్త ఫోన్ ఫోన్ కొనిచ్చాడు. అయితే కుమారుడు దానిన పొగోట్టుకోగా.. మరో కొనివ్వాలని తండ్రిని కోరాడు. కానీ తండ్రి కొనివ్వకపోవడంతో..
- Nalluri Naresh
- Updated on: Aug 20, 2026
- 2:58 pm
Andhra Pradesh: పుష్ప లెవల్ స్కెచ్ సామీ.. లారీలోనే వైన్స్ పెట్టేశారు.. వీడియో చూస్తే అవాక్కవ్వాల్సిందే..
సినిమాలో పుష్పరాజ్ పాల ట్యాంకర్లో ఎర్రచందనం దాస్తే.. ఇక్కడ ఘరానా స్మగ్లర్లు లారీ క్యాబిన్లో స్పెషల్ బాక్సులు పెట్టి గోవా మద్యాన్ని సరిహద్దులు దాటించారు. సినిమాను మించిన ప్లాన్తో వచ్చిన ఈ ముఠా గుట్టును అనంతపురం పోలీసులు చాకచక్యంగా రట్టు చేశారు. దీనికి సంబంధించిన వివరాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం..
- Nalluri Naresh
- Updated on: Aug 18, 2026
- 11:06 am
Andhra News: 1500 గొర్రెలతో MRO ఆఫీస్ను ముట్టడించిన కాపర్లు.. కారణం తెలిస్తే..
పశువులకు మేత దొరకకపోతే ప్రత్యామ్నాయాలు వెతుక్కోవడం సాధారణం. కానీ, ఇక్కడి గొర్రెల కాపరులు మాత్రం తమ సమస్య పరిష్కారం కోసం వినూత్న రీతిలో నిరసనకు దిగారు. జీవాలకు పచ్చిగడ్డి దొరకడం లేదంటూ ఏకంగా వందలాది గొర్రెలతో తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈఘటన ఘటన శ్రీసత్యసాయి జిల్లా అమరాపురంలో చోటుచేసుకుంది.
- Nalluri Naresh
- Updated on: Aug 17, 2026
- 2:11 pm
బెలుగుప్పలో అద్భుత దృశ్యం.. 80 శాతం నీటిలో మునిగి వేద పండితుల వరుణ యాగం!
బెలుగుప్పలో వర్షాలు సమృద్ధిగా కురవాలని ఆకాంక్షిస్తూ ప్రత్యేక వరుణ యాగం నిర్వహించారు. బెలుగుప్ప మండల కేంద్రంలోని శ్రీ రామేశ్వరస్వామి ఆలయంలో లోకకల్యాణం కోసం శాస్త్రోక్తంగా ఈ యాగాన్ని చేపట్టారు. యాగంలో భాగంగా 11 మంది వేద పండితులు నీటిలో కూర్చొని వేద పారాయణం చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
- Nalluri Naresh
- Updated on: Aug 11, 2026
- 1:17 pm