AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nalluri Naresh

Nalluri Naresh

Senior Correspondent (Anantapur District) - TV9 Telugu

naresh.nalluri@tv9.com

టీవీ9 లో సీనియర్ కరస్పాండెంట్ గా పనిచేస్తున్నారు. 2009లో ఎలక్ట్రానిక్ మీడియాలో జర్నలిస్టుగా ప్రస్థానం ప్రారంభించారు. జర్నలిస్టుగా 15 సంవత్సరాల అనుభవం ఉంది. 2013 నుంచి టీవీ9 సంస్థలో హైదరాబాద్, విజయవాడలో క్రైమ్ రిపోర్టర్ గా పనిచేశారు. క్రైమ్ రిపోర్టర్ గా పనిచేసిన రోజుల్లో అనేక పరిశోధనాత్మక, స్టింగ్ ఆపరేషన్లు చేశారు. ప్రస్తుతం అనంతపురం జిల్లా సీనియర్ కరస్పాండెంట్ గా పని చేస్తున్నారు. అనంతపురం జిల్లాలో రాజకీయ, వర్తమాన, హ్యూమన్ ఇంట్రెస్టింగ్, ఇతర వార్తల సేకరణలో అందరికంటే ముందుండాలని తపన పడతారు.

Read More
అరటితోటలో వెళుతుండగా వింత శబ్ధాలు.. దగ్గరికి వెళ్లి చూడగా గుండె ఆగిపోయేలా ఆకారం..! వీడియో ఇదిగో..

అరటితోటలో వెళుతుండగా వింత శబ్ధాలు.. దగ్గరికి వెళ్లి చూడగా గుండె ఆగిపోయేలా ఆకారం..! వీడియో ఇదిగో..

Anantapur Python: అనంతపురం జిల్లా యల్లనూరు మండలం దంతెరపల్లిలో అరటి తోటలో 15 అడుగుల భారీ కొండచిలువ కలకలం రేపింది. పామును చూసిన కూలీలు, రైతు భయంతో పరుగులు తీశారు. స్నేక్ క్యాచర్ మధుసూదన్ రెడ్డి అతి కష్టం మీద కొండచిలువను పట్టుకుని అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు.

వింత ఆచారం.. కుక్కకు అన్నం వండి పెట్టి, అదే భోజనం గ్రామస్థులంతా తింటారు! ఎందుకంటే?

వింత ఆచారం.. కుక్కకు అన్నం వండి పెట్టి, అదే భోజనం గ్రామస్థులంతా తింటారు! ఎందుకంటే?

అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం కొట్టాలపల్లిలో వర్షం కోసం వింత ఆచారం నిర్వహించారు. కుక్కను కాటమరాయుడి ప్రతిరూపంగా భావించి పసుపు, కుంకుమ, పూలమాలతో పూజించారు. ప్రత్యేకంగా వండిన భోజనాన్ని నైవేద్యంగా పెట్టి కుక్కకు తినిపించారు. అనంతరం అదే భోజనాన్ని గ్రామస్తులు ప్రసాదంగా భావించి కలిసి తిన్నారు.

ఉద్యోగం పేరుతో జార్ఖండ్ నుంచి బావను పిలిపించారు.. ఏపీలో దారుణ హత్య.. కారణం ఇదే!

ఉద్యోగం పేరుతో జార్ఖండ్ నుంచి బావను పిలిపించారు.. ఏపీలో దారుణ హత్య.. కారణం ఇదే!

అక్కను వేధిస్తున్నాడనే కక్షతో జార్ఖండ్‌కు చెందిన వ్యక్తిని ఉద్యోగం ఇప్పిస్తామని శ్రీ సత్యసాయి జిల్లాకు పిలిపించిన ఐదుగురు బావమరుదులు.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి బండరాళ్లతో దారుణంగా హత్య చేశారు. అనుమానాస్పద మృతి కేసును ఛేదించిన పోలీసులు ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు.

Andhra Pradesh: మద్యం మత్తులో భలే పని చేసిండు.. ఊరెళ్లాలనే తొందరలో ఆర్టీసీ బస్సే ఎత్తుకెళ్లాడు!

Andhra Pradesh: మద్యం మత్తులో భలే పని చేసిండు.. ఊరెళ్లాలనే తొందరలో ఆర్టీసీ బస్సే ఎత్తుకెళ్లాడు!

శ్రీ సత్యసాయి జిల్లాలో ఓ విచిత్ర ఘటన చోటుచేసుకుంది. అర్ధరాత్రి మదనపల్లి వెళ్లేందుకు బస్సు దొరకకపోవడంతో మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి ఏకంగా రోడ్డు పక్కన నిలిపి ఉంచిన ఆర్టీసీ హయర్ బస్సును దొంగిలించి వెళ్లిపోయాడు. ఈ ఘటన కదిరి పట్టణంలో కలకలం రేపింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు సాంకేతిక ఆధారాలతో బస్పును ఛేదించారు.

Andhra: ప్రియుడి మర్మాంగాన్ని కోసిన వివాహిత.. అనంతపురంలో కలకలం

Andhra: ప్రియుడి మర్మాంగాన్ని కోసిన వివాహిత.. అనంతపురంలో కలకలం

అనంతపురం డ్రైవర్స్ కాలనీలో వివాహేతర సంబంధం నేపథ్యంలో తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. ప్రియుడు నరేశ్ తన కుమార్తెతో అసభ్యంగా ప్రవర్తించాడనే ఆరోపణలతో ఆగ్రహించిన వివాహిత అతడిపై దాడి చేసి మర్మాంగాన్ని కోసినట్లు సమాచారం. తీవ్ర గాయాలైన నరేశ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా, ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

డీజిల్ దొంగతనం చేసి పారిపోతుండగా రోడ్డు ప్రమాదం.. సజీవ దహనమైన డీజిల్ దొంగ

డీజిల్ దొంగతనం చేసి పారిపోతుండగా రోడ్డు ప్రమాదం.. సజీవ దహనమైన డీజిల్ దొంగ

డీజిల్ దొంగతనం చేసి పారిపోతుండగా అనంతపురం జిల్లా గుత్తి సమీపంలో కారు లారీని ఢీకొట్టింది. డీజిల్ క్యాన్లు లీక్ కావడంతో కారులో మంటలు చెలరేగి డ్రైవర్ సజీవ దహనమయ్యాడు. ఇద్దరు నిందితులు పరారవగా, డీజిల్ దొంగతనమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.

ట్రైన్ ఇంజన్‌లో టార్చ్ లైట్ వేసి చెక్ చేసిన లోకో పైలట్.. మనిషి తల చూసి దెబ్బకు షాక్..

ట్రైన్ ఇంజన్‌లో టార్చ్ లైట్ వేసి చెక్ చేసిన లోకో పైలట్.. మనిషి తల చూసి దెబ్బకు షాక్..

శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం రైల్వే స్టేషన్‌లో రైలు బయలుదేరే ముందు నిర్వహించిన తనిఖీల్లో లోకో పైలట్‌కు షాకింగ్ ఘటన ఎదురైంది. టార్చ్‌లైట్‌తో ఇంజన్‌ను పరిశీలిస్తుండగా ముందు భాగంలో మనిషి తల ఇరుక్కొని ఉండటాన్ని గుర్తించి వెంటనే రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు.

Andhra Pradesh: మా దగ్గర మహిమగల రాగి చెంబులు ఉన్నాయి.. మీ ఇంట్లో ఉంటే డబ్బే డబ్బు.. కట్‌చేస్తే..

Andhra Pradesh: మా దగ్గర మహిమగల రాగి చెంబులు ఉన్నాయి.. మీ ఇంట్లో ఉంటే డబ్బే డబ్బు.. కట్‌చేస్తే..

రాగి చెంబు దగ్గరకు టార్చ్ లైట్ తీసుకెళ్తే లైట్ ఆగిపోతుందా..? దీన్నే ఏదో అద్భుత మహిమ అనుకుని నమ్మితే మీరు నిలువునా మునిగిపోయినట్లే..మహిమగల రాగి చెంబుల పేరిట అమాయకులను ముంచేందుకు ప్లాన్ చేసిన ఒక కేటుగాళ్ల ముఠా గుట్టును శ్రీ సత్యసాయి జిల్లా పోలీసులు రట్టు చేశారు. వీళ్లు ప్రజలను ఎలా బురిడీ కొట్టిస్తున్నారో తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే

Andhra: అదీ లెక్క.. స్మశానం కోసం ఊరు ఊరంతా ఏకమై ఏం చేశారంటే..?

Andhra: అదీ లెక్క.. స్మశానం కోసం ఊరు ఊరంతా ఏకమై ఏం చేశారంటే..?

Andhra Pradesh News: శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలం కోనతట్టుపల్లి గ్రామంలో స్మశాన వాటిక లేక ఇబ్బందులు పడుతున్న గ్రామస్తులు మృతదేహంతో తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. వారం రోజుల్లో స్మశాన స్థలం కేటాయించకపోతే ఇకపై మృతదేహాలను కార్యాలయం ఎదుటే వదిలేస్తామని అధికారులకు అల్టిమేటం ఇచ్చారు.

పుణ్యదంపతులు.. మరణంలోనూ విడిపోని జంట.. కడవరకు కలిసే’పోయారు’!

పుణ్యదంపతులు.. మరణంలోనూ విడిపోని జంట.. కడవరకు కలిసే’పోయారు’!

శ్రీ సత్యసాయి జిల్లా రొళ్ల మండలం రత్నగిరి గ్రామంలో నెలకొన్న విషాద ఘటన అందరినీ ఆశ్చర్యపోయేలా చేసింది. జీవితాంతం ఒకరికొకరు తోడునీడగా నిలిచిన వృద్ధ దంపతులు 95 ఏళ్ల మల్లప్ప, 88 ఏళ్ల లింగమ్మ మరణంలోనూ విడిపోలేదు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న భర్త మల్లప్ప ముందుగా కన్నుమూయగా, ఆ వియోగాన్ని తట్టుకోలేక భార్య లింగమ్మ కేవలం ఐదు నిమిషాల వ్యవధిలోనే గుండె ఆగి ప్రాణాలు విడిచారు. తొమ్మిది పదుల వయస్సులోనూ ఒకే రోజు, ఒకే సమయంలో తనువు చాలించిన ఈ ఆదర్శ జంటను చూసి స్థానికులు కన్నీరు మున్నీరవుతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

Video: పీఠాధిపతికి కన్నీటి వీడ్కోలు పలికిన ఏనుగు.. అనంతపురంలో ఆసక్తికర ఘటన

Video: పీఠాధిపతికి కన్నీటి వీడ్కోలు పలికిన ఏనుగు.. అనంతపురంలో ఆసక్తికర ఘటన

అనంతపురం జిల్లా ఉరవకొండ గవి మఠంలో పీఠాధిపతి శివైక్యం చెందగా, ఆస్థాన ఏనుగు గజలక్ష్మి తన దుఃఖాన్ని విలక్షణంగా వ్యక్తం చేసింది. స్వామి అంతిమ యాత్రలో పూల మాల సమర్పించి, తల ఆడిస్తూ, కన్నీరు పెడుతూ, తొండం నేలకు ఆనించి సంతాపం తెలిపింది. 20 సంవత్సరాలుగా పీఠాధిపతితో గజలక్ష్మికున్న అనుబంధాన్ని ఈ హృదయ విదారక దృశ్యం కళ్ళకు కట్టింది.

Andhra Pradesh: ఇదేం పద్దతిరా నాయన.. వర్షం కోసం గాడిదలకు పెళ్లి.. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడంటే..?

Andhra Pradesh: ఇదేం పద్దతిరా నాయన.. వర్షం కోసం గాడిదలకు పెళ్లి.. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడంటే..?

నైరుతి రుతుపవనాలు వచ్చినా తెలుగు రాష్ట్రాల వాన చినుకు జాడ కనిపించడం లేదు. వర్షాకాలం మొదలై చాలా రోజులైనా వర్షాలు కనుకరించడం లేదు. దీంతో కరువు పరిస్థితులు దాపురించాయి. రైతులు వర్షాల్లేక అల్లాడిపోతున్నాయి. వాన చినుకు కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో..