AP News: పెట్రోల్ పోయించుకుని బయటకు రాగానే మొరాయించిన బండి.. ఏంటని చూడగా.!
పెట్రోలు బంకులో పెట్రోలుకు బదులు వాటర్ రావడం ఎక్కడైనా చూశారా? అవును ఓ పెట్రోలు బంకులో వాహనదారులు పెట్రోలు కొట్టించుకొని వెళ్లిన కాసేపటికే వాహనాలు అన్నీ అగిపోయాయి. దాంతో ఏం జరిగిందో నని చెక్ చేసిన వాహనదారులు తమ బైకులో ఉన్న పెట్రోల్లో..
పెట్రోలు బంకులో పెట్రోలుకు బదులు వాటర్ రావడం ఎక్కడైనా చూశారా? అవును ఓ పెట్రోలు బంకులో వాహనదారులు పెట్రోలు కొట్టించుకొని వెళ్లిన కాసేపటికే వాహనాలు అన్నీ అగిపోయాయి. దాంతో ఏం జరిగిందో నని చెక్ చేసిన వాహనదారులు తమబైకులో ఉన్న పెట్రోల్లో వాటర్ను గుర్తించారు. వెంటనే వాహనాలతో పెట్రోలుబంక్కు వెళ్లి ఆందోళనకు దిగారు. ఈ ఘటన విజయవాడలో చోటు చేసుకుంది.
అజిత్సింగ్నగర్ ఆంధ్రప్రభకాలనీలోని ఓ పెట్రోల్ బంక్లో ఆదివారం ఉదయం పెట్రోల్తో పాటు నీళ్లు కూడా రావడంతో తీవ్ర గందరగోళం ఏర్పడింది. ఉదయం వేళ పెట్రోల్ కొట్టించుకున్న వాహనదారులు.. కొద్ది దూరం వెళ్లగానే వారి బైకులు నిలిచిపోయాయి. ముందుగా ఇద్దరు వాహనదారులు బంక్ వద్దకు తిరిగి రాగా.. వారు పెట్రోల్ బయటకు తీసి చూస్తే ట్యాంకులో పెట్రోల్తో పాటు నీళ్లు కనిపించాయి. కొంతసేపటికి.. మరికొంత మంది బంక్వద్దకు తిరిగి వచ్చారు.
ఇలా అక్కడ పెట్రోల్ పోయించుకుని, వాహనాలు ఆగిపోయిన వారు దాదాపు 30 మంది వెనక్కి తిరిగి వచ్చి బంక్ వద్ద ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న అజిత్సింగ్నగర్ పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. బంక్ యజమాని స్పందించి.. బాధితుల వాహనాలను మరమ్మతులు చేయిస్తానని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. అప్పటికపుడు మెకానిక్లను పిలిపించి.. నీళ్లు కలిసిన పెట్రోల్ను ట్యాంకుల నుంచి తొలగించారు. ఇంజిన్లను శుభ్రం చేయించారు. దీంతో వ్యవహారం సద్దుమణిగింది. కాగా, పెట్రోల్ బంక్పై ఏర్పాటు చేసిన ఎయిర్ పైపు నుంచి వర్షం నీళ్లు పెట్రోల్ ట్యాంకులోకి చేరాయని అందువల్లే పెట్రోలులో నీళ్లు కలిశాయని, అది కేవలం పైపులో ఉన్నంతవరకే నీళ్లు కలిశాయని, బంకులో ఉన్న పెట్రోలులోకి నీరు చేరలేదని బంక్ యజమాని తెలిపారు. వెంటనే పైపును సరిచేసినట్టు చెప్పారు.
ఇది చదవండి: పట్టాలపై ఎద్దుల భీకర ఫైట్.. అంతలో దూసుకొచ్చిన రైలు.. ఆ తర్వాత ఇది సీన్
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..