AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఓర్నీ.! 40 ఏళ్ల వయసులో రెచ్చిపోతున్న రవితేజ హీరోయిన్.. చూస్తే మెంటలెక్కాల్సిందే

పైన పేర్కొన్న ఫోటోలోని సర్కిల్ చేసిన బ్యూటీని గుర్తుపట్టారా.? ఈమె ఒక్కప్పుడు టాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్‌గా కుర్రకారును ఓ ఊపు ఊపింది. తెలుగులో ఈ హీరోయిన్ చేసింది తక్కువ చిత్రాలే అయినప్పటికీ.. కన్నడ భాషలో మాత్రం టాప్ స్టార్స్ సరసన నటించి మెప్పించింది. అందం, అభినయంతో..

Tollywood: ఓర్నీ.! 40 ఏళ్ల వయసులో రెచ్చిపోతున్న రవితేజ హీరోయిన్.. చూస్తే మెంటలెక్కాల్సిందే
Actress
Ravi Kiran
|

Updated on: Jul 06, 2024 | 8:00 PM

Share

పైన పేర్కొన్న ఫోటోలోని సర్కిల్ చేసిన బ్యూటీని గుర్తుపట్టారా.? ఈమె ఒక్కప్పుడు టాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్‌గా కుర్రకారును ఓ ఊపు ఊపింది. తెలుగులో ఈ హీరోయిన్ చేసింది తక్కువ చిత్రాలే అయినప్పటికీ.. కన్నడ భాషలో మాత్రం టాప్ స్టార్స్ సరసన నటించి మెప్పించింది. అందం, అభినయం పరంగా మంచి మార్కులు కొట్టేసింది. అలాగే గ్లామర్ షోకు ఏమాత్రం అడ్డుచెప్పలేదు ఈ బ్యూటీ. సిల్వర్ స్క్రీన్‌కి ఈ అందాల భామ గుడ్‌బై చెప్పి.. 12 ఏళ్లు అయింది. అయితే ఇటీవల ఒక ఓటీటీ సినిమా ద్వారా మళ్లీ రీ-ఎంట్రీ ఇచ్చింది. కన్నడ కాంట్రోవర్సీ స్టార్ దర్శన్‌తో ‘భగవాన్’ అనే సినిమాలో నటించి.. ఈ భామ మంచి గుర్తింపు తెచ్చుకుంది. మేము ఎవరి గురించి మాట్లాడుతున్నామో.. మీకు ఈపాటికే అర్ధమై ఉంటుంది. ఆమె మరెవరో కాదు ‘డైసీ బోపన్న’.

ఈ భామ పేరు పెద్దగా తెలుగు ప్రేక్షకులకు తెలియదు. డైసీ హీరోయిన్‌గా తెలుగులో చేసింది కేవలం మూడు సినిమాలే.. కానీ కన్నడంలో 12 చిత్రాల్లో నటించింది. అలాగే ఆ ఇండస్ట్రీలో స్టార్ హీరోలు గణేష్, శివ రాజ్‌కుమార్, ఉపేంద్ర, దర్శన్‌లతో నటించి మెప్పించింది. తెలుగులో 2004లో రవితేజ నటించిన ‘చంటి’ సినిమాతో ఇండస్ట్రీలోకి అరంగేట్రం చేసింది. ‘బింబ’, ‘భగవాన్’, ‘గరమ్ మసాలా’, ‘జాక్‌పాట్’, ‘తవారిన సిరి’ లాంటి హిట్స్ తన ఖాతాలో వేసుకుంది.

సుమారు 11 ఏళ్ల పాటు సిల్వర్ స్క్రీన్‌పై హీరోయిన్‌గా మెరిసిన ఈ బ్యూటీ 2011లో అమిత్ జాజు అనే వ్యక్తిని పెళ్లాడి.. ఆ తర్వాత సినిమాలు దూరమైంది. డైసీ బోపన్న కెరీర్‌లో 2012లో కన్నడంలో వచ్చిన ‘క్రేజీ లోక’ చివరి సినిమా. ఇక ఇప్పుడు 12 ఏళ్ల తర్వాత 2024లో ‘రష్’ అనే ఓటీటీ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది డైసీ బోపన్న. ఇందులో రవిబాబు ప్రధాన పాత్రలో కనిపించగా.. దీనిని ఈటీవీ విన్ ఓటీటీలో చూడవచ్చు. కాగా, డైసీ బోపన్న తాజా ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. లేట్ ఎందుకు మీరూ ఓ లుక్కేయండి.

ఇది చదవండి: సంతకం కింద రెండు చుక్కలు పెట్టే అలవాటు మీకుందా.? దీని అర్ధం ఏంటో తెల్సా

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us