AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమెరికా నుంచి వచ్చినా స్వగ్రామానికి చేరుకోలేకపోయిన టెక్కీ.. మార్గమధ్యలోనే మింగేసిన మృత్యువు..

టెక్కీ తండ్రి ఫిర్యాదు మేరకు కారు డ్రైవర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. డ్రైవర్‌ నిర్లక్ష్యమే తమ నష్టానికి కారణమంటూ బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు.

అమెరికా నుంచి వచ్చినా స్వగ్రామానికి చేరుకోలేకపోయిన టెక్కీ.. మార్గమధ్యలోనే మింగేసిన మృత్యువు..
Accident
Jyothi Gadda
|

Updated on: Jan 31, 2023 | 11:39 AM

Share

అమెరికాకు వెళ్లిన సెటిల్‌ అయిన సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్ ఒకరు స్వస్థలానికి వస్తూ గుంటూరులో రోడ్డు ప్రమాదానికి గురై మృతిచెందాడు. ఆదివారం ఇంటికి తిరిగి వస్తుండగా వారు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది..వారి కారు అదుపు తప్పి రైలింగ్‌ను ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతుడి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. శనివారం అర్థరాత్రి రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో 36 ఏళ్ల టెక్కీ, అతని భార్య ఫ్టైల్‌ దిగారు. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాకు చెందిన దంపతులు స్వగ్రామానికి వెళ్లేందుకు టెక్కీ తండ్రి వారికోసం కారును ఏర్పాటు చేశారు. వాహనం నల్గొండ చేరుకున్న తర్వాత, డ్రైవర్ కరీముల్లా వాహనంపై నియంత్రణ కోల్పోయాడు. వేగం అదుపు తప్పి రైలింగ్‌ను ఢీకొట్టింది. నల్గొండ శివార్లలోని వ్యవసాయ పొలంలోకి దూసుకెళ్లింది.

ప్రమాదంలో సాఫ్ట్‌వేర్‌ అక్కడికక్కడే మృతి చెందగా, అతని భార్య, డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన బాటసారులు పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన మహిళ, డ్రైవర్‌ను ఆస్పత్రికి తరలించారు. టెక్కీ తండ్రి ఫిర్యాదు మేరకు కారు డ్రైవర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. డ్రైవర్‌ నిర్లక్ష్యమే తమ నష్టానికి కారణమంటూ బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు. పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించగా, అతివేగమే ప్రమాదానికి కారణమై ఉండొచ్చని భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..